ETV Bharat / opinion

ధరలు కుంగి.. పాడి పరిశ్రమలో పొంగిన విషాదం

author img

By

Published : Jul 31, 2020, 9:43 AM IST

దేశవ్యాప్తంగా పాడిపరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. ధరలు పతనమై పాడి రైతులు నష్టాలపాలవుతున్నారు. కనీస ఖర్చులైనా తిరిగి రాకపోవడం వల్ల పాలన్నీ రోడ్లపైనే పారబోస్తున్నారు. నాలుగు నెలలుగా దేశంలో పర్యటకం, ఆతిథ్యం, వాణిజ్యం రంగాలు మూతపడం వల్ల పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది.

Prices are a tragedy in the dairy industry
ధరలు కుంగి పాడి పరిశ్రమలో పొంగిన విషాదం

పాల ప్రగతి పొంగుపై కరోనా నీళ్లు చిమ్మింది. దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. పాల విక్రయ ధరలు పతనమై పాడి రైతులు నష్టాలపాలవుతున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో సైతం పాల సరఫరాకు ఇబ్బందులెదురైనా ఇండియాలో రైతుల సహకారంతో సహకార పాల సంఘాలు నిర్విఘ్నంగా 130 కోట్లమందికి నిత్యం పాలను విక్రయించాయి. కానీ, కనీస ఖర్చులైనా తిరిగి రాకపోతే పశువులను పోషించేదెలా అని మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రోడ్లపై పాలు పారబోస్తూ రైతులు నిరసనలు తెలుపుతున్నారు. నాలుగు నెలలుగా దేశంలో పర్యాటక, హోటళ్లు, వాణిజ్యం మూతపడి కుదేలవడంతో పాడిపరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. పాల అమ్మకాల్లో 40శాతం వరకు వాణిజ్య కొనుగోళ్లే ఉంటాయి.

సహకారం శూన్యం

పాడి పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణలేమీ లేవు. ఎవరైనా స్వేచ్ఛగా డెయిరీలు పెట్టుకుని రైతుల నుంచి పాలు కొని ప్రజలకు విక్రయించవచ్ఛు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో 1.90 లక్షల గ్రామాల సహకార సంఘాలకు చెందిన 1.69 కోట్ల మంది రైతులున్నారని ‘జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి’(ఎన్డీడీబీ) తాజా నివేదికలో స్పష్టీకరించింది. సహకార డెయిరీలకు నిత్యం విక్రయించే 5.10కోట్ల లీటర్ల పాలు పరిశ్రమకు ఆయువుపట్టు. గుజరాత్‌లోని అమూల్‌, కర్ణాటకలోని నందిని పాల సహకార సంఘాల సమాఖ్య(డెయిరీ)లు వరసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఎన్డీడీబీ లెక్కల ప్రకారం ఏడేళ్ల(2012-19) వ్యవధిలో పాల టోకుధర 107.60 నుంచి 143.10 పాయింట్లకు(33 శాతం) పెరిగింది. ఇదే కాలవ్యవధిలో పాడి రైతుల ఆదాయంలో అంతే వృద్ధిలేదు. వర్షాకాలం, శీతకాలంలో పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు పాల కొనుగోలు ధరను ప్రైవేటు డెయిరీలు ఇష్టారీతిగా తగ్గించేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో నెలరోజుల్లో కొనుగోలు ధరను 40శాతం వరకూ తగ్గించారని రైతులు భగ్గుమంటున్నారు.

వాటా ఉన్నా... ప్రోత్సాహమేదీ?

స్థూల జాతీయోత్పత్తి విలువ(జీవీఏ)లో వ్యవసాయం దాని అనుబంధ రంగాల విలువ రూ.26.70 లక్షల కోట్లుంటే, పాడిపరిశ్రమ వాటా 28.38 శాతం. కానీ పంటల సాగుకు ఇస్తున్నంత ప్రోత్సాహం, రాయితీలు పాడి రైతులకు ప్రభుత్వం నుంచి దక్కడం లేదు. పూర్తిగా డెయిరీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి వీరు బతకాల్సిన దుస్థితి నెలకొంది. పశుగ్రాసం, దాణా ధరలు పెరుగుతున్నా రైతులకిచ్చే పాలధర పెంచడం లేదని ఎన్డీడీబీ పరిశీలనలో తేలింది. ఉదాహరణకు 2017-18తో పోలిస్తే 2018-19లో తవుడు, దాణాధర జాతీయ సగటులో ఏడుశాతం పెరిగినా డెయిరీలు పెంచలేదని తేలింది. ప్రపంచవ్యాప్తంగా 2018లో 84.32 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తవగా అందులో భారతదేశం వాటాయే 18.72 కోట్లు. ప్రపంచంలోనే పాలు ఇచ్చే ఆవులు అత్యధికంగా 6.06 కోట్లు ఇండియాలో ఉన్నాయి. ఐరోపా దేశాల్లో 2.29 కోట్ల ఆవులే ఉన్నా ఇండియాకన్నా రెట్టింపుస్థాయిలో పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇండియాతో పోలిస్తే కేవలం 15 శాతం(93.30 లక్షలే) ఆవులున్న అమెరికా పాల ఉత్పత్తిలో ఇండియాకన్నా ముందుంది. ప్రపంచంలోని గేదెల్లో 56, ఆవుల్లో 12.5 శాతమిక్కడే ఉన్నాయి. కానీ ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్‌ వాటా 10 శాతానికి మించి లేదు. అధిక పాలనిచ్చే పశువులు మనదగ్గర లేకపోవడం ప్రధాన సమస్య. పశుపోషణ వ్యయం దేశంలో నానాటికీ పెరుగుతోంది.

prices-are-a-tragedy-in-the-dairy-industry
దేశంలో పాల ఉత్పత్తి

పేరుకుపోతున్న పాలపొడి

లాక్‌డౌన్‌లో మిగిలిపోతున్న పాలను డెయిరీలన్నీ పొడిగా మార్చేసి నిల్వలు పేర్చేయడంతో దాని ధర రూ.300 నుంచి రూ.160కి పతనమైంది. కిలో పాలపొడి తయారీకి సగటున రూ.240 దాకా ఖర్చవుతున్నందున నష్టాలు వస్తున్నాయని, వాటిని రైతులపైకి డెయిరీలు నెట్టేస్తున్నాయి. ఇప్పుడు దేశవాప్తంగా రెండు లక్షల టన్నులకు పైగా పాలపొడి నిల్వలు పేరుకుపోయాయి. వర్షాకాలంలో ఉత్పత్తి పెరిగినా వాణిజ్య కొనుగోళ్లు లేకపోవడంతో డిమాండు మరింత పతనమైంది. మార్చికి ముందు పలు రాష్ట్రాల్లో లీటరు ఆవు పాలధర రూ.30 నుంచి రూ.35 ఉండగా ఇప్పుడు రూ.17కే కొంటున్నారని మహారాష్ట్ర రైతులు నిరసనలకు దిగుతున్నారు.

ఆర్థిక చేయూతే కీలకం

కొవిడ్‌ సంక్షోభం నుంచి పరిశ్రమను గట్టెక్కించేందుకు రూ.15వేలకోట్లతో కేంద్రం ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పథకం కింద ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసింది. పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను బ్యాంకుల నుంచి ఇప్పించి పూచీకత్తు లేకుండా మూడు లక్షల రూపాయలు రుణాలిచ్చి వాటిపై వడ్డీరాయితీ ఇవ్వాలనేది ఈ పథకం ఉద్దేశం. సహకార డెయిరీలకు పాలుపోసే రైతులకే దీన్ని పరిమితం చేయడం లోపం. రైతులకు కార్డులు ఇస్తున్న బ్యాంకులు రుణాలివ్వకుండా సతాయిస్తున్నాయి. రోజూ 10 లీటర్లకు పైగా పాలు ఇచ్చే పాడి పశువు ధర లక్ష రూపాయలకు పైగానే ఉంటోంది. అంత ఖరీదు పెట్టి వాటిని కొన్నా వాటి ఆరోగ్యం కాపాడుతూ, మేలైన దాణా అందించడం తలకుమించిన భారమవుతోంది. ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చాక పల్లెల్లో పశువుల దగ్గర పనులు చేయడానికి కూలీలు దొరక్క రైతులు నానాఇబ్బందులు పడుతున్నారు.

55 శాతం తగ్గిన ఎగుమతులు!

పాల ఉత్పత్తి వ్యయాన్ని ప్రతీ రాష్ట్రం అంచనా వేసి లీటరు పాలకు కనీస ధర ఎంత ఇవ్వాలనేది ఏటా ప్రకటించాలి. అంతకన్నా తక్కువిచ్చే డెయిరీలపై చర్యలు తీసుకోవాలి. ప్రతీ రైతుకు అధికపాలనిచ్చే పశువులను రాయితీపై ప్రభుత్వం ఇప్పించి పాలను కొనేందుకు డెయిరీలను ప్రోత్సహించాలి. ప్రపంచ విపణిలో పాలు, పాల ఉత్పత్తులకు విపరీతమైన డిమాండు ఉంది. ఇండియా పక్కనే ఉన్న శ్రీలంక, చైనాలాంటి దేశాలు సుదూరాన ఉన్న న్యూజిలాండ్‌ నుంచి పాలు, పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం నుంచి 2018-19తో పోలిస్తే గతేడాది(2019-20)లో పాల ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా 54.78 శాతం తగ్గాయి. అంతకుముందు ఏడాది లక్షా 13వేల టన్నుల ఎగుమతుల నుంచి నిరుడు 51 వేల టన్నులకు పడిపోవడం పాడిరంగం దుస్థితిని చాటుతోంది.

మాటలు సరిపోవు

పాల ఉత్పత్తి పెరిగితే ప్రజలకు పోషకాహారం అందుబాటు సహా విదేశాలకు అమ్ముకుని రైతులకు లాభాలను పంచవచ్ఛు ఉపాధి హామీ పథకాన్ని పాడి పరిశ్రమకు అనుసంధానం చేయాలి. కూలీల కొరత తీర్చేందుకు అధునాతన పరిజ్ఞానంతో డెయిరీల నిర్వహణకు, రైతులకు ఆర్థిక సాయం బ్యాంకుల ద్వారా అందించాలి. వడ్డీలేని రుణాలివ్వాలి. స్వయంసహాయక సంఘాలకు భాగస్వామ్యం కల్పించి ఉత్పత్తి పెంచాలి. ఇవేం లేనందువల్లే దూరాన ఉన్న గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి పాలు, పాల ఉత్పత్తులు తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. పాడిరైతులను, పరిశ్రమను ప్రోత్సహించకుండా వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నామని పాలకులు మాటలు చెబితే- దేశంలో పాలకొరత తీరదు... ప్రజలకు పోషకాహారమూ అందదు!

- మంగమూరి శ్రీనివాస్‌

ఇదీ చదవండి: అయోధ్య మందిరానికి ఆకృతినిచ్చింది ఆ కుటుంబమే..

పాల ప్రగతి పొంగుపై కరోనా నీళ్లు చిమ్మింది. దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. పాల విక్రయ ధరలు పతనమై పాడి రైతులు నష్టాలపాలవుతున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో సైతం పాల సరఫరాకు ఇబ్బందులెదురైనా ఇండియాలో రైతుల సహకారంతో సహకార పాల సంఘాలు నిర్విఘ్నంగా 130 కోట్లమందికి నిత్యం పాలను విక్రయించాయి. కానీ, కనీస ఖర్చులైనా తిరిగి రాకపోతే పశువులను పోషించేదెలా అని మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రోడ్లపై పాలు పారబోస్తూ రైతులు నిరసనలు తెలుపుతున్నారు. నాలుగు నెలలుగా దేశంలో పర్యాటక, హోటళ్లు, వాణిజ్యం మూతపడి కుదేలవడంతో పాడిపరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. పాల అమ్మకాల్లో 40శాతం వరకు వాణిజ్య కొనుగోళ్లే ఉంటాయి.

సహకారం శూన్యం

పాడి పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణలేమీ లేవు. ఎవరైనా స్వేచ్ఛగా డెయిరీలు పెట్టుకుని రైతుల నుంచి పాలు కొని ప్రజలకు విక్రయించవచ్ఛు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో 1.90 లక్షల గ్రామాల సహకార సంఘాలకు చెందిన 1.69 కోట్ల మంది రైతులున్నారని ‘జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి’(ఎన్డీడీబీ) తాజా నివేదికలో స్పష్టీకరించింది. సహకార డెయిరీలకు నిత్యం విక్రయించే 5.10కోట్ల లీటర్ల పాలు పరిశ్రమకు ఆయువుపట్టు. గుజరాత్‌లోని అమూల్‌, కర్ణాటకలోని నందిని పాల సహకార సంఘాల సమాఖ్య(డెయిరీ)లు వరసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఎన్డీడీబీ లెక్కల ప్రకారం ఏడేళ్ల(2012-19) వ్యవధిలో పాల టోకుధర 107.60 నుంచి 143.10 పాయింట్లకు(33 శాతం) పెరిగింది. ఇదే కాలవ్యవధిలో పాడి రైతుల ఆదాయంలో అంతే వృద్ధిలేదు. వర్షాకాలం, శీతకాలంలో పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు పాల కొనుగోలు ధరను ప్రైవేటు డెయిరీలు ఇష్టారీతిగా తగ్గించేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో నెలరోజుల్లో కొనుగోలు ధరను 40శాతం వరకూ తగ్గించారని రైతులు భగ్గుమంటున్నారు.

వాటా ఉన్నా... ప్రోత్సాహమేదీ?

స్థూల జాతీయోత్పత్తి విలువ(జీవీఏ)లో వ్యవసాయం దాని అనుబంధ రంగాల విలువ రూ.26.70 లక్షల కోట్లుంటే, పాడిపరిశ్రమ వాటా 28.38 శాతం. కానీ పంటల సాగుకు ఇస్తున్నంత ప్రోత్సాహం, రాయితీలు పాడి రైతులకు ప్రభుత్వం నుంచి దక్కడం లేదు. పూర్తిగా డెయిరీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి వీరు బతకాల్సిన దుస్థితి నెలకొంది. పశుగ్రాసం, దాణా ధరలు పెరుగుతున్నా రైతులకిచ్చే పాలధర పెంచడం లేదని ఎన్డీడీబీ పరిశీలనలో తేలింది. ఉదాహరణకు 2017-18తో పోలిస్తే 2018-19లో తవుడు, దాణాధర జాతీయ సగటులో ఏడుశాతం పెరిగినా డెయిరీలు పెంచలేదని తేలింది. ప్రపంచవ్యాప్తంగా 2018లో 84.32 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తవగా అందులో భారతదేశం వాటాయే 18.72 కోట్లు. ప్రపంచంలోనే పాలు ఇచ్చే ఆవులు అత్యధికంగా 6.06 కోట్లు ఇండియాలో ఉన్నాయి. ఐరోపా దేశాల్లో 2.29 కోట్ల ఆవులే ఉన్నా ఇండియాకన్నా రెట్టింపుస్థాయిలో పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇండియాతో పోలిస్తే కేవలం 15 శాతం(93.30 లక్షలే) ఆవులున్న అమెరికా పాల ఉత్పత్తిలో ఇండియాకన్నా ముందుంది. ప్రపంచంలోని గేదెల్లో 56, ఆవుల్లో 12.5 శాతమిక్కడే ఉన్నాయి. కానీ ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్‌ వాటా 10 శాతానికి మించి లేదు. అధిక పాలనిచ్చే పశువులు మనదగ్గర లేకపోవడం ప్రధాన సమస్య. పశుపోషణ వ్యయం దేశంలో నానాటికీ పెరుగుతోంది.

prices-are-a-tragedy-in-the-dairy-industry
దేశంలో పాల ఉత్పత్తి

పేరుకుపోతున్న పాలపొడి

లాక్‌డౌన్‌లో మిగిలిపోతున్న పాలను డెయిరీలన్నీ పొడిగా మార్చేసి నిల్వలు పేర్చేయడంతో దాని ధర రూ.300 నుంచి రూ.160కి పతనమైంది. కిలో పాలపొడి తయారీకి సగటున రూ.240 దాకా ఖర్చవుతున్నందున నష్టాలు వస్తున్నాయని, వాటిని రైతులపైకి డెయిరీలు నెట్టేస్తున్నాయి. ఇప్పుడు దేశవాప్తంగా రెండు లక్షల టన్నులకు పైగా పాలపొడి నిల్వలు పేరుకుపోయాయి. వర్షాకాలంలో ఉత్పత్తి పెరిగినా వాణిజ్య కొనుగోళ్లు లేకపోవడంతో డిమాండు మరింత పతనమైంది. మార్చికి ముందు పలు రాష్ట్రాల్లో లీటరు ఆవు పాలధర రూ.30 నుంచి రూ.35 ఉండగా ఇప్పుడు రూ.17కే కొంటున్నారని మహారాష్ట్ర రైతులు నిరసనలకు దిగుతున్నారు.

ఆర్థిక చేయూతే కీలకం

కొవిడ్‌ సంక్షోభం నుంచి పరిశ్రమను గట్టెక్కించేందుకు రూ.15వేలకోట్లతో కేంద్రం ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పథకం కింద ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసింది. పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను బ్యాంకుల నుంచి ఇప్పించి పూచీకత్తు లేకుండా మూడు లక్షల రూపాయలు రుణాలిచ్చి వాటిపై వడ్డీరాయితీ ఇవ్వాలనేది ఈ పథకం ఉద్దేశం. సహకార డెయిరీలకు పాలుపోసే రైతులకే దీన్ని పరిమితం చేయడం లోపం. రైతులకు కార్డులు ఇస్తున్న బ్యాంకులు రుణాలివ్వకుండా సతాయిస్తున్నాయి. రోజూ 10 లీటర్లకు పైగా పాలు ఇచ్చే పాడి పశువు ధర లక్ష రూపాయలకు పైగానే ఉంటోంది. అంత ఖరీదు పెట్టి వాటిని కొన్నా వాటి ఆరోగ్యం కాపాడుతూ, మేలైన దాణా అందించడం తలకుమించిన భారమవుతోంది. ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చాక పల్లెల్లో పశువుల దగ్గర పనులు చేయడానికి కూలీలు దొరక్క రైతులు నానాఇబ్బందులు పడుతున్నారు.

55 శాతం తగ్గిన ఎగుమతులు!

పాల ఉత్పత్తి వ్యయాన్ని ప్రతీ రాష్ట్రం అంచనా వేసి లీటరు పాలకు కనీస ధర ఎంత ఇవ్వాలనేది ఏటా ప్రకటించాలి. అంతకన్నా తక్కువిచ్చే డెయిరీలపై చర్యలు తీసుకోవాలి. ప్రతీ రైతుకు అధికపాలనిచ్చే పశువులను రాయితీపై ప్రభుత్వం ఇప్పించి పాలను కొనేందుకు డెయిరీలను ప్రోత్సహించాలి. ప్రపంచ విపణిలో పాలు, పాల ఉత్పత్తులకు విపరీతమైన డిమాండు ఉంది. ఇండియా పక్కనే ఉన్న శ్రీలంక, చైనాలాంటి దేశాలు సుదూరాన ఉన్న న్యూజిలాండ్‌ నుంచి పాలు, పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం నుంచి 2018-19తో పోలిస్తే గతేడాది(2019-20)లో పాల ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా 54.78 శాతం తగ్గాయి. అంతకుముందు ఏడాది లక్షా 13వేల టన్నుల ఎగుమతుల నుంచి నిరుడు 51 వేల టన్నులకు పడిపోవడం పాడిరంగం దుస్థితిని చాటుతోంది.

మాటలు సరిపోవు

పాల ఉత్పత్తి పెరిగితే ప్రజలకు పోషకాహారం అందుబాటు సహా విదేశాలకు అమ్ముకుని రైతులకు లాభాలను పంచవచ్ఛు ఉపాధి హామీ పథకాన్ని పాడి పరిశ్రమకు అనుసంధానం చేయాలి. కూలీల కొరత తీర్చేందుకు అధునాతన పరిజ్ఞానంతో డెయిరీల నిర్వహణకు, రైతులకు ఆర్థిక సాయం బ్యాంకుల ద్వారా అందించాలి. వడ్డీలేని రుణాలివ్వాలి. స్వయంసహాయక సంఘాలకు భాగస్వామ్యం కల్పించి ఉత్పత్తి పెంచాలి. ఇవేం లేనందువల్లే దూరాన ఉన్న గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి పాలు, పాల ఉత్పత్తులు తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. పాడిరైతులను, పరిశ్రమను ప్రోత్సహించకుండా వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నామని పాలకులు మాటలు చెబితే- దేశంలో పాలకొరత తీరదు... ప్రజలకు పోషకాహారమూ అందదు!

- మంగమూరి శ్రీనివాస్‌

ఇదీ చదవండి: అయోధ్య మందిరానికి ఆకృతినిచ్చింది ఆ కుటుంబమే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.