ETV Bharat / sitara

'మహాభారతం' సీరియల్​ గురించి ఆసక్తికర విషయాలు - మహాభారతం

గతంలో ప్రసారమై, అద్భుత ఆదరణ దక్కించుకున్న 'మహాభారతం' సీరియల్.. ప్రస్తుతం లాక్​డౌన్ సందర్భంగా మళ్లీ దూరదర్శన్​లో ప్రసారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సీరియల్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.

'మహాభారతం' సీరియల్​ గురించి ఆసక్తికర విషయాలు
'మహాభారతం' సీరియల్
author img

By

Published : Apr 3, 2020, 1:34 PM IST

Updated : Apr 3, 2020, 3:07 PM IST

అలనాటి అపురూప సీరియల్స్​లో 'మహాభారతం' ఒకటి. దీనితోపాటే 'రామాయణం', 'శక్తిమాన్', 'చాణక్య' తదితర సీరియల్స్.. ప్రజల్లో ఎంతో ఆదరణ దక్కించుకున్నాయి. భారత్​లో ప్రస్తుతం లాక్​డౌన్ విధించిన సందర్భంగా, ప్రజల విజ్ఞప్తి మేరకు వాటిని మళ్లీ దూరదర్శన్​లో ప్రసారం చేస్తున్నారు. అందులో భాగంగా మహాభారతాన్ని.. గత నెల 28 నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 12 , రాత్రి 7 గంటలకు ప్రదర్శిస్తున్నారు. రవి చోప్రా దర్శకత్వం వహించిన ఈ సీరియల్​ను బీఆర్ చోప్రా నిర్మించారు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు..

The Iconic TV Show Mahabharat
దూరదర్శన్​లో 'మహాభారతం' సీరియల్ పునఃప్రసారం

1. 'మహాభారతం'.. దూరదర్శన్​లో ప్రసారమై ఇప్పటికి 32 ఏళ్లయింది. 1988 అక్టోబరు 2న తొలిసారి ఈ సీరియల్ టీవీలో ప్రదర్శించారు. మొత్తంగా 94 ఎపిసోడ్లు ఉన్నాయి.

2. ఈ సీరియల్​కు ఏకంగా 8.9 రేటింగ్​ వచ్చింది. ఇలా దేశంలో ప్రముఖ టీవీ సీరియల్స్​లో ఒకటిగా నిలిచింది.

3. వేదవ్యాసుడు రచించిన 'మహాభారతం' ఆధారంగా చేసుకుని ఈ సీరియల్​ను తీశారు.

4. దీనిని తీసేందుకు పలు పరిశోధనలు చేసిన రచయిత సతీశ్ భట్నగర్​, అతని బృందం.. మహాభారతం గురించి వివిధ భాషల్లో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలపై అధ్యయనం చేసింది.

5. ఈ సీరియల్ తీసేందుకు రూ.9 కోట్లు ఖర్చయింది.

6. బీఆర్​ చోప్రా మహాభారతం సీరియల్​కు బలమైన కథ రాశారు. ముఖ్య పాత్రను పలు భాషల్లో దిలీప్​ కుమార్​, ఎన్టీరామారావు వంటి దిగ్గజ నటులు పోషించాలని భావించారు.

7. బీఆర్​ చోప్రా బృందం 1986లో దూరదర్శన్​కు మొత్తం 194 ఎపిసోడ్లు అందించారు. అయితే 1988లో 94 ఎపిసోడ్లు ప్రసారం చేశారు.

8. ప్రఖ్యాత ఉర్దూ కవి, దివంగత రాహి మసూమ్ రాజా ఈ ధారావాహికకు స్క్రిప్ట్ రాశారు. ఈయన 'మైన్​ తులసి తేరే అంగన్ కీ', 'మిలీ అండ్​ లామ్హే' వంటి బాలీవుడ్​ హిట్ సినిమాలకు స్క్రిప్ట్​ రాశారు.

9. ఈ ధారావాహికలో నటించేందుకు ఏకంగా 15 వేల మంది ఆసక్తి చూపించారు. చివరగా స్క్రీన్ టెస్టులు చేసి, 1500 మందికి అవకాశం ఇచ్చారు.

10. గుఫీ పెంటల్.. ఈ సీరియల్​కు క్యాస్టింగ్​ డైరెక్టర్. ఇందు​లోని శకుని పాత్రను ఈయనే పోషించాడు. వివిధ పాత్రల కోసం నటుల్ని ఎంపిక చేసేందుకు ఏకంగా 8 నెలల సమయం తీసుకున్నాడు.

11. ద్రౌపది పాత్ర కోసం జూహి చావ్లాను ఎంపిక చేశారు. కానీ ఆమె 'ఖయామత్ సే ఖయామత్ తక్‌' సినిమాలో అవకాశం రావడం వల్ల ఈ పాత్ర చేసేందుకు నిరాకరించింది. తర్వాత ఆ పాత్రకు రూపా గంగూలీ ఎంపికైంది.

12. ఈ సీరియల్​లోని యుద్ధ సన్నివేశాలు తీసేందుకు చాలా కష్టపడ్డారు. జైపుర్​ నుంచి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాటిని చిత్రీకరించారు.

- ఈ సీరియల్​లో కర్ణ పాత్రను హెచ్​టీ పంకజ్​ ధీర్ పోషించారు. కనీసం వ్యాన్లు, మేకప్​ గదులు లేకపోవడం వల్ల, కేవలం గుడారాల్లోనే గడిపారు నటీనటులు. 40 మందికి ఒక్క టాయిలెట్​ మాత్రమే ఉండేది. సాధారణంగా ఇలాంటి వాటికి దుస్తుల అధిక బరువు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు.

13. కురుక్షేత్ర యుద్ధం షూటింగ్​ సమయంలో పంకజ్​ ధీర్​కు పెద్ద ప్రమాదమే జరిగింది. అతను ప్రయాణిస్తున్న రథం మార్గమధ్యలో విరిగిపోయింది. ఓ బాణం.. ఆయనకు తగలడం వల్ల శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

14. భీష్ముడి పాత్ర పోషించిన ముఖేశ్​ ఖన్నాకు దుర్యోధనుడి పాత్ర చేసే అవకాశం వచ్చింది. కానీ ప్రతికూల పాత్ర పోషిందేందుకు ఆయన అంగీకరించలేదు.

15. తన చిరునవ్వుతో కృష్ణుడి పాత్రను నితీశ్​ భరద్వాజ్​ కైవసం చేసుకున్నాడు. ఆయన నవ్వు ఆకట్టుకుంటుందని భావించిన రవి చోప్రా.. ఆ పాత్రకు ఆయన్ని ఎంపిక చేశారు.

nithish bharadwaj
కృష్ణుడి పాత్రలో నితీశ్ భరద్వాజ్

16. శ్రీ కృష్ణుడి పాత్ర పోషించిన నితీశ్​, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నిజంగా అతడే శ్రీకృష్ణుడని భావించి ప్రజలు అతని పాదాలను తాకిన సందర్భాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

17. సీరియల్‌లో భీముడిగా నటించిన ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున ఒలింపిక్స్​లో పాల్గొన్నాడు. ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించాడు.

18. నకులుడు, సహదేవుడిగా నటించిన సమీర్​ చిత్రే, సంజీవ్​ చిత్రే సొంత అన్నదమ్ములు.

19. ఫిరోజ్ ఖాన్​ను అర్జునుడి పాత్రకు ఖరారు చేయక ముందు దానికోసం జాకీ ష్రాఫ్​ను అనుకున్నారు.

20. ఎంతో ప్రాచుర్యం పొందిన మాయా మహాల్​ను సృష్టించేందుకు క్రోమా టెక్నిక్​ను ఉపయోగించారు. దుర్యోధనుడు జారే సరస్సును సృష్టించడానికి నిర్మాణ బృందం థర్మోకోల్ పౌడర్‌ను ఉపయోగించింది. ఈ డిజైన్ తయారు చేయడానికి రెండు రోజులు పట్టింది.

21. ద్రౌపది వస్త్రాపహరణానికి ఏకంగా 250 మీటర్ల పొడవైన చీరను ఉపయోగించారు. ఇందుకు రూప గంగూలీ 6 మీటర్ల పొడవైన చీర ధరించింది.

22. ఈ సీరియల్​లో కనిపించిన నటులందరూ కొత్తవారే. భరతుడిగా రాజ్​ బబ్బర్ నటించాడు.

ఇదీ చదవండి: పవర్​స్టార్.. సూపర్​స్టార్ కాంబినేషన్​కు 12 ఏళ్లు

అలనాటి అపురూప సీరియల్స్​లో 'మహాభారతం' ఒకటి. దీనితోపాటే 'రామాయణం', 'శక్తిమాన్', 'చాణక్య' తదితర సీరియల్స్.. ప్రజల్లో ఎంతో ఆదరణ దక్కించుకున్నాయి. భారత్​లో ప్రస్తుతం లాక్​డౌన్ విధించిన సందర్భంగా, ప్రజల విజ్ఞప్తి మేరకు వాటిని మళ్లీ దూరదర్శన్​లో ప్రసారం చేస్తున్నారు. అందులో భాగంగా మహాభారతాన్ని.. గత నెల 28 నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 12 , రాత్రి 7 గంటలకు ప్రదర్శిస్తున్నారు. రవి చోప్రా దర్శకత్వం వహించిన ఈ సీరియల్​ను బీఆర్ చోప్రా నిర్మించారు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు..

The Iconic TV Show Mahabharat
దూరదర్శన్​లో 'మహాభారతం' సీరియల్ పునఃప్రసారం

1. 'మహాభారతం'.. దూరదర్శన్​లో ప్రసారమై ఇప్పటికి 32 ఏళ్లయింది. 1988 అక్టోబరు 2న తొలిసారి ఈ సీరియల్ టీవీలో ప్రదర్శించారు. మొత్తంగా 94 ఎపిసోడ్లు ఉన్నాయి.

2. ఈ సీరియల్​కు ఏకంగా 8.9 రేటింగ్​ వచ్చింది. ఇలా దేశంలో ప్రముఖ టీవీ సీరియల్స్​లో ఒకటిగా నిలిచింది.

3. వేదవ్యాసుడు రచించిన 'మహాభారతం' ఆధారంగా చేసుకుని ఈ సీరియల్​ను తీశారు.

4. దీనిని తీసేందుకు పలు పరిశోధనలు చేసిన రచయిత సతీశ్ భట్నగర్​, అతని బృందం.. మహాభారతం గురించి వివిధ భాషల్లో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలపై అధ్యయనం చేసింది.

5. ఈ సీరియల్ తీసేందుకు రూ.9 కోట్లు ఖర్చయింది.

6. బీఆర్​ చోప్రా మహాభారతం సీరియల్​కు బలమైన కథ రాశారు. ముఖ్య పాత్రను పలు భాషల్లో దిలీప్​ కుమార్​, ఎన్టీరామారావు వంటి దిగ్గజ నటులు పోషించాలని భావించారు.

7. బీఆర్​ చోప్రా బృందం 1986లో దూరదర్శన్​కు మొత్తం 194 ఎపిసోడ్లు అందించారు. అయితే 1988లో 94 ఎపిసోడ్లు ప్రసారం చేశారు.

8. ప్రఖ్యాత ఉర్దూ కవి, దివంగత రాహి మసూమ్ రాజా ఈ ధారావాహికకు స్క్రిప్ట్ రాశారు. ఈయన 'మైన్​ తులసి తేరే అంగన్ కీ', 'మిలీ అండ్​ లామ్హే' వంటి బాలీవుడ్​ హిట్ సినిమాలకు స్క్రిప్ట్​ రాశారు.

9. ఈ ధారావాహికలో నటించేందుకు ఏకంగా 15 వేల మంది ఆసక్తి చూపించారు. చివరగా స్క్రీన్ టెస్టులు చేసి, 1500 మందికి అవకాశం ఇచ్చారు.

10. గుఫీ పెంటల్.. ఈ సీరియల్​కు క్యాస్టింగ్​ డైరెక్టర్. ఇందు​లోని శకుని పాత్రను ఈయనే పోషించాడు. వివిధ పాత్రల కోసం నటుల్ని ఎంపిక చేసేందుకు ఏకంగా 8 నెలల సమయం తీసుకున్నాడు.

11. ద్రౌపది పాత్ర కోసం జూహి చావ్లాను ఎంపిక చేశారు. కానీ ఆమె 'ఖయామత్ సే ఖయామత్ తక్‌' సినిమాలో అవకాశం రావడం వల్ల ఈ పాత్ర చేసేందుకు నిరాకరించింది. తర్వాత ఆ పాత్రకు రూపా గంగూలీ ఎంపికైంది.

12. ఈ సీరియల్​లోని యుద్ధ సన్నివేశాలు తీసేందుకు చాలా కష్టపడ్డారు. జైపుర్​ నుంచి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాటిని చిత్రీకరించారు.

- ఈ సీరియల్​లో కర్ణ పాత్రను హెచ్​టీ పంకజ్​ ధీర్ పోషించారు. కనీసం వ్యాన్లు, మేకప్​ గదులు లేకపోవడం వల్ల, కేవలం గుడారాల్లోనే గడిపారు నటీనటులు. 40 మందికి ఒక్క టాయిలెట్​ మాత్రమే ఉండేది. సాధారణంగా ఇలాంటి వాటికి దుస్తుల అధిక బరువు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు.

13. కురుక్షేత్ర యుద్ధం షూటింగ్​ సమయంలో పంకజ్​ ధీర్​కు పెద్ద ప్రమాదమే జరిగింది. అతను ప్రయాణిస్తున్న రథం మార్గమధ్యలో విరిగిపోయింది. ఓ బాణం.. ఆయనకు తగలడం వల్ల శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

14. భీష్ముడి పాత్ర పోషించిన ముఖేశ్​ ఖన్నాకు దుర్యోధనుడి పాత్ర చేసే అవకాశం వచ్చింది. కానీ ప్రతికూల పాత్ర పోషిందేందుకు ఆయన అంగీకరించలేదు.

15. తన చిరునవ్వుతో కృష్ణుడి పాత్రను నితీశ్​ భరద్వాజ్​ కైవసం చేసుకున్నాడు. ఆయన నవ్వు ఆకట్టుకుంటుందని భావించిన రవి చోప్రా.. ఆ పాత్రకు ఆయన్ని ఎంపిక చేశారు.

nithish bharadwaj
కృష్ణుడి పాత్రలో నితీశ్ భరద్వాజ్

16. శ్రీ కృష్ణుడి పాత్ర పోషించిన నితీశ్​, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నిజంగా అతడే శ్రీకృష్ణుడని భావించి ప్రజలు అతని పాదాలను తాకిన సందర్భాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

17. సీరియల్‌లో భీముడిగా నటించిన ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున ఒలింపిక్స్​లో పాల్గొన్నాడు. ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించాడు.

18. నకులుడు, సహదేవుడిగా నటించిన సమీర్​ చిత్రే, సంజీవ్​ చిత్రే సొంత అన్నదమ్ములు.

19. ఫిరోజ్ ఖాన్​ను అర్జునుడి పాత్రకు ఖరారు చేయక ముందు దానికోసం జాకీ ష్రాఫ్​ను అనుకున్నారు.

20. ఎంతో ప్రాచుర్యం పొందిన మాయా మహాల్​ను సృష్టించేందుకు క్రోమా టెక్నిక్​ను ఉపయోగించారు. దుర్యోధనుడు జారే సరస్సును సృష్టించడానికి నిర్మాణ బృందం థర్మోకోల్ పౌడర్‌ను ఉపయోగించింది. ఈ డిజైన్ తయారు చేయడానికి రెండు రోజులు పట్టింది.

21. ద్రౌపది వస్త్రాపహరణానికి ఏకంగా 250 మీటర్ల పొడవైన చీరను ఉపయోగించారు. ఇందుకు రూప గంగూలీ 6 మీటర్ల పొడవైన చీర ధరించింది.

22. ఈ సీరియల్​లో కనిపించిన నటులందరూ కొత్తవారే. భరతుడిగా రాజ్​ బబ్బర్ నటించాడు.

ఇదీ చదవండి: పవర్​స్టార్.. సూపర్​స్టార్ కాంబినేషన్​కు 12 ఏళ్లు

Last Updated : Apr 3, 2020, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.