ETV Bharat / opinion

మధ్యాహ్న భోజన పథకానికి ఆర్థిక భరోసా ఏది?

జాతీయ మధ్యాహ్న భోజన పథకం... ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థుల ఆహార కార్యక్రమం. పిల్లలకు పోషకాహారం అందించటం లక్ష్యంగా ప్రారంభమైన ఈ పథకాన్ని కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. ప్రణాళికల్లో లోపం, కేంద్రం- రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీలో సంక్లిష్టత.. కరోనా వేళ మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. వీలైనంత త్వరగా వీటికి పరిష్కారం లభించకపోతే తీవ్ర సంక్షోభానికి దారితీయవచ్చు.

author img

By

Published : Nov 12, 2020, 10:21 AM IST

mid day meals
జాతీయ మధ్యాహ్న భోజన పథకం

విద్యార్థులకు పోషకాహారం, పాఠశాలల్లో హాజరు శాతం పెంచే ఉద్దేశంతో జాతీయ మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. విద్యార్థుల ఆహార కార్యక్రమంలో ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఈ పథకానికి గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ పథకంలో దేశవ్యాప్తంగా 11.59 కోట్ల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు.

అయితే, కరోనా మహమ్మారి ప్రభావం బోధనపైనే కాకుండా విద్యార్థులకు అందించే పోషకాహారంపైనా పడింది. లాక్​డౌన్​లో పాఠశాలల మూసివేత కారణంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసే ప్రమాదం ఉందని ఈ ఏడాది మార్చిలోనే సుప్రీంకోర్టు గుర్తించింది. ఇందుకు సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. పిల్లలతో సహా పేదరికంలో మగ్గుతున్న వారికి ఆహార భద్రతను కల్పించాలని స్పష్టం చేసింది. తీవ్రం కానున్న పోషకాహార లోపం సంక్షోభాన్ని దీనివల్ల కొంతవరకైనా నియంత్రించవచ్చని తెలిపింది.

రాష్ట్రాలు స్పందించినా..

వెంటనే స్పందించిన కేంద్ర విద్యా శాఖ.. పిల్లల ఇళ్లకు మధ్యాహ్న భోజనం అందించాలని, లేదా ఆహార భద్రత భత్యం ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించింది. కుటుంబాలకు నేరుగా ఆహార భద్రత భత్యం లేదా ధాన్యం అందించడాన్ని రాష్ట్రాలు వేగంగా అమలు చేశాయి. బిహార్​ ప్రభుత్వం నగదు బదిలీ చేయగా.. రాజస్థాన్​, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ధాన్యం, పప్పులు, నూనె వంటివి అందించారు. కేరళ వంటి రాష్ట్రాల్లో బలవర్ధక ఆహారమైన పాలు, గుడ్లు కూడా అందించారు. వేసవి సెలవుల్లోనూ కొనసాగించేందుకు అదనపు నిధులు కావాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరాయి.

కానీ, వీటి ద్వారా నిర్దేశించిన పోషకాహారం లబ్ధిదారులకు అందలేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు చర్యలు తీసుకున్నప్పటికీ, చాలా మంది పిల్లలకు ప్రయోజనం జరగలేదని తేలింది. ఒడిశా, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్​గఢ్, యూపీలో 1,158 మందిపై ఆక్స్​ఫామ్​ నిర్వహించిన సర్వేలో 35 శాతం మంది మధ్యాహ్న భోజనం పొందలేదని వెల్లడైంది. ఉత్తర్​ప్రదేశ్​లో అధికంగా 92 శాతం ఉంది. ఇతర అధ్యయనాల్లోనూ ఇంతకన్నా తక్కువ మంది పిల్లలకే ప్రయోజనం అందినట్లు నివేదించాయి.

కరోనా వేళ మరింత..

ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. పథకం ప్రణాళిక, కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీలో సంక్లిష్టత వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ సవాళ్లు కరోనా ముందునుంచే ఉన్నా.. ఈ సంక్షోభ పరిస్థితుల్లో పెద్దవిగా కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా వీటికి పరిష్కారం లభించకపోతే తీవ్ర సంక్షోభానికి దారితీయవచ్చు.

పథకం అమలులో సమస్యలకు కారణాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారనే అంశాన్ని బట్టి బడ్జెట్, నిధుల పంపిణీపై విశ్లేషణ జరగాలి.

60 శాతం కేంద్రమే..

మధ్యాహ్న భోజన సదుపాయం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఇందులో మౌలిక సదుపాయాలు, వంట ఖర్చుల్లో కేంద్రం 60 శాతం భరిస్తుంది. ఆహార ధాన్యాల ఖర్చు పూర్తిగా కేంద్రమే అందిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ పథకానికి రూ.11,000 కోట్లు కేటాయించింది. అనంతరం దాన్ని రూ.12,600 కోట్లకు పెంచింది. అదనంగా పెంచిన రూ.1,600 కోట్లు వేసవి నెలల్లోనూ మధ్యాహ్న భోజనాన్ని అమలు చేసేందుకు కేటాయించింది.

రాష్ట్రాలకు అందేది ఎంత?

కేటాయింపులకు భిన్నంగా రాష్ట్రాలకు తక్కువ మొత్తంలో నిధులు అందాయి. అదీ ఆలస్యంగా. మొదటి త్రైమాసికంలో అవసరమైన వంట ఖర్చులతో పోల్చిచూడగా.. కేంద్రం విడుదల చేసిన నిధులు చాలా తక్కువ. ఉదాహరణకు రాజస్థాన్​లో మూడు నెలలకు రూ.173 కోట్లు అవసరమైతే రూ.90 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​లో 60 శాతానికి కన్నా తక్కువ నిధులు అందించింది.

అదనపు నిధుల్లోనూ..

వేసవికాలం కోసం అదనంగా కేటాయించిన నిధులను అందించలేకపోయింది. ఉత్తరాఖండ్​కు అదనంగా రూ.12.54 కోట్లు కేటాయించగా.. అందులో 43 శాతం రూ.5.39 కోట్లు ఇచ్చారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు 70 శాతం మేర అందించారు. వాస్తవానికి అక్టోబర్​ 29 వరకు 20 రాష్ట్రాలకే అదనపు నిధులు అందాయి. వీటికీ మొదటి 3 నెలలకు కేటాయించిన నిధులు రెండో త్రైమాసికానికి విడుదలయ్యాయి.

ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సరిగ్గా నిర్వహించడంలో నిధులు కీలకంగా పనిచేస్తాయి. ఇందుకు మధ్యాహ్న భోజన పథకమే చక్కటి ఉదాహరణ. కరోనా లాంటి తీవ్ర పరిస్థితుల్లో ఆలస్యంగా సేవలందించడానికి నిధుల విడుదలలో జాప్యమే కారణం.

ప్రాథమిక అంచనాల్లోనూ..

నిధుల లభ్యతను పక్కనబెడితే, ఈ పథకం లబ్ధి విద్యార్థులు అందరికీ చేరడం లేదు. పథకం విధివిధానాల ప్రకారం.. క్రితం ఏడాది గణాంకాల ఆధారంగా పిల్లల సంఖ్య, ఖర్చులను కేంద్రానికి నివేదిస్తున్నాయి రాష్ట్రాలు. ఈ అంచనాలనే కేంద్రం సమీక్షించి ఆమోదిస్తుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో ఆహార భద్రత అందుతున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్రాల అంచనాల కన్నా తక్కువగా ఉంటోంది. బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణాలో వేసవికాలంలోనూ ఈ ధోరణి కనిపిస్తోంది.

అయితే ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా మధ్యాహ్న భోజన పథకం అవసరం పెరిగింది. ప్రజల ఆదాయాలు క్షీణించటం, జీవనోపాధి కోల్పోవడం వల్ల కుటుంబాలకు తగిన పోషకాహారం పొందటం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల అంచనాలకు మించి పిల్లల సంఖ్య పెరిగి అంతరం ఏర్పడింది.

సమస్యలు కొత్తేమీ కాదు..

మధ్యాహ్న భోజన పథకంలో ఈ తేడాలు కొత్తేమీ కాదు. పథకానికి సంబంధించిన వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్న 2018-19 గణాంకాలు.. విద్యాశాఖ బడ్జెట్ డేటాబేస్​ (యూడీఐఎస్​ఈ)లోని వివరాల్లో చాలా అంతరం ఉంది. ఉదాహరణకు.. ఈ రెండు సైట్లలో విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే బిహార్​లో 18 లక్షలు, బంగాల్​ 14 లక్షల తేడా కనిపిస్తోంది.

అయితే, కేంద్రం, రాష్ట్రాలపై కరోనా విపత్తు అపారమైన ఆర్థిక భారాన్ని మోపిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఫలితంగా నిధులపై నియంత్రణ పెరిగింది. కానీ, ప్రణాళిక, బడ్జెట్ నిర్వహణ, నిధుల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటం ఎంతైనా అవసరం. ఇందులో విఫలమైతే సుప్రీంకోర్టు హెచ్చరించినట్లు ఈ వైఫల్యాలు పోషకాహార లోపం సంక్షోభానికి దారి తీయవచ్చు.

(రచయితలు- అవని కపూర్​, డైరెక్టర్​ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్ అండ్ ఫెలో, విధాన పరిశోధన కేంద్రం(సీపీఆర్); శరద్ పాండే, రీసెర్చ్ అసోసియేటివ్, సీపీఆర్)

విద్యార్థులకు పోషకాహారం, పాఠశాలల్లో హాజరు శాతం పెంచే ఉద్దేశంతో జాతీయ మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. విద్యార్థుల ఆహార కార్యక్రమంలో ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఈ పథకానికి గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ పథకంలో దేశవ్యాప్తంగా 11.59 కోట్ల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు.

అయితే, కరోనా మహమ్మారి ప్రభావం బోధనపైనే కాకుండా విద్యార్థులకు అందించే పోషకాహారంపైనా పడింది. లాక్​డౌన్​లో పాఠశాలల మూసివేత కారణంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసే ప్రమాదం ఉందని ఈ ఏడాది మార్చిలోనే సుప్రీంకోర్టు గుర్తించింది. ఇందుకు సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. పిల్లలతో సహా పేదరికంలో మగ్గుతున్న వారికి ఆహార భద్రతను కల్పించాలని స్పష్టం చేసింది. తీవ్రం కానున్న పోషకాహార లోపం సంక్షోభాన్ని దీనివల్ల కొంతవరకైనా నియంత్రించవచ్చని తెలిపింది.

రాష్ట్రాలు స్పందించినా..

వెంటనే స్పందించిన కేంద్ర విద్యా శాఖ.. పిల్లల ఇళ్లకు మధ్యాహ్న భోజనం అందించాలని, లేదా ఆహార భద్రత భత్యం ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించింది. కుటుంబాలకు నేరుగా ఆహార భద్రత భత్యం లేదా ధాన్యం అందించడాన్ని రాష్ట్రాలు వేగంగా అమలు చేశాయి. బిహార్​ ప్రభుత్వం నగదు బదిలీ చేయగా.. రాజస్థాన్​, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ధాన్యం, పప్పులు, నూనె వంటివి అందించారు. కేరళ వంటి రాష్ట్రాల్లో బలవర్ధక ఆహారమైన పాలు, గుడ్లు కూడా అందించారు. వేసవి సెలవుల్లోనూ కొనసాగించేందుకు అదనపు నిధులు కావాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరాయి.

కానీ, వీటి ద్వారా నిర్దేశించిన పోషకాహారం లబ్ధిదారులకు అందలేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు చర్యలు తీసుకున్నప్పటికీ, చాలా మంది పిల్లలకు ప్రయోజనం జరగలేదని తేలింది. ఒడిశా, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్​గఢ్, యూపీలో 1,158 మందిపై ఆక్స్​ఫామ్​ నిర్వహించిన సర్వేలో 35 శాతం మంది మధ్యాహ్న భోజనం పొందలేదని వెల్లడైంది. ఉత్తర్​ప్రదేశ్​లో అధికంగా 92 శాతం ఉంది. ఇతర అధ్యయనాల్లోనూ ఇంతకన్నా తక్కువ మంది పిల్లలకే ప్రయోజనం అందినట్లు నివేదించాయి.

కరోనా వేళ మరింత..

ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. పథకం ప్రణాళిక, కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీలో సంక్లిష్టత వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ సవాళ్లు కరోనా ముందునుంచే ఉన్నా.. ఈ సంక్షోభ పరిస్థితుల్లో పెద్దవిగా కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా వీటికి పరిష్కారం లభించకపోతే తీవ్ర సంక్షోభానికి దారితీయవచ్చు.

పథకం అమలులో సమస్యలకు కారణాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారనే అంశాన్ని బట్టి బడ్జెట్, నిధుల పంపిణీపై విశ్లేషణ జరగాలి.

60 శాతం కేంద్రమే..

మధ్యాహ్న భోజన సదుపాయం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఇందులో మౌలిక సదుపాయాలు, వంట ఖర్చుల్లో కేంద్రం 60 శాతం భరిస్తుంది. ఆహార ధాన్యాల ఖర్చు పూర్తిగా కేంద్రమే అందిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ పథకానికి రూ.11,000 కోట్లు కేటాయించింది. అనంతరం దాన్ని రూ.12,600 కోట్లకు పెంచింది. అదనంగా పెంచిన రూ.1,600 కోట్లు వేసవి నెలల్లోనూ మధ్యాహ్న భోజనాన్ని అమలు చేసేందుకు కేటాయించింది.

రాష్ట్రాలకు అందేది ఎంత?

కేటాయింపులకు భిన్నంగా రాష్ట్రాలకు తక్కువ మొత్తంలో నిధులు అందాయి. అదీ ఆలస్యంగా. మొదటి త్రైమాసికంలో అవసరమైన వంట ఖర్చులతో పోల్చిచూడగా.. కేంద్రం విడుదల చేసిన నిధులు చాలా తక్కువ. ఉదాహరణకు రాజస్థాన్​లో మూడు నెలలకు రూ.173 కోట్లు అవసరమైతే రూ.90 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​లో 60 శాతానికి కన్నా తక్కువ నిధులు అందించింది.

అదనపు నిధుల్లోనూ..

వేసవికాలం కోసం అదనంగా కేటాయించిన నిధులను అందించలేకపోయింది. ఉత్తరాఖండ్​కు అదనంగా రూ.12.54 కోట్లు కేటాయించగా.. అందులో 43 శాతం రూ.5.39 కోట్లు ఇచ్చారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు 70 శాతం మేర అందించారు. వాస్తవానికి అక్టోబర్​ 29 వరకు 20 రాష్ట్రాలకే అదనపు నిధులు అందాయి. వీటికీ మొదటి 3 నెలలకు కేటాయించిన నిధులు రెండో త్రైమాసికానికి విడుదలయ్యాయి.

ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సరిగ్గా నిర్వహించడంలో నిధులు కీలకంగా పనిచేస్తాయి. ఇందుకు మధ్యాహ్న భోజన పథకమే చక్కటి ఉదాహరణ. కరోనా లాంటి తీవ్ర పరిస్థితుల్లో ఆలస్యంగా సేవలందించడానికి నిధుల విడుదలలో జాప్యమే కారణం.

ప్రాథమిక అంచనాల్లోనూ..

నిధుల లభ్యతను పక్కనబెడితే, ఈ పథకం లబ్ధి విద్యార్థులు అందరికీ చేరడం లేదు. పథకం విధివిధానాల ప్రకారం.. క్రితం ఏడాది గణాంకాల ఆధారంగా పిల్లల సంఖ్య, ఖర్చులను కేంద్రానికి నివేదిస్తున్నాయి రాష్ట్రాలు. ఈ అంచనాలనే కేంద్రం సమీక్షించి ఆమోదిస్తుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో ఆహార భద్రత అందుతున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్రాల అంచనాల కన్నా తక్కువగా ఉంటోంది. బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణాలో వేసవికాలంలోనూ ఈ ధోరణి కనిపిస్తోంది.

అయితే ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా మధ్యాహ్న భోజన పథకం అవసరం పెరిగింది. ప్రజల ఆదాయాలు క్షీణించటం, జీవనోపాధి కోల్పోవడం వల్ల కుటుంబాలకు తగిన పోషకాహారం పొందటం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల అంచనాలకు మించి పిల్లల సంఖ్య పెరిగి అంతరం ఏర్పడింది.

సమస్యలు కొత్తేమీ కాదు..

మధ్యాహ్న భోజన పథకంలో ఈ తేడాలు కొత్తేమీ కాదు. పథకానికి సంబంధించిన వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్న 2018-19 గణాంకాలు.. విద్యాశాఖ బడ్జెట్ డేటాబేస్​ (యూడీఐఎస్​ఈ)లోని వివరాల్లో చాలా అంతరం ఉంది. ఉదాహరణకు.. ఈ రెండు సైట్లలో విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే బిహార్​లో 18 లక్షలు, బంగాల్​ 14 లక్షల తేడా కనిపిస్తోంది.

అయితే, కేంద్రం, రాష్ట్రాలపై కరోనా విపత్తు అపారమైన ఆర్థిక భారాన్ని మోపిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఫలితంగా నిధులపై నియంత్రణ పెరిగింది. కానీ, ప్రణాళిక, బడ్జెట్ నిర్వహణ, నిధుల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటం ఎంతైనా అవసరం. ఇందులో విఫలమైతే సుప్రీంకోర్టు హెచ్చరించినట్లు ఈ వైఫల్యాలు పోషకాహార లోపం సంక్షోభానికి దారి తీయవచ్చు.

(రచయితలు- అవని కపూర్​, డైరెక్టర్​ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్ అండ్ ఫెలో, విధాన పరిశోధన కేంద్రం(సీపీఆర్); శరద్ పాండే, రీసెర్చ్ అసోసియేటివ్, సీపీఆర్)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.