ETV Bharat / science-and-technology

రాజధానిలో విరివిగా రోబోటిక్​ ఆపరేషన్లు.. నెలకు 500కు పైనే..

author img

By

Published : Dec 29, 2022, 9:39 AM IST

Surgeries with Robotics : ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన రోబోటిక్​ల వైద్యం.. ఇప్పుడు మన దేశంలోని కార్పొరేట్​ ఆసుపత్రుల్లోనూ రాజ్యం ఏలుతోంది. క్యాన్సర్​ చికిత్సలో సుమారు 75 శాతం ఆపరేషన్లు రోబోటిక్స్​ ద్వారానే జరుగుతున్నాయంటే వాటి పాత్ర ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ చికిత్సల్లో ముంబయి, దిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలతో హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రులూ పోటీపడుతున్నాయి.

Surgeries with robotic
Surgeries with robotic

Surgeries with Robotics : కాలానుగుణంగా వైద్య రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా సులభతరం చేస్తున్నాయి. దీనికి ఉదాహరణే రోబోటిక్‌ పరిజ్ఞానం. 40 ఏళ్ల కిందట పెద్ద కోతలతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చేది. 25 ఏళ్ల కిందట ల్యాప్రోస్కోపిక్‌ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. గత పదేళ్లుగా రాష్ట్రంలో రోబోటిక్‌ పరికరాలతోనూ ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ రెండు మూడేళ్ల కిందటి వరకు నెలకు ఒకటో రెండో రోబోటిక్‌ శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రస్తుతం నెలకు కనీసం 500 వరకు జరుగుతున్నాయి.

ఈ చికిత్సల్లో ముంబయి, దిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలతో హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రులు పోటీపడుతున్నాయి. ఇప్పుడు 75 శాతం క్యాన్సర్‌ శస్త్రచికిత్సలను రోబోటిక్‌ విధానంలోనే చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని 50 మందికి పైగా వైద్యనిపుణులు రోబోటిక్‌ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వైద్యులు కూడా ఇక్కడికి శిక్షణ కోసం వస్తుండటం విశేషం. ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్‌ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రాకున్నా.. త్వరలోనే నిమ్స్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రులకు ఆయా పరికరాలను కొనుగోలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి.

ఎన్నో ప్రయోజనాలు..

  • రోబోటిక్‌ విధానంలో రోబోలకు 5, 8 మి.మీ. పొడవైన సర్జికల్‌ పరికరాలు అమర్చి ఉంటాయి. వాటిని ఉపయోగిస్తూ.. వైద్యులు ఆపరేషన్‌ చేస్తారు.
  • రోబో కెమెరాలో ‘త్రీ డైమన్షన్‌ (త్రీడీ)’ విజన్‌ ద్వారా శరీరంలోని అతి చిన్న కణాలను కూడా పెద్దగా, స్పష్టంగా చూడవచ్చు. రోబో చేతులు అతి తక్కువ కోతతో శరీరంలోకి ప్రవేశిస్తాయి.
  • రోబోలో ఉండే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరికరాల ద్వారా ఏ అవయవంలో కణజాలానికి ఎంత మేర కోత పెట్టాలో కచ్చితంగా తెలుసుకుని అనుసరించవచ్చు. అదనంగా పక్కనున్న ఒక రక్తనాళానికి, కణజాలానికి కూడా కోత పడే పరిస్థితి ఉండదు.
  • ఉదాహరణకు సాధారణ పద్ధతుల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఆపరేషన్‌కు 12-15 అంగుళాల మేర కోత పెట్టాల్సి ఉంటుంది. రోబో ద్వారా నాలుగు రంధ్రాలు, 8 మి.మీ. కోత పెడితే సరిపోతుంది. ఈ గాయం త్వరగా మానిపోతుంది.
  • వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నంత సేపు నిలబడాల్సిన అవసరం ఉండదు.
  • రోబో ద్వారా ఆపరేషన్లకు సుమారు రూ.2 లక్షల అదనపు వ్యయమైనా, ఆసుపత్రిలో ఉండాల్సిన రోజులు, ఆ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.
  • కొవిడ్‌ చికిత్సలో స్టెరాయిడ్‌లు వాడడం వల్ల కొందరికి 40 ఏళ్లు దాటకపోయినా తుంటి కీలులో రక్తప్రసరణ తగ్గిపోయింది. దీన్ని వైద్య పరిభాషలో ‘అవాస్క్యులర్‌ నెక్రోసిస్‌’ అంటారు. దీనికి తుంటి కీలును మార్చాల్సి వస్తుంది. రోబోటిక్‌ చికిత్స ద్వారా తుంటి, బంతి గిన్నెలను సమర్థంగా అమర్చడం సాధ్యమవుతోంది.
  • యూరాలజీ చికిత్సల్లో రోబో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. పెద్ద కోత ఉండదు కనుక ఇన్‌ఫెక్షన్‌ అవకాశాలు, రక్తస్రావం, రక్తం గడ్డ కట్టే ప్రమాదం, మందుల వాడకం అన్నీ తగ్గుతాయి. రోగి త్వరగా కోలుకుంటారు.

"మణికట్టు తిరిగినట్టు రోబో చేతులు కూడా 360 డిగ్రీల్లో తిరుగుతాయి. అవయవం ఏ దిశలో ఉన్నా సులువుగా కోత పెట్టవచ్చు. కుట్లు కూడా అతి సూక్ష్మంగా, సన్నగా అధునాతనంగా వేస్తుంది. మూత్రపిండాలు, వీర్యగ్రంధి (ప్రోస్టేట్‌), అన్నవాహిక, పెద్దపేగు, చిన్నపేగు, గొంతు, ఊపిరితిత్తులు, మలద్వారం వంటి అవయవాల్లో క్యాన్సర్‌ గడ్డలను తొలగించడానికి రోబోటిక్‌ పరికరాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కొందరు వృద్ధ వైద్యుల చేతులు ఆపరేషన్‌ చేసేటప్పుడు వణికితే ఇబ్బందే. రోబో సాయంతో 70-80 ఏళ్ల వయసు దాటిన వైద్యులు కూడా సులువుగా శస్త్రచికిత్సలు చేయగలరు."-డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావు, చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌

"ఆర్థోపెడిక్స్‌లో ఇప్పుడు 4జీ (ఫోర్త్‌ జనరేషన్‌) మ్యాకో రోబోను వినియోగిస్తున్నాం. దీంతో తుంటి కీలు, మోకీలు శస్త్రచికిత్సలు చేయొచ్చు. రోగి కీలు, ఎముకల కొలతలు తీసుకొని సరిగ్గా సరిపోయే కృత్రిమ కీలును రూపొందించడం ఈ రోబోతో సాధ్యమవుతుంది. తుంటి, బంతిగిన్నె కీళ్ల మార్పిడి ప్రక్రియలో అంతకుముందు ఇబ్బందులుండేవి. రోబోటిక్‌ విధానంలో అవి 100 శాతం కచ్చితంగా అమరుతాయి. తుంటి ఎముకను ఎక్కువగా తురమాల్సిన అవసరం తప్పుతుంది. రోగి రెండో రోజే నడుస్తారు. మా దగ్గరున్న రోబోటిక్‌ పరికరంతో మూడువేలకు పైగా శస్త్రచికిత్సలు చేశాం. ఈ విషయంలో ‘గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ అవార్డు గెలుచుకున్నాం".-డాక్టర్‌ కుశాల్‌ హిప్పాల్‌ గోవంకర్‌, రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌, కిమ్స్‌-సన్‌షైన్‌ హాస్పిటల్స్‌

"అమెరికా వంటి పాశ్చాత్య దేశాలతో పోల్చితే రోబోటిక్‌ విధానంలో చికిత్సకు మన దగ్గర తక్కువ ఖర్చు అవుతోంది. ఒక గదిలో కూర్చొని రోబోను నియంత్రిస్తూ డాక్టర్‌ శస్త్రచికిత్స చేస్తారు. రోగికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. రోబోకు నాలుగు మర చేతులుంటాయి. వాటితో అన్ని కోణాల్లో అవయవాలను చూస్తూ శస్త్రచికిత్స చేయొచ్చు. దీని ద్వారా ఆపరేషన్‌కు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. గుండె కవాటాల్లో మరమ్మతులు, మార్పిడులు ఈ పరిజ్ఞానంతోనే చేస్తున్నాం. శస్త్రచికిత్స అనంతరం కుట్లు చక్కగా వేయొచ్చు. రోబోటిక్‌ సర్జరీలను ఇప్పటికీ పెద్ద నగరాల్లోనే చేస్తున్నారు. ఇవి మున్ముందు విస్తరించే అవకాశాలున్నాయి."-డాక్టర్‌ గోపీచంద్‌ మన్నం, సీనియర్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్‌, స్టార్‌ హాస్పిటల్స్‌

ఇవీ చదవండి:

Surgeries with Robotics : కాలానుగుణంగా వైద్య రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా సులభతరం చేస్తున్నాయి. దీనికి ఉదాహరణే రోబోటిక్‌ పరిజ్ఞానం. 40 ఏళ్ల కిందట పెద్ద కోతలతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చేది. 25 ఏళ్ల కిందట ల్యాప్రోస్కోపిక్‌ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. గత పదేళ్లుగా రాష్ట్రంలో రోబోటిక్‌ పరికరాలతోనూ ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ రెండు మూడేళ్ల కిందటి వరకు నెలకు ఒకటో రెండో రోబోటిక్‌ శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రస్తుతం నెలకు కనీసం 500 వరకు జరుగుతున్నాయి.

ఈ చికిత్సల్లో ముంబయి, దిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలతో హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రులు పోటీపడుతున్నాయి. ఇప్పుడు 75 శాతం క్యాన్సర్‌ శస్త్రచికిత్సలను రోబోటిక్‌ విధానంలోనే చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని 50 మందికి పైగా వైద్యనిపుణులు రోబోటిక్‌ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వైద్యులు కూడా ఇక్కడికి శిక్షణ కోసం వస్తుండటం విశేషం. ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్‌ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రాకున్నా.. త్వరలోనే నిమ్స్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రులకు ఆయా పరికరాలను కొనుగోలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి.

ఎన్నో ప్రయోజనాలు..

  • రోబోటిక్‌ విధానంలో రోబోలకు 5, 8 మి.మీ. పొడవైన సర్జికల్‌ పరికరాలు అమర్చి ఉంటాయి. వాటిని ఉపయోగిస్తూ.. వైద్యులు ఆపరేషన్‌ చేస్తారు.
  • రోబో కెమెరాలో ‘త్రీ డైమన్షన్‌ (త్రీడీ)’ విజన్‌ ద్వారా శరీరంలోని అతి చిన్న కణాలను కూడా పెద్దగా, స్పష్టంగా చూడవచ్చు. రోబో చేతులు అతి తక్కువ కోతతో శరీరంలోకి ప్రవేశిస్తాయి.
  • రోబోలో ఉండే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరికరాల ద్వారా ఏ అవయవంలో కణజాలానికి ఎంత మేర కోత పెట్టాలో కచ్చితంగా తెలుసుకుని అనుసరించవచ్చు. అదనంగా పక్కనున్న ఒక రక్తనాళానికి, కణజాలానికి కూడా కోత పడే పరిస్థితి ఉండదు.
  • ఉదాహరణకు సాధారణ పద్ధతుల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఆపరేషన్‌కు 12-15 అంగుళాల మేర కోత పెట్టాల్సి ఉంటుంది. రోబో ద్వారా నాలుగు రంధ్రాలు, 8 మి.మీ. కోత పెడితే సరిపోతుంది. ఈ గాయం త్వరగా మానిపోతుంది.
  • వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నంత సేపు నిలబడాల్సిన అవసరం ఉండదు.
  • రోబో ద్వారా ఆపరేషన్లకు సుమారు రూ.2 లక్షల అదనపు వ్యయమైనా, ఆసుపత్రిలో ఉండాల్సిన రోజులు, ఆ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.
  • కొవిడ్‌ చికిత్సలో స్టెరాయిడ్‌లు వాడడం వల్ల కొందరికి 40 ఏళ్లు దాటకపోయినా తుంటి కీలులో రక్తప్రసరణ తగ్గిపోయింది. దీన్ని వైద్య పరిభాషలో ‘అవాస్క్యులర్‌ నెక్రోసిస్‌’ అంటారు. దీనికి తుంటి కీలును మార్చాల్సి వస్తుంది. రోబోటిక్‌ చికిత్స ద్వారా తుంటి, బంతి గిన్నెలను సమర్థంగా అమర్చడం సాధ్యమవుతోంది.
  • యూరాలజీ చికిత్సల్లో రోబో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. పెద్ద కోత ఉండదు కనుక ఇన్‌ఫెక్షన్‌ అవకాశాలు, రక్తస్రావం, రక్తం గడ్డ కట్టే ప్రమాదం, మందుల వాడకం అన్నీ తగ్గుతాయి. రోగి త్వరగా కోలుకుంటారు.

"మణికట్టు తిరిగినట్టు రోబో చేతులు కూడా 360 డిగ్రీల్లో తిరుగుతాయి. అవయవం ఏ దిశలో ఉన్నా సులువుగా కోత పెట్టవచ్చు. కుట్లు కూడా అతి సూక్ష్మంగా, సన్నగా అధునాతనంగా వేస్తుంది. మూత్రపిండాలు, వీర్యగ్రంధి (ప్రోస్టేట్‌), అన్నవాహిక, పెద్దపేగు, చిన్నపేగు, గొంతు, ఊపిరితిత్తులు, మలద్వారం వంటి అవయవాల్లో క్యాన్సర్‌ గడ్డలను తొలగించడానికి రోబోటిక్‌ పరికరాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కొందరు వృద్ధ వైద్యుల చేతులు ఆపరేషన్‌ చేసేటప్పుడు వణికితే ఇబ్బందే. రోబో సాయంతో 70-80 ఏళ్ల వయసు దాటిన వైద్యులు కూడా సులువుగా శస్త్రచికిత్సలు చేయగలరు."-డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావు, చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌

"ఆర్థోపెడిక్స్‌లో ఇప్పుడు 4జీ (ఫోర్త్‌ జనరేషన్‌) మ్యాకో రోబోను వినియోగిస్తున్నాం. దీంతో తుంటి కీలు, మోకీలు శస్త్రచికిత్సలు చేయొచ్చు. రోగి కీలు, ఎముకల కొలతలు తీసుకొని సరిగ్గా సరిపోయే కృత్రిమ కీలును రూపొందించడం ఈ రోబోతో సాధ్యమవుతుంది. తుంటి, బంతిగిన్నె కీళ్ల మార్పిడి ప్రక్రియలో అంతకుముందు ఇబ్బందులుండేవి. రోబోటిక్‌ విధానంలో అవి 100 శాతం కచ్చితంగా అమరుతాయి. తుంటి ఎముకను ఎక్కువగా తురమాల్సిన అవసరం తప్పుతుంది. రోగి రెండో రోజే నడుస్తారు. మా దగ్గరున్న రోబోటిక్‌ పరికరంతో మూడువేలకు పైగా శస్త్రచికిత్సలు చేశాం. ఈ విషయంలో ‘గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ అవార్డు గెలుచుకున్నాం".-డాక్టర్‌ కుశాల్‌ హిప్పాల్‌ గోవంకర్‌, రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌, కిమ్స్‌-సన్‌షైన్‌ హాస్పిటల్స్‌

"అమెరికా వంటి పాశ్చాత్య దేశాలతో పోల్చితే రోబోటిక్‌ విధానంలో చికిత్సకు మన దగ్గర తక్కువ ఖర్చు అవుతోంది. ఒక గదిలో కూర్చొని రోబోను నియంత్రిస్తూ డాక్టర్‌ శస్త్రచికిత్స చేస్తారు. రోగికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. రోబోకు నాలుగు మర చేతులుంటాయి. వాటితో అన్ని కోణాల్లో అవయవాలను చూస్తూ శస్త్రచికిత్స చేయొచ్చు. దీని ద్వారా ఆపరేషన్‌కు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. గుండె కవాటాల్లో మరమ్మతులు, మార్పిడులు ఈ పరిజ్ఞానంతోనే చేస్తున్నాం. శస్త్రచికిత్స అనంతరం కుట్లు చక్కగా వేయొచ్చు. రోబోటిక్‌ సర్జరీలను ఇప్పటికీ పెద్ద నగరాల్లోనే చేస్తున్నారు. ఇవి మున్ముందు విస్తరించే అవకాశాలున్నాయి."-డాక్టర్‌ గోపీచంద్‌ మన్నం, సీనియర్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్‌, స్టార్‌ హాస్పిటల్స్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.