ETV Bharat / science-and-technology

నకిలీ ఈమెయిళ్లే సైబర్ కేటుగాళ్ల ఆయుధం! - cyber attacks fake emails

కరోనా మహమ్మారినీ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. నకిలీ ఈమెయిల్ ఖాతాలతో విరాళాల పేరిట డబ్బులు దండుకుంటున్నారు. అసలైన సంస్థల నుంచి సంప్రదిస్తున్నట్లు మభ్యపెట్టి సమాచారం చోరీ చేస్తున్నారు.

72% of Covid-related cyberattacks coming via fake emails
కొవిడ్​​ సైబర్​ దాడుల్లో ప్రధాన ఆయుధం ఫేక్​ ఈమెయిల్​లే
author img

By

Published : Dec 21, 2020, 1:22 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహమ్మారి సంక్షోభాన్నీ సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కరోనా పేరిట నకిలీ ఖాతాలతో విరాళాలు సేకరిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు. భారత్​లోని పలు సంస్థలను పోలిన నకిలీ ఈమెయిళ్లు ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. అసలైన సంస్థల నుంచి సంప్రదిస్తున్నట్లు మభ్యపెట్టి వ్యక్తుల నుంచి సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఐటీ సెక్యూరిటీ సంస్థ బర్రాకుడా నెట్​వర్క్స్​ విడుదల చేసిన ఓ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

  • మొత్తం కేసుల్లో ఇలాంటివి(స్పియర్ ఫిషింగ్) కేసులు 72 శాతం నమోదయ్యాయి.
  • సైబర్ దాడులలో 36 శాతం స్కామర్ల నుంచి ఉన్నాయి.
  • 71 శాతం స్పియర్ ఫిషింగ్ మెయిళ్లలో ప్రమాదకర యూఆర్​ఎల్​లు ఉంటున్నాయి.
  • బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్(బీఈసీ) దాడుల్లో 30 శాతం మెయిళ్లలో మాత్రమే లింక్​లు ఉంటున్నాయి.

"స్పియర్ ఫిషింగ్ దాడుల్లో 13 శాతం అంతర్గత కాంప్రమైజ్డ్ ఖాతాల నుంచి వచ్చినవే. కాబట్టి బయట వ్యక్తుల నుంచి తమ ఖాతాలను రక్షించుకునేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తాయో.. అదే రకంగా అంతర్గత ఈమెయిల్ ట్రాఫిక్​పైనా సంస్థలు దృష్టిసారించాలి."

-బర్రాకుడా నెట్​వర్క్స్​ నివేదిక

బీఈసీ మెయిళ్లను పంపించి బాధితుల నమ్మకాన్ని చూరగొంటున్నారని తెలిపింది బర్రాకుడా. చాలా సార్లు యూఆర్ఎల్ లేకపోవడం వల్ల ఈ దాడి జరిగిన విషయాన్ని గుర్తించలేకపోతున్నట్లు పేర్కొంది.

దేశంలోని చాలా సంస్థలకు ప్రస్తుతం ఈ ముప్పు పొంచి ఉందని 'బర్రాకుడా నెట్​వర్క్స్'​ మేనేజర్ మురళి పేర్కొన్నారు. తమ వ్యూహం బయటపడగానే సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారని వెల్లడించారు. ప్రమాదకరమైన లింక్​లను దాచిపెట్టడానికి వివిధ పద్ధతులు పాటిస్తున్నారని తెలిపారు. ఈ దాడులను ఎదుర్కొనే సాంకేతికతను సంస్థలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కేటుగాళ్ల వలలో పడకుండా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. బంగారు బంగాల్​ నిర్మిస్తాం

భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహమ్మారి సంక్షోభాన్నీ సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కరోనా పేరిట నకిలీ ఖాతాలతో విరాళాలు సేకరిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు. భారత్​లోని పలు సంస్థలను పోలిన నకిలీ ఈమెయిళ్లు ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. అసలైన సంస్థల నుంచి సంప్రదిస్తున్నట్లు మభ్యపెట్టి వ్యక్తుల నుంచి సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఐటీ సెక్యూరిటీ సంస్థ బర్రాకుడా నెట్​వర్క్స్​ విడుదల చేసిన ఓ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

  • మొత్తం కేసుల్లో ఇలాంటివి(స్పియర్ ఫిషింగ్) కేసులు 72 శాతం నమోదయ్యాయి.
  • సైబర్ దాడులలో 36 శాతం స్కామర్ల నుంచి ఉన్నాయి.
  • 71 శాతం స్పియర్ ఫిషింగ్ మెయిళ్లలో ప్రమాదకర యూఆర్​ఎల్​లు ఉంటున్నాయి.
  • బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్(బీఈసీ) దాడుల్లో 30 శాతం మెయిళ్లలో మాత్రమే లింక్​లు ఉంటున్నాయి.

"స్పియర్ ఫిషింగ్ దాడుల్లో 13 శాతం అంతర్గత కాంప్రమైజ్డ్ ఖాతాల నుంచి వచ్చినవే. కాబట్టి బయట వ్యక్తుల నుంచి తమ ఖాతాలను రక్షించుకునేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తాయో.. అదే రకంగా అంతర్గత ఈమెయిల్ ట్రాఫిక్​పైనా సంస్థలు దృష్టిసారించాలి."

-బర్రాకుడా నెట్​వర్క్స్​ నివేదిక

బీఈసీ మెయిళ్లను పంపించి బాధితుల నమ్మకాన్ని చూరగొంటున్నారని తెలిపింది బర్రాకుడా. చాలా సార్లు యూఆర్ఎల్ లేకపోవడం వల్ల ఈ దాడి జరిగిన విషయాన్ని గుర్తించలేకపోతున్నట్లు పేర్కొంది.

దేశంలోని చాలా సంస్థలకు ప్రస్తుతం ఈ ముప్పు పొంచి ఉందని 'బర్రాకుడా నెట్​వర్క్స్'​ మేనేజర్ మురళి పేర్కొన్నారు. తమ వ్యూహం బయటపడగానే సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారని వెల్లడించారు. ప్రమాదకరమైన లింక్​లను దాచిపెట్టడానికి వివిధ పద్ధతులు పాటిస్తున్నారని తెలిపారు. ఈ దాడులను ఎదుర్కొనే సాంకేతికతను సంస్థలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కేటుగాళ్ల వలలో పడకుండా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. బంగారు బంగాల్​ నిర్మిస్తాం

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.