దీపావళి పండగ వేళ సినీ నటుడు రాజశేఖర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ (93) మరణించారు. గతకొంతకాలగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ, గురువారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
వరదరాజన్ చెన్నై డీసీపీగా చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాజశేఖర్ ఆయనకు రెండో సంతానం. వరదరాజన్ భౌతికకాయాన్ని శుక్రవారం, చెన్నై తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
