ETV Bharat / priya

బీపీ, షుగర్ కంట్రోల్ చేయాలా? దంపుడు బియ్యం ట్రై చేయండి!

author img

By

Published : Nov 1, 2021, 2:41 PM IST

పాలిష్ పట్టిన బియ్యంతో పోల్చితే పాలిష్​ పట్టని బియ్యం(దంపుడు బియ్యం)లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మరి దంపుడు బియ్యంలో దాగిన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందామా..?

brown rice
దంపుడు బియ్యం

దంపుడు బియ్యంలో పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వరిపొట్టుకింద ఉండే తవుడు పొరలో విటమిన్​లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. పాలిష్​ పట్టినప్పుడు తవుడుతోపాటు ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే తెల్లబియ్యం కన్నా దంపుడు బియ్యం మంచివని.. పరిశోధకులు చాలా కాలంగా చెబుతున్నారు.

వారానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవటం వల్ల మధుమేహం పెరుగుతున్నట్లు హార్వర్డ్ స్కూల్ఆఫ్ పబ్లిక్ హెల్త్​ పరిశోధకులు గుర్తించారు.

దంపుడు బియ్యంతో లాభాలివే..

  • తెల్లబియ్యం స్థానంలో 50 గ్రాముల దంపుడు బియ్యాన్ని చేర్చుకుంటే మధుమేహం ముప్పు 16శాతం తగ్గుతుందని పరిశోధనలో తేలింది.
  • రక్తపోటు పెరగటానికి దోహదంచేసే సోడియం కూడా దంపుడు బియ్యంలో తక్కువే
  • నియాసిన్​, విటమిన్​-బీ3 పోషకాలు దంపుడు బియ్యంలో ఎక్కువ
  • దంపుడు బియ్యంలోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్​ ఉత్పత్తికి తోడ్పడే సెలీనియం కూడా ఈ బియ్యంలో అధికంగా ఉంటుంది.
  • వీటిలోని పిండిపదార్థం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత వేగంగా పెరగవు.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: JUNK FOOD: చిరుతిళ్లతో చిన్నారులకు ప్రమాదం.. ఆదర్శంగా 'ఈట్ రైట్' నినాదం

దంపుడు బియ్యంలో పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వరిపొట్టుకింద ఉండే తవుడు పొరలో విటమిన్​లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. పాలిష్​ పట్టినప్పుడు తవుడుతోపాటు ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే తెల్లబియ్యం కన్నా దంపుడు బియ్యం మంచివని.. పరిశోధకులు చాలా కాలంగా చెబుతున్నారు.

వారానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవటం వల్ల మధుమేహం పెరుగుతున్నట్లు హార్వర్డ్ స్కూల్ఆఫ్ పబ్లిక్ హెల్త్​ పరిశోధకులు గుర్తించారు.

దంపుడు బియ్యంతో లాభాలివే..

  • తెల్లబియ్యం స్థానంలో 50 గ్రాముల దంపుడు బియ్యాన్ని చేర్చుకుంటే మధుమేహం ముప్పు 16శాతం తగ్గుతుందని పరిశోధనలో తేలింది.
  • రక్తపోటు పెరగటానికి దోహదంచేసే సోడియం కూడా దంపుడు బియ్యంలో తక్కువే
  • నియాసిన్​, విటమిన్​-బీ3 పోషకాలు దంపుడు బియ్యంలో ఎక్కువ
  • దంపుడు బియ్యంలోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్​ ఉత్పత్తికి తోడ్పడే సెలీనియం కూడా ఈ బియ్యంలో అధికంగా ఉంటుంది.
  • వీటిలోని పిండిపదార్థం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత వేగంగా పెరగవు.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: JUNK FOOD: చిరుతిళ్లతో చిన్నారులకు ప్రమాదం.. ఆదర్శంగా 'ఈట్ రైట్' నినాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.