'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ నటి రష్మిక.. మరోసారి వార్తల్లో నిలిచింది. జనవరి 16న కర్ణాటకలోని ఈ అమ్మడు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వారు లెక్కల్లో చూపని రూ.25 లక్షల సొమ్ముతోపాటు రూ3.94 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అంతేకాకుండా 2016-17 మధ్య కాలంలో రూ.1.5 కోట్లకు రష్మిక పన్ను చెల్లించలేదంటూ తాజాగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇటీవల రష్మిక, ఆమె తండ్రి మదన్ మైసూర్లోని ఐటీశాఖ కార్యాలయానికి చేరుకుని పలు డాక్యూమెంట్లను అధికారులకు అందజేశారు.
![Rashmika Mandanna IT raids](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5813432_rashmika2222.jpg)
టాలీవుడ్ హీరో నితిన్, రష్మిక కాంబినేషన్లో 'భీష్మ' సినిమా తెరకెక్కింది. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ప్రముఖ నటుడు కార్తీ సరసన తమిళ సినిమా 'సుల్తాన్'లోనూ నటిస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రానున్న ఓ చిత్రంలోనూ కథానాయికగా ఈ అందాల భామ ఎంపికైంది.