అలనాటి అపురూప సీరియల్స్లో 'మహాభారతం' ఒకటి. దీనితోపాటే 'రామాయణం', 'శక్తిమాన్', 'చాణక్య' తదితర సీరియల్స్.. ప్రజల్లో ఎంతో ఆదరణ దక్కించుకున్నాయి. భారత్లో ప్రస్తుతం లాక్డౌన్ విధించిన సందర్భంగా, ప్రజల విజ్ఞప్తి మేరకు వాటిని మళ్లీ దూరదర్శన్లో ప్రసారం చేస్తున్నారు. అందులో భాగంగా మహాభారతాన్ని.. గత నెల 28 నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 12 , రాత్రి 7 గంటలకు ప్రదర్శిస్తున్నారు. రవి చోప్రా దర్శకత్వం వహించిన ఈ సీరియల్ను బీఆర్ చోప్రా నిర్మించారు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు..
1. 'మహాభారతం'.. దూరదర్శన్లో ప్రసారమై ఇప్పటికి 32 ఏళ్లయింది. 1988 అక్టోబరు 2న తొలిసారి ఈ సీరియల్ టీవీలో ప్రదర్శించారు. మొత్తంగా 94 ఎపిసోడ్లు ఉన్నాయి.
2. ఈ సీరియల్కు ఏకంగా 8.9 రేటింగ్ వచ్చింది. ఇలా దేశంలో ప్రముఖ టీవీ సీరియల్స్లో ఒకటిగా నిలిచింది.
3. వేదవ్యాసుడు రచించిన 'మహాభారతం' ఆధారంగా చేసుకుని ఈ సీరియల్ను తీశారు.
4. దీనిని తీసేందుకు పలు పరిశోధనలు చేసిన రచయిత సతీశ్ భట్నగర్, అతని బృందం.. మహాభారతం గురించి వివిధ భాషల్లో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలపై అధ్యయనం చేసింది.
5. ఈ సీరియల్ తీసేందుకు రూ.9 కోట్లు ఖర్చయింది.
6. బీఆర్ చోప్రా మహాభారతం సీరియల్కు బలమైన కథ రాశారు. ముఖ్య పాత్రను పలు భాషల్లో దిలీప్ కుమార్, ఎన్టీరామారావు వంటి దిగ్గజ నటులు పోషించాలని భావించారు.
7. బీఆర్ చోప్రా బృందం 1986లో దూరదర్శన్కు మొత్తం 194 ఎపిసోడ్లు అందించారు. అయితే 1988లో 94 ఎపిసోడ్లు ప్రసారం చేశారు.
8. ప్రఖ్యాత ఉర్దూ కవి, దివంగత రాహి మసూమ్ రాజా ఈ ధారావాహికకు స్క్రిప్ట్ రాశారు. ఈయన 'మైన్ తులసి తేరే అంగన్ కీ', 'మిలీ అండ్ లామ్హే' వంటి బాలీవుడ్ హిట్ సినిమాలకు స్క్రిప్ట్ రాశారు.
9. ఈ ధారావాహికలో నటించేందుకు ఏకంగా 15 వేల మంది ఆసక్తి చూపించారు. చివరగా స్క్రీన్ టెస్టులు చేసి, 1500 మందికి అవకాశం ఇచ్చారు.
10. గుఫీ పెంటల్.. ఈ సీరియల్కు క్యాస్టింగ్ డైరెక్టర్. ఇందులోని శకుని పాత్రను ఈయనే పోషించాడు. వివిధ పాత్రల కోసం నటుల్ని ఎంపిక చేసేందుకు ఏకంగా 8 నెలల సమయం తీసుకున్నాడు.
11. ద్రౌపది పాత్ర కోసం జూహి చావ్లాను ఎంపిక చేశారు. కానీ ఆమె 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాలో అవకాశం రావడం వల్ల ఈ పాత్ర చేసేందుకు నిరాకరించింది. తర్వాత ఆ పాత్రకు రూపా గంగూలీ ఎంపికైంది.
12. ఈ సీరియల్లోని యుద్ధ సన్నివేశాలు తీసేందుకు చాలా కష్టపడ్డారు. జైపుర్ నుంచి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాటిని చిత్రీకరించారు.
- ఈ సీరియల్లో కర్ణ పాత్రను హెచ్టీ పంకజ్ ధీర్ పోషించారు. కనీసం వ్యాన్లు, మేకప్ గదులు లేకపోవడం వల్ల, కేవలం గుడారాల్లోనే గడిపారు నటీనటులు. 40 మందికి ఒక్క టాయిలెట్ మాత్రమే ఉండేది. సాధారణంగా ఇలాంటి వాటికి దుస్తుల అధిక బరువు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు.
13. కురుక్షేత్ర యుద్ధం షూటింగ్ సమయంలో పంకజ్ ధీర్కు పెద్ద ప్రమాదమే జరిగింది. అతను ప్రయాణిస్తున్న రథం మార్గమధ్యలో విరిగిపోయింది. ఓ బాణం.. ఆయనకు తగలడం వల్ల శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.
14. భీష్ముడి పాత్ర పోషించిన ముఖేశ్ ఖన్నాకు దుర్యోధనుడి పాత్ర చేసే అవకాశం వచ్చింది. కానీ ప్రతికూల పాత్ర పోషిందేందుకు ఆయన అంగీకరించలేదు.
15. తన చిరునవ్వుతో కృష్ణుడి పాత్రను నితీశ్ భరద్వాజ్ కైవసం చేసుకున్నాడు. ఆయన నవ్వు ఆకట్టుకుంటుందని భావించిన రవి చోప్రా.. ఆ పాత్రకు ఆయన్ని ఎంపిక చేశారు.
16. శ్రీ కృష్ణుడి పాత్ర పోషించిన నితీశ్, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నిజంగా అతడే శ్రీకృష్ణుడని భావించి ప్రజలు అతని పాదాలను తాకిన సందర్భాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
17. సీరియల్లో భీముడిగా నటించిన ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించాడు.
18. నకులుడు, సహదేవుడిగా నటించిన సమీర్ చిత్రే, సంజీవ్ చిత్రే సొంత అన్నదమ్ములు.
19. ఫిరోజ్ ఖాన్ను అర్జునుడి పాత్రకు ఖరారు చేయక ముందు దానికోసం జాకీ ష్రాఫ్ను అనుకున్నారు.
20. ఎంతో ప్రాచుర్యం పొందిన మాయా మహాల్ను సృష్టించేందుకు క్రోమా టెక్నిక్ను ఉపయోగించారు. దుర్యోధనుడు జారే సరస్సును సృష్టించడానికి నిర్మాణ బృందం థర్మోకోల్ పౌడర్ను ఉపయోగించింది. ఈ డిజైన్ తయారు చేయడానికి రెండు రోజులు పట్టింది.
21. ద్రౌపది వస్త్రాపహరణానికి ఏకంగా 250 మీటర్ల పొడవైన చీరను ఉపయోగించారు. ఇందుకు రూప గంగూలీ 6 మీటర్ల పొడవైన చీర ధరించింది.
22. ఈ సీరియల్లో కనిపించిన నటులందరూ కొత్తవారే. భరతుడిగా రాజ్ బబ్బర్ నటించాడు.
ఇదీ చదవండి: పవర్స్టార్.. సూపర్స్టార్ కాంబినేషన్కు 12 ఏళ్లు