ETV Bharat / opinion

'మోదీ లద్దాఖ్ పర్యటన చైనాకు గట్టి హెచ్చరిక!'

author img

By

Published : Jul 6, 2020, 4:37 PM IST

దేశ ఉత్తర సరిహద్దులో ప్రతిష్టంభన ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న తరుణంలో ప్రధాని మోదీ చేపట్టిన లద్దాఖ్ పర్యటన చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. చైనా దూకుడుకు దీటుగా భారత్​ తన వైఖరిని స్పష్టం చేసిందని అంటున్నారు. చర్చల్లో పురోగతి లభించకపోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మోదీ పర్యటన ద్వారా విస్పష్ట సందేశాన్ని చైనాకు ఇచ్చినట్లు విశ్లేషిస్తున్నారు.

PM Modi's surprise Ladakh visit indicates India's
'మోదీ లద్దాఖ్ పర్యటన చైనాకు గట్టి హెచ్చరిక!'

నోట్ల రద్దు, పాక్​ పర్యటన, మెరుపు దాడి... ఇలా అనూహ్య చర్యలతో యావద్దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే సామర్థ్యం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంతం. జులై 3న లేహ్ ఆకస్మిక పర్యటన ఇలాంటిదే. భారత్- చైనా మధ్య సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో మోదీ లద్దాఖ్​లో పర్యటించారు. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది. ఘర్షణ జరిగిన ప్రాంతంలో ప్రధాని పర్యటించడం... సంక్షోభ తీవ్రతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి- డ్రాగన్‌ తోకకు కత్తెర.. చైనా సంస్థల టెండర్లు రద్దు!

కొద్ది రోజులుగా కొనసాగుతున్న సైనిక చర్చలు ఫలిస్తాయన్న ఆశతో ప్రభుత్వం ఇప్పటివరు ఈ విషయాన్ని తక్కువ చేసి చూపించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన రక్తపాతంలో ఈ ఆశలన్నీ కొట్టుకుపోయాయి.

పదేపదే అదే మాట!

ప్రస్తుతం చైనా వైఖరి గతంలో మాదిరిగా లేదని ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇదివరకు తలెత్తిన ప్రతిష్టంభనలను ఇరుపక్షాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గించి శాంతిస్థాపన చేయాలని గత రెండు నెలల నుంచి చైనా విదేశాంగ శాఖ అరిగిపోయిన పాత క్యాసెట్ వేస్తూనే ఉంది. దీంతోపాటు సరిహద్దులోని భారత భూభాగంలో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమైంది. గల్వాన్​పై ప్రాదేశిక హక్కులు మావే అంటూ ఆరోపించడానికి వెనకాడటం లేదు.

చైనా ప్రతిచర్య

చర్చల్లో ఎలాంటి పురోగతి లభించకపోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ ఇచ్చిన​ విస్పష్ట సందేశానికి తాజా పర్యటన ఓ సూచన లాంటిది. ఈ పర్యటన చైనాను కదిలిస్తుందని ప్రధానికి ముందుగానే తెలుసు. అనుకున్నట్లుగానే చైనా స్పందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పక్షం కూడా ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దిగకూడదని చైనా విదేశాంగ ప్రతినిధి హితవుపలికారు.

ఉద్రిక్తతలు మంచికే!

వాస్తవాధీన రేఖ వద్ద సమానస్థాయి సాధించడానికి నిర్దిష్ట స్థాయిలో ఉద్రిక్తత రేకెత్తించడం అవసరమేనని తాజా పర్యటన చెబుతోంది. మరోవైపు ప్రధాని మోదీ చేసిన ప్రసంగం చైనాకు ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఉంది. చైనా విస్తరణవాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ... 'విస్తరణవాద శక్తులన్నీ ఓడిపోవడమో, తోకముడవడమో జరిగింది. దీనికి చరిత్రే సాక్ష్యం' అని పేర్కొన్నారు. బలహీనులు ఎప్పటికీ శాంతిని ప్రారంభించలేరని చురకలంటించారు. దీన్ని బట్టి బలహీనమైన స్థాయిలో భారత్​ చర్చలు జరపడం లేదని మోదీ సందేశమిచ్చారు.

ఇదీ చదవండి- వ్యూహం మార్చనున్న చైనా.. అరుణాచల్​ ప్రదేశ్​పై గురి!

దేశంలోని ప్రజల మనోభావాల్నీ మోదీ అర్థం చేసుకున్నారు. చైనా సైనికులు భారత భూభాగంలో లేరని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన తర్వాత... తమ భూభాగాన్ని ఆక్రమించాలనే చైనా ప్రయత్నాలకు భారత్ గట్టిగా బదులిస్తుందని పౌరులకు భరోసా ఇచ్చారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఐటీ రంగాల్లోని పరిశ్రమల్లో చైనా కంపెనీల భాగస్వామ్యంపై సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.

కఠిన వాస్తవమిదే

దేశంలోని కొన్ని మీడియా ఛానెళ్లు ప్రధాని లేహ్ పర్యటనను సంచలనం చేయడానికి ప్రయత్నించాయి. చైనాపై పెద్ద విజయం సాధించామని ఆర్భాటం చేశాయి. ఇది దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఒక రకమైన ఆత్మసంతృప్తి కలుగుతుంది. కానీ భారత్ తన భూభాగంగా భావించే ప్రాంతంలోనే చైనా సైనికులు ఉన్నారన్న విషయం కఠినమైన వాస్తవం. ఈ విషయంలోనూ దీటుగా స్పందిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.

అడుగడుగునా ప్రమాదం

భారత్ తన​ ఉద్దేశం గురించి స్పష్టంగా తెలియజేసినా.. మున్ముందు మరిన్ని సవాళ్లు లేకపోలేదు. సంఘర్షణ విషయంలో మనం ఒకడుగు ముందుకు వేశాం. ప్రతి అడుగులోనూ ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. ఘర్షణ అనేది ఏకపక్షంగా ఉండదు. ప్రత్యర్థులు కూడా పోటీపడతారు. కాబట్టి చైనా నుంచి వచ్చే ప్రతిచర్యలకు సిద్ధంగా ఉండాలి. అది వాస్తవాధీన రేఖ వెంబడి కఠినమైన వైఖరి అవలంబించడమైనా, వాణిజ్యం విషయంలో మన విధానాలకు వ్యతిరేకంగానైనా చైనా చర్యలు తీసుకోవచ్చు. లేదా చిన్నపాటి సైనిక ఘర్షణలకు దారితీయవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి.

వాక్చాతుర్యాన్ని మించిన విధానాలు

మనం ఇప్పుడు సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నాం. శక్తిమంతమైన పొరుగుదేశాన్ని ఎదుర్కోవడానికి సమగ్ర సైనిక సన్నాహాలు, పూర్తి స్థాయిలో ప్రభుత్వ విధానాలు అవసరం. వాక్చాతుర్యానికి మించిన విధాన నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్ కార్యచరణను దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన అంచనాలు వేసుకోవాలి.

ఇదీ చదవండి- గల్వాన్​ నుంచి వెనక్కి తరలిన చైనా సైన్యం

భారత్​ తన భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచిస్తున్న నేపథ్యంలో.. చైనా సైతం తన నాయకత్వం విషయంలో లోతైన పరిశీలన చేసుకోవాలి. పోరులో విజయం సాధించడాన్ని యుద్ధంలో గెలుపుతో సమానంగా భావించడమే వ్యుహాత్మక ఆలోచనలో ఉన్న మూర్ఖత్వం. ఇదే విషయాన్ని ఎల్లూర్​ ఆఫ్ బ్యాటిల్ పుస్తకంలో కాథల్ నోలన్ అనే రచయిత స్పష్టం చేశారు.

ఇదీ చదవండి- చైనా విదేశాంగ మంత్రితో డోభాల్​​ చర్చలు

"యుద్ధం జరిగిన రోజు విజయం సాధించడం ముఖ్యం కాదు. ఉద్యమాన్ని గెలవాలి. విజయం అనేది రాజకీయ నిలకడ తీసుకురావాలి. అలా జరగకపోతే కొంత విరామం తర్వాత మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుంది."

-కాథల్ జే నోలన్

పాంగొంగ్ సో ఫింగర్ల వద్ద జరిగిన యుద్ధాన్ని గెలిచామని చైనా సైన్యం ఇప్పుడు భావించవచ్చు. కానీ భారత్​- చైనా మధ్య శత్రుత్వ యుగంలోకి వారు ప్రవేశించారు. ఇది ఈ ప్రాంతంలో గణనీయమైన భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ అనిశ్చితి ఎలా ఉంటుందో తెలియదు. కానీ, ఇరువైపులా విజయాన్ని ప్రకటించుకోవడం మాత్రం మూర్ఖత్వం అవుతుంది.

(రచయిత- లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా)

ఇదీ చదవండి- డోభాల్​ ఎంట్రీతో చైనా సరిహద్దులో మారిన లెక్కలు

నోట్ల రద్దు, పాక్​ పర్యటన, మెరుపు దాడి... ఇలా అనూహ్య చర్యలతో యావద్దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే సామర్థ్యం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంతం. జులై 3న లేహ్ ఆకస్మిక పర్యటన ఇలాంటిదే. భారత్- చైనా మధ్య సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో మోదీ లద్దాఖ్​లో పర్యటించారు. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది. ఘర్షణ జరిగిన ప్రాంతంలో ప్రధాని పర్యటించడం... సంక్షోభ తీవ్రతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి- డ్రాగన్‌ తోకకు కత్తెర.. చైనా సంస్థల టెండర్లు రద్దు!

కొద్ది రోజులుగా కొనసాగుతున్న సైనిక చర్చలు ఫలిస్తాయన్న ఆశతో ప్రభుత్వం ఇప్పటివరు ఈ విషయాన్ని తక్కువ చేసి చూపించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన రక్తపాతంలో ఈ ఆశలన్నీ కొట్టుకుపోయాయి.

పదేపదే అదే మాట!

ప్రస్తుతం చైనా వైఖరి గతంలో మాదిరిగా లేదని ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇదివరకు తలెత్తిన ప్రతిష్టంభనలను ఇరుపక్షాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గించి శాంతిస్థాపన చేయాలని గత రెండు నెలల నుంచి చైనా విదేశాంగ శాఖ అరిగిపోయిన పాత క్యాసెట్ వేస్తూనే ఉంది. దీంతోపాటు సరిహద్దులోని భారత భూభాగంలో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమైంది. గల్వాన్​పై ప్రాదేశిక హక్కులు మావే అంటూ ఆరోపించడానికి వెనకాడటం లేదు.

చైనా ప్రతిచర్య

చర్చల్లో ఎలాంటి పురోగతి లభించకపోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ ఇచ్చిన​ విస్పష్ట సందేశానికి తాజా పర్యటన ఓ సూచన లాంటిది. ఈ పర్యటన చైనాను కదిలిస్తుందని ప్రధానికి ముందుగానే తెలుసు. అనుకున్నట్లుగానే చైనా స్పందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పక్షం కూడా ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దిగకూడదని చైనా విదేశాంగ ప్రతినిధి హితవుపలికారు.

ఉద్రిక్తతలు మంచికే!

వాస్తవాధీన రేఖ వద్ద సమానస్థాయి సాధించడానికి నిర్దిష్ట స్థాయిలో ఉద్రిక్తత రేకెత్తించడం అవసరమేనని తాజా పర్యటన చెబుతోంది. మరోవైపు ప్రధాని మోదీ చేసిన ప్రసంగం చైనాకు ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఉంది. చైనా విస్తరణవాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ... 'విస్తరణవాద శక్తులన్నీ ఓడిపోవడమో, తోకముడవడమో జరిగింది. దీనికి చరిత్రే సాక్ష్యం' అని పేర్కొన్నారు. బలహీనులు ఎప్పటికీ శాంతిని ప్రారంభించలేరని చురకలంటించారు. దీన్ని బట్టి బలహీనమైన స్థాయిలో భారత్​ చర్చలు జరపడం లేదని మోదీ సందేశమిచ్చారు.

ఇదీ చదవండి- వ్యూహం మార్చనున్న చైనా.. అరుణాచల్​ ప్రదేశ్​పై గురి!

దేశంలోని ప్రజల మనోభావాల్నీ మోదీ అర్థం చేసుకున్నారు. చైనా సైనికులు భారత భూభాగంలో లేరని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన తర్వాత... తమ భూభాగాన్ని ఆక్రమించాలనే చైనా ప్రయత్నాలకు భారత్ గట్టిగా బదులిస్తుందని పౌరులకు భరోసా ఇచ్చారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఐటీ రంగాల్లోని పరిశ్రమల్లో చైనా కంపెనీల భాగస్వామ్యంపై సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.

కఠిన వాస్తవమిదే

దేశంలోని కొన్ని మీడియా ఛానెళ్లు ప్రధాని లేహ్ పర్యటనను సంచలనం చేయడానికి ప్రయత్నించాయి. చైనాపై పెద్ద విజయం సాధించామని ఆర్భాటం చేశాయి. ఇది దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఒక రకమైన ఆత్మసంతృప్తి కలుగుతుంది. కానీ భారత్ తన భూభాగంగా భావించే ప్రాంతంలోనే చైనా సైనికులు ఉన్నారన్న విషయం కఠినమైన వాస్తవం. ఈ విషయంలోనూ దీటుగా స్పందిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.

అడుగడుగునా ప్రమాదం

భారత్ తన​ ఉద్దేశం గురించి స్పష్టంగా తెలియజేసినా.. మున్ముందు మరిన్ని సవాళ్లు లేకపోలేదు. సంఘర్షణ విషయంలో మనం ఒకడుగు ముందుకు వేశాం. ప్రతి అడుగులోనూ ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. ఘర్షణ అనేది ఏకపక్షంగా ఉండదు. ప్రత్యర్థులు కూడా పోటీపడతారు. కాబట్టి చైనా నుంచి వచ్చే ప్రతిచర్యలకు సిద్ధంగా ఉండాలి. అది వాస్తవాధీన రేఖ వెంబడి కఠినమైన వైఖరి అవలంబించడమైనా, వాణిజ్యం విషయంలో మన విధానాలకు వ్యతిరేకంగానైనా చైనా చర్యలు తీసుకోవచ్చు. లేదా చిన్నపాటి సైనిక ఘర్షణలకు దారితీయవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి.

వాక్చాతుర్యాన్ని మించిన విధానాలు

మనం ఇప్పుడు సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నాం. శక్తిమంతమైన పొరుగుదేశాన్ని ఎదుర్కోవడానికి సమగ్ర సైనిక సన్నాహాలు, పూర్తి స్థాయిలో ప్రభుత్వ విధానాలు అవసరం. వాక్చాతుర్యానికి మించిన విధాన నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్ కార్యచరణను దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన అంచనాలు వేసుకోవాలి.

ఇదీ చదవండి- గల్వాన్​ నుంచి వెనక్కి తరలిన చైనా సైన్యం

భారత్​ తన భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచిస్తున్న నేపథ్యంలో.. చైనా సైతం తన నాయకత్వం విషయంలో లోతైన పరిశీలన చేసుకోవాలి. పోరులో విజయం సాధించడాన్ని యుద్ధంలో గెలుపుతో సమానంగా భావించడమే వ్యుహాత్మక ఆలోచనలో ఉన్న మూర్ఖత్వం. ఇదే విషయాన్ని ఎల్లూర్​ ఆఫ్ బ్యాటిల్ పుస్తకంలో కాథల్ నోలన్ అనే రచయిత స్పష్టం చేశారు.

ఇదీ చదవండి- చైనా విదేశాంగ మంత్రితో డోభాల్​​ చర్చలు

"యుద్ధం జరిగిన రోజు విజయం సాధించడం ముఖ్యం కాదు. ఉద్యమాన్ని గెలవాలి. విజయం అనేది రాజకీయ నిలకడ తీసుకురావాలి. అలా జరగకపోతే కొంత విరామం తర్వాత మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుంది."

-కాథల్ జే నోలన్

పాంగొంగ్ సో ఫింగర్ల వద్ద జరిగిన యుద్ధాన్ని గెలిచామని చైనా సైన్యం ఇప్పుడు భావించవచ్చు. కానీ భారత్​- చైనా మధ్య శత్రుత్వ యుగంలోకి వారు ప్రవేశించారు. ఇది ఈ ప్రాంతంలో గణనీయమైన భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ అనిశ్చితి ఎలా ఉంటుందో తెలియదు. కానీ, ఇరువైపులా విజయాన్ని ప్రకటించుకోవడం మాత్రం మూర్ఖత్వం అవుతుంది.

(రచయిత- లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా)

ఇదీ చదవండి- డోభాల్​ ఎంట్రీతో చైనా సరిహద్దులో మారిన లెక్కలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.