ETV Bharat / science-and-technology

సూపర్​ ఫీచర్​తో పేటీఎం​.. ఇకపై పిన్​ లేకుండానే పేమెంట్స్

author img

By

Published : Feb 18, 2023, 1:09 PM IST

పేటీఎం యూజర్లకు గుడ్​న్యూస్! ఇకపై పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్​ను ఎంటర్​ చేయాల్సిన అవసరం లేకుండా 'యూపీఐ లైట్'​ అనే కొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టింది.

Paytm UPI Lite feature news
పేటీఎం సరికొత్త ఫీచర్​ న్యూస్

ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం సరికొత్త ఫీచర్​తో యూజర్ల ముందుకు వచ్చింది. ఇకపై పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్​ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా.. 'యూపీఐ లైట్' అనే సరికొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టింది. యూపీఐ ద్వారా డబ్బును పంపించటం, స్వీకరించే ప్రక్రియలను సులభతరం చేసేందుకు ఈ యూపీఐ లైట్​ ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ పేటీఎం 'యూపీఐ లైట్'​ ద్వారా తక్కువ మొత్తంలో లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. పేటీఎం యాప్​ ద్వారా యూపీఐ పిన్​ను వినియోగించే అవసరం లేకుండా ఒక క్లిక్​తో ఇకపై రూ.200 వరకు చిన్నమొత్తంలో లావాదేవీలను వేగంగా చేసుకోవచ్చు.

ఈ ఆవిష్కరణతో యూపీఐ లైట్ ఫీచర్​ను ప్రారంభించిన మొదటి సంస్థగా​ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​​ లిమిటెడ్ పేరొందింది. రూ.2,000 వరకు యాడ్ చేసుకోవటం ద్వారా రోజుకు రెండుసార్లు యూపీఐ వ్యాలెట్​కు రీఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తంగా దీని రోజువారీ పరిమితి రూ.4,000 ఉంటుంది. బ్యాంక్స్​ పరిమితిని పట్టించుకోకుండా యూపీఐ లైట్​ను ఉపయోగించి అనేక లావాదేవీలను చేసుకోవచ్చు.

" ఈ యూపీఐ లైట్​ను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాం. ఎన్​పీసీఐ అధికారిక డేటా ప్రకారం, దేశంలో ప్రతిరోజు జరిగే యూపీఐ లావాదేవీల్లో రూ.200 కంటే తక్కువ మొత్తంలో జరిగే లావాదేవీలే సగం ఉన్నాయి. యూపీఐ లైట్​ ఫీచర్​తో యూజర్స్ ఇకపై వేగంగా తక్కువ మొత్తంలో లావాదేవీలను సురక్షితంగా చేసుకోవచ్చు. డిజిటల్ ఇన్​క్లూజన్​ను నడపడంపై మేము దృష్టిసారించాము. ఆ మార్గంలో సాగేందుకు యూపీఐ లైట్ ప్రారంభం పెద్ద స్టెప్​."

--సురీందర్ చావ్లా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ ఎండీ, సీఈఓ

ఎన్​సీపీఐ, ఆర్​బీఐ సంస్థలు దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు ఈ 'యూపీఐ లైట్' ఫీచర్​ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇకపై చిన్నమొత్తంలో చేసే లావాదేవీలు పేటీఎం బ్యాలెన్స్​, హిస్టరీ సెక్షన్​లో మాత్రమే కన్పిస్తాయని.. బ్యాంక్​ పాస్​బుక్​లో కనిపించవని వెల్లడించారు. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్.. తమ యూజర్లకు ఏ రిజిస్టర్డ్​ యూపీఐ మొబైల్​ నంబర్​కైనా పేటీఎం యాప్​ ద్వారా లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయాన్ని ఇటీవల తీసుకొచ్చింది.

ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం సరికొత్త ఫీచర్​తో యూజర్ల ముందుకు వచ్చింది. ఇకపై పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్​ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా.. 'యూపీఐ లైట్' అనే సరికొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టింది. యూపీఐ ద్వారా డబ్బును పంపించటం, స్వీకరించే ప్రక్రియలను సులభతరం చేసేందుకు ఈ యూపీఐ లైట్​ ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ పేటీఎం 'యూపీఐ లైట్'​ ద్వారా తక్కువ మొత్తంలో లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. పేటీఎం యాప్​ ద్వారా యూపీఐ పిన్​ను వినియోగించే అవసరం లేకుండా ఒక క్లిక్​తో ఇకపై రూ.200 వరకు చిన్నమొత్తంలో లావాదేవీలను వేగంగా చేసుకోవచ్చు.

ఈ ఆవిష్కరణతో యూపీఐ లైట్ ఫీచర్​ను ప్రారంభించిన మొదటి సంస్థగా​ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​​ లిమిటెడ్ పేరొందింది. రూ.2,000 వరకు యాడ్ చేసుకోవటం ద్వారా రోజుకు రెండుసార్లు యూపీఐ వ్యాలెట్​కు రీఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తంగా దీని రోజువారీ పరిమితి రూ.4,000 ఉంటుంది. బ్యాంక్స్​ పరిమితిని పట్టించుకోకుండా యూపీఐ లైట్​ను ఉపయోగించి అనేక లావాదేవీలను చేసుకోవచ్చు.

" ఈ యూపీఐ లైట్​ను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాం. ఎన్​పీసీఐ అధికారిక డేటా ప్రకారం, దేశంలో ప్రతిరోజు జరిగే యూపీఐ లావాదేవీల్లో రూ.200 కంటే తక్కువ మొత్తంలో జరిగే లావాదేవీలే సగం ఉన్నాయి. యూపీఐ లైట్​ ఫీచర్​తో యూజర్స్ ఇకపై వేగంగా తక్కువ మొత్తంలో లావాదేవీలను సురక్షితంగా చేసుకోవచ్చు. డిజిటల్ ఇన్​క్లూజన్​ను నడపడంపై మేము దృష్టిసారించాము. ఆ మార్గంలో సాగేందుకు యూపీఐ లైట్ ప్రారంభం పెద్ద స్టెప్​."

--సురీందర్ చావ్లా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ ఎండీ, సీఈఓ

ఎన్​సీపీఐ, ఆర్​బీఐ సంస్థలు దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు ఈ 'యూపీఐ లైట్' ఫీచర్​ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇకపై చిన్నమొత్తంలో చేసే లావాదేవీలు పేటీఎం బ్యాలెన్స్​, హిస్టరీ సెక్షన్​లో మాత్రమే కన్పిస్తాయని.. బ్యాంక్​ పాస్​బుక్​లో కనిపించవని వెల్లడించారు. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్.. తమ యూజర్లకు ఏ రిజిస్టర్డ్​ యూపీఐ మొబైల్​ నంబర్​కైనా పేటీఎం యాప్​ ద్వారా లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయాన్ని ఇటీవల తీసుకొచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.