ETV Bharat / science-and-technology

భారత్​లో టిక్​టాక్ రీఎంట్రీ.. చిన్న మార్పుతో!

author img

By

Published : Jul 21, 2021, 4:28 PM IST

టిక్​టాక్​ ప్రియులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ప్రముఖ షార్ట్​ వీడియో మేకింగ్​ యాప్​ టిక్​టాక్​ తిరిగి భారత్​లో రీఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ పేటెంట్స్​, డిజైన్​, ట్రేడ్​మార్క్స్​ (సీజీపీడీటీఎం)కు దరఖాస్తు చేసిందనే వార్త సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది.

TikTok Might Return
టిక్​టాక్​ రీ ఎంట్రీ, టిక్​టాక్​

భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు హాని కలిగిస్తోందనే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం చేత వేటుకు గురైన ప్రముఖ షార్ట్​ వీడియో మేకింగ్​ ఫ్లాట్​ఫాం టిక్​టాక్ తిరిగి భారత్​లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.​ ఇప్పటికే టిక్​టాక్​ లేని లోటును పూరించడానికి ప్రముఖ సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్​, ఇన్​స్టాగ్రామ్​లు వేర్వేరు పేర్లతో నెటిజన్ల ముందుకు వచ్చాయి. కానీ అవి అంతగా ప్రభావం చూపలోకపోయాయి. దీంతో ట్రెండ్​ సెట్టర్​గా నిలిచిన టిక్​టాక్ తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు తిరిగి భారత​ మార్కెట్​లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది.

టెక్నాలజీకి సంబంధించిన కొన్ని వార్తా సంస్థల కథనాల ప్రకారం.. టిక్​టాక్​ మాతృసంస్థ అయిన బైట్​డ్యాన్స్ ఆ అప్లికేషన్​ పేరులోని కొన్ని అక్షరాలు మార్చి అంటే.. ఈ TikTok కాస్తా TickTock పేరుతో అదే కంటెంట్​తో తిరిగి భారతీయ మార్కెట్​లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా అనుమతులు పొందేలా ప్రయత్నిస్తోందట. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ పేటెంట్స్​, డిజైన్​, ట్రేడ్​మార్క్స్​ (సీజీపీడీటీఎం)కు దరఖాస్తు చేసిందట.

కొత్త పేరుతో వస్తోన్న అప్లికేషన్​లో కూడా గతంలోలానే మల్టీ మీడియా ఎంటర్​టైన్మెంట్ కంటెంట్​తో పాటు మల్టీ మీడియా ఇంట్రాక్టివ్​ అప్లికేషన్లను కూడా తీసుకువస్తున్నారు. నిజానికి ఇది భారత్​ నిషేధించిన యాప్​ లాంటిదే. అయితే ఇది పక్కాగా ఎప్పుడు మనదేశంలో లాంచ్​ చేస్తారు అనే దానిపై ఎవరి దగ్గరా పూర్తిస్థాయి సమాచారం లేదు.

ఏదైమైనా.. భద్రతపరమైన సవాళ్లను ఎదుర్కోవాలి అంటే బైట్​డ్యాన్స్​ కొంత కష్టపడక తప్పదు. అంతేగాకుండా టిక్​టాక్​ ఆన్​లైన్ కంటెంట్​ను నిక్షిప్తం చేయడానికి తిరిగి చైనా సర్వర్లను ఉపయోగిస్తే గతంలో చవి చూసిన చేదు అనుభవాలనే తిరిగి రుచి చూడాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: చైనా సర్వర్లకు 'పబ్​జీ' కొత్త గేమ్​ డేటా?

భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు హాని కలిగిస్తోందనే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం చేత వేటుకు గురైన ప్రముఖ షార్ట్​ వీడియో మేకింగ్​ ఫ్లాట్​ఫాం టిక్​టాక్ తిరిగి భారత్​లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.​ ఇప్పటికే టిక్​టాక్​ లేని లోటును పూరించడానికి ప్రముఖ సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్​, ఇన్​స్టాగ్రామ్​లు వేర్వేరు పేర్లతో నెటిజన్ల ముందుకు వచ్చాయి. కానీ అవి అంతగా ప్రభావం చూపలోకపోయాయి. దీంతో ట్రెండ్​ సెట్టర్​గా నిలిచిన టిక్​టాక్ తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు తిరిగి భారత​ మార్కెట్​లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది.

టెక్నాలజీకి సంబంధించిన కొన్ని వార్తా సంస్థల కథనాల ప్రకారం.. టిక్​టాక్​ మాతృసంస్థ అయిన బైట్​డ్యాన్స్ ఆ అప్లికేషన్​ పేరులోని కొన్ని అక్షరాలు మార్చి అంటే.. ఈ TikTok కాస్తా TickTock పేరుతో అదే కంటెంట్​తో తిరిగి భారతీయ మార్కెట్​లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా అనుమతులు పొందేలా ప్రయత్నిస్తోందట. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ పేటెంట్స్​, డిజైన్​, ట్రేడ్​మార్క్స్​ (సీజీపీడీటీఎం)కు దరఖాస్తు చేసిందట.

కొత్త పేరుతో వస్తోన్న అప్లికేషన్​లో కూడా గతంలోలానే మల్టీ మీడియా ఎంటర్​టైన్మెంట్ కంటెంట్​తో పాటు మల్టీ మీడియా ఇంట్రాక్టివ్​ అప్లికేషన్లను కూడా తీసుకువస్తున్నారు. నిజానికి ఇది భారత్​ నిషేధించిన యాప్​ లాంటిదే. అయితే ఇది పక్కాగా ఎప్పుడు మనదేశంలో లాంచ్​ చేస్తారు అనే దానిపై ఎవరి దగ్గరా పూర్తిస్థాయి సమాచారం లేదు.

ఏదైమైనా.. భద్రతపరమైన సవాళ్లను ఎదుర్కోవాలి అంటే బైట్​డ్యాన్స్​ కొంత కష్టపడక తప్పదు. అంతేగాకుండా టిక్​టాక్​ ఆన్​లైన్ కంటెంట్​ను నిక్షిప్తం చేయడానికి తిరిగి చైనా సర్వర్లను ఉపయోగిస్తే గతంలో చవి చూసిన చేదు అనుభవాలనే తిరిగి రుచి చూడాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: చైనా సర్వర్లకు 'పబ్​జీ' కొత్త గేమ్​ డేటా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.