ETV Bharat / opinion

'దౌత్య నిబంధనలతో జవాన్ల చేతులు కట్టేస్తారా?'

సరిహద్దులో రోజురోజుకు మరింత ముందుకు చొచ్చుకొచ్చి భారత భూభాగాన్ని కాజేయాలని కుటిల చైనా కుట్రలు పన్నుతోంది. సరిహద్దు పరిధిని నిర్ణయించి, వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి స్థాపన కోసం జరుపుతున్న చర్చలను ముందుకు సాగనీయకుండా అడ్డుతగులుతోంది. మరోవైపు సైనికులపై ఆదిమజాతి ఆయుధాలతో దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత భద్రత కోసం ఆయుధాలు ఉపయోగించేలా సైన్యానికి అనుమతిచాలని నిపుణులు చెబుతున్నారు. భారత సైన్యానికి అనుకూలంగా నిబంధనల్లో మార్పులు చేయాలని సూచిస్తున్నారు.

author img

By

Published : Jul 1, 2020, 12:54 PM IST

15 June 2020: Death-Knell of protocols and CBMs
'దౌత్య నిబంధనలతో జవాన్ల చేతులు కట్టేయొద్దు'

జూన్ 15... మంచుదుప్పటి కప్పుకున్న గల్వాన్ లోయలో రక్తపాతం జరిగిన రోజు... 45 ఏళ్ల తర్వాత భారత ఉత్తర సరిహద్దులో హింస చెలరేగిన రోజు... సరిహద్దును రక్షించే క్రమంలో 20 మంది జవాన్లు అమరులైన రోజు.

ఇతర దేశాలను ఆక్రమించాలన్న చైనా వక్రబుద్ధే వీటన్నింటికీ ప్రధాన కారణం.

ఇదీ చదవండి: 'హిందూ మహా సముద్రంలోనూ చైనా కుట్రలు'

అహంకారపూరిత చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత బలగాలపై తెగబడి సైనికుల ప్రాణాలను హరించడమే కాకుండా... 1988లో చేసుకున్న సీబీఎం(విశ్వాసం పెంపొందించే చర్యల) వ్యవస్థకు సైతం పాతరేసింది.

వాస్తవాధీనరేఖ వెంబడి గస్తీ సహా సరిహద్దు నిర్వహణ కోసం భారత్, చైనా 1993, 1996, 2005, 2013 సంవత్సరాలలో నాలుగు అధికారిక ఒప్పందాలు చేసుకున్నాయి. సరిహద్దులో శాంతి, సుస్థిరతలు కొనసాగించాలని 1993 ఒప్పందంలో నిర్ణయించుకున్నాయి. సైనిక శక్తిని ఉపయోగించరాదని, కవ్వింపులకు పాల్పడరాదని అంగీకారానికి వచ్చాయి. వాస్తవాధీన రేఖను పరస్పరం గౌరవించాలని ఒప్పందం చేసుకున్నాయి.

1996 ఒప్పందంలో నిర్దేశించుకున్న సీబీఎం(విశ్వాసం పెంపొందించే చర్యల) ప్రకారం...

  • ఒకరిపై ఒకరు సైనిక శక్తిని ప్రయోగించకూడదు.
  • సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రమాదకరమైన రసాయనాలు వాడరాదు.
  • రెండు కి.మీ వరకు పేలుళ్లు నిర్వహించకూడదు.
  • తుపాకులతో వేటాడటం వంటివి చేపట్టకూడదు.

ఇదీ చదవండి: ఘర్షణకు ముందే మార్షల్‌ యోధులను పంపిన చైనా!

2005లో స్వీయ నియంత్రణ ఒప్పందాలు

ఏదైనా కారణాల వల్ల వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల సైనికులు పరస్పరం ఎదురుపడితే స్వీయ నిగ్రహం పాటించాలని 2005 ఒప్పందంలో నిర్ణయించారు. పరిస్థితిని మరింత తీవ్రతను నివారించేలా అధికారులు చర్యలు తీసుకునేలా ఒడంబడిక కుదుర్చుకున్నారు.

  • ముఖాముఖిగా ఎదురుపడ్డ సైనికులు ఆ ప్రాంతంలో కార్యకలాపాలు ఆపేసి తమ స్థావరాలకు వెనుదిరగాలి.
  • రెచ్చగొట్టే, కవ్వించే చర్యలకు దూరంగా ఉండి పరస్పరం మర్యాదపూర్వకంగా వ్యవహరించుకోవాలి.

2013 భారత్-చైనా సరిహద్దు ఒప్పందం

  • ఇరుపక్షాలు సైనిక శక్తిని అవతలివారిపై ప్రయోగించకూడదు.
  • దాడి చేయడానికి సైనిక శక్తిని ఉపయోగించకూడదు
  • సాయుధ పోరాటాలను నివారించాలి.

ఇదీ చదవండి: జనాభా కట్టడి పేరిట ముస్లింలపై చైనా క్రూరత్వం

కొంత కాలంగా ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో... ఎల్​ఏసీపై స్పష్టత లేని ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయకూడదని కొత్త నిబంధన జోడించారు.

పెరిగిన డ్రిల్స్

సాధారణంగా ఇరుదేశాల సైనికులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వెనక్కి తిరిగి వెళ్లాలని బ్యానర్లు ప్రదర్శించి డ్రిల్ నిర్వహిస్తారు. అవసరమైతే బోర్డర్ పర్సనెల్ మీటింగ్​(బీపీఎం)లు నిర్వహిస్తారు. 1996, 2005 ఒప్పందాల తర్వాత ఈ బ్యానర్ డ్రిల్స్ పెరిగిపోయాయి.

నిజానికి సైనికులు ఎదురుపడ్డ చాలా వరకు సందర్భాల్లో ఈ విధానాన్ని క్రమం తప్పకుండా అనుసరించారు. ఎన్నోసార్లు బలగాలు తిరిగి స్థావరాలకు వెళ్లిపోయాయి. చిన్నపాటి ఘర్షణలు, ముష్టియుద్ధాలు వంటి చెదురుమదురు ఘటనలు కొంతవరకు జరిగాయి. అయితే.. వీటిపై బీపీఎంలలో చర్చించుకొని అధికారులు సామరస్యంగా పరిష్కరించుకున్నారు.

ఉల్లంఘనల పర్వం

కానీ గత ఎనిమిదేళ్లలో అనేకసార్లు ఈ నిబంధనల ఉల్లంఘన జరిగింది. రాఖీ నల్లా, ఛుమర్, పాంగొంగ్ సో, దెమ్​చొక్, డోక్లామ్ వంటి ప్రాంతాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. నియమాలను అనుసరించి చైనా సైన్యం వెనక్కి వెళ్లేందుకు నిరాకరించడం వల్ల ప్రతిష్టంభన సుదీర్ఘంగా సాగింది. ఆ తర్వాత ఈ నియమాలు క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చాయి.

తూర్పు లద్దాఖ్​లోని పాంగొంగ్ సో, గల్వాన్ లోయ, హాట్​స్ప్రింగ్​ గోగ్రాలో తాజాగా జరిగిన ఘర్షణలు... నియమాలు, సీబీఎంలను వైఫల్యానికి మరింత చేరువ చేస్తున్నాయి.

ముందస్తు ప్రణాళికకు నిదర్శనం!

జూన్ 15/16న గల్వాన్​ లోయలో జరిగిన ఘర్షణలో చైనా సైన్యం అత్యంత పాశవికంగా వ్యవహరించింది. మేకులు అమర్చిన రాడ్లు సహా మరికొన్ని మధ్యయుగకాలపు ఆయుధాలను ఉపయోగించి భారత సైనికులపై కిరాతకంగా దాడి చేసింది. చైనా సైన్యం ఎంత ముందస్తు ప్రణాళికతో ఉందనే విషయం ఈ ఆదిమజాతి ఆయుధాల ప్రయోగం ద్వారా అర్థమవుతోంది.

ఇదీ చదవండి: చైనా సర్కారుపై ఆ దేశ సైనికుల కుటుంబాల ఆగ్రహం

మొత్తంగా సరిహద్దులో శాంతి నెలకొల్పాలనే నిబంధనలు, ఘర్షణ తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే నియమాలను పూర్తిగా తుంగలో తొక్కేసింది. ఫలితంగా 20 మంది వీర పుత్రులను భరతమాత కోల్పోయింది.

సమయమిదే

1988 నుంచి 2005 వరకు ఉమ్మడి కార్యాచరణ బృందం నిర్వహించిన 15 సమావేశాల్లో సరిహద్దు ఘర్షణపై ఎలాంటి ముందడుగు పడలేదు. అదే సమయంలో ప్రత్యేక ప్రతినిధులు పాల్గొన్న 22 భేటీల్లో సరిహద్దు సమస్యలను పరిష్కరించే విధంగా ఎలాంటి పురోగతి లభించలేదు. కాబట్టి వాస్తవాధీన రేఖ స్పష్టమైన పరిధిని పునఃసమీక్షించుకోవాడానికి ఇదే సరైన సమయం.

ఇదీ చదవండి: డిజిటల్ యుద్ధం: 59 చైనా యాప్​లపై నిషేధం

అడ్డుకోవడం సహజమే

భారత భూభాగంపై పట్టుసాధించాలని ఊవిళ్లూరుతున్న చైనా.. ఈ చర్చలను ముందుకుసాగనివ్వకపోవచ్చు. మరోవైపు సరిహద్దులో చైనా సైన్యం విశ్వసనీయత కోల్పోయింది. మరింత ముందుకు చొచ్చుకువచ్చి అదనపు భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి వైదొలిగేందుకు నిరాకరిస్తోంది. ఈ క్రమంలో చైనా తన బలాన్ని ఉపయోగించేందుకు ఏమాత్రం సంకోచించదు.

సైన్యమే సర్వస్వం!

కాబట్టి సరిహద్దులో ఎదురయ్యే తీవ్రమైన సవాళ్ల నుంచి తమను తాము కాపాడుకునే హక్కు సైనికులకు ఉందని గుర్తించాలి. వ్యక్తిగత ఆత్మరక్షణ కోసం సైనిక పరిమితులతో సంబంధం లేకుండా ఇతరుల బలప్రయోగాన్ని ఎదుర్కొవాలని సూచించాలి.

ఇదీ చదవండి: గల్వాన్​ ఘటనపై భారత్​కు మద్దతుగా అమెరికా సెనేటర్లు

భారత సైన్యానికి అనుకూలంగా నిబంధనల్లో మార్పులు చేయాలి. వ్యక్తిగత రక్షణ, సహచరుల భద్రత కోసం అవసరమైతే తుపాకులను ఉపయోగించేలా సవరించాలి. వ్యూహాత్మకంగా అవసరమైన ప్రదేశాల్లో రక్షణాత్మక మోహరింపులు చేపట్టాలి. కానీ చైనా సైన్యం వాడినట్లు మధ్యయుగపు ఆయుధాలను ఆశ్రయించకూడదు. ఎందుకంటే సైనికులు దానికి కోసం శిక్షణ తీసుకోలేదు.

ఇదీ చదవండి: పీవోకేలో చైనా విమానాలు.. భారత్​కు వ్యతిరేకంగా కుట్ర

ప్రతి జవాను ప్రాణం దేశానికి అత్యంత విలువైనది. కాబట్టి దౌత్య నిబంధనల పేరుతో సైనికుల చేతులు కట్టేసి సరిహద్దు రక్షణకు పంపించకూడదు. ముందుగా వారి భద్రతకు పెద్దపీట వేయాలి. ఆ తర్వాత చర్చలు ప్రారంభించవచ్చు. చర్చలకు సంబంధించిన కొత్త నియమ నిబంధనలు త్వరలోనే ప్రకటించాలి.

(రచయిత- లెఫ్టినెంట్ జనరల్ రాకేష్ శర్మ, లద్దాఖ్ 14 కార్ప్స్​ మాజీ కమాండర్)

ఇదీ చదవండి: 'అందుకే భారత్​తో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది'

జూన్ 15... మంచుదుప్పటి కప్పుకున్న గల్వాన్ లోయలో రక్తపాతం జరిగిన రోజు... 45 ఏళ్ల తర్వాత భారత ఉత్తర సరిహద్దులో హింస చెలరేగిన రోజు... సరిహద్దును రక్షించే క్రమంలో 20 మంది జవాన్లు అమరులైన రోజు.

ఇతర దేశాలను ఆక్రమించాలన్న చైనా వక్రబుద్ధే వీటన్నింటికీ ప్రధాన కారణం.

ఇదీ చదవండి: 'హిందూ మహా సముద్రంలోనూ చైనా కుట్రలు'

అహంకారపూరిత చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత బలగాలపై తెగబడి సైనికుల ప్రాణాలను హరించడమే కాకుండా... 1988లో చేసుకున్న సీబీఎం(విశ్వాసం పెంపొందించే చర్యల) వ్యవస్థకు సైతం పాతరేసింది.

వాస్తవాధీనరేఖ వెంబడి గస్తీ సహా సరిహద్దు నిర్వహణ కోసం భారత్, చైనా 1993, 1996, 2005, 2013 సంవత్సరాలలో నాలుగు అధికారిక ఒప్పందాలు చేసుకున్నాయి. సరిహద్దులో శాంతి, సుస్థిరతలు కొనసాగించాలని 1993 ఒప్పందంలో నిర్ణయించుకున్నాయి. సైనిక శక్తిని ఉపయోగించరాదని, కవ్వింపులకు పాల్పడరాదని అంగీకారానికి వచ్చాయి. వాస్తవాధీన రేఖను పరస్పరం గౌరవించాలని ఒప్పందం చేసుకున్నాయి.

1996 ఒప్పందంలో నిర్దేశించుకున్న సీబీఎం(విశ్వాసం పెంపొందించే చర్యల) ప్రకారం...

  • ఒకరిపై ఒకరు సైనిక శక్తిని ప్రయోగించకూడదు.
  • సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రమాదకరమైన రసాయనాలు వాడరాదు.
  • రెండు కి.మీ వరకు పేలుళ్లు నిర్వహించకూడదు.
  • తుపాకులతో వేటాడటం వంటివి చేపట్టకూడదు.

ఇదీ చదవండి: ఘర్షణకు ముందే మార్షల్‌ యోధులను పంపిన చైనా!

2005లో స్వీయ నియంత్రణ ఒప్పందాలు

ఏదైనా కారణాల వల్ల వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల సైనికులు పరస్పరం ఎదురుపడితే స్వీయ నిగ్రహం పాటించాలని 2005 ఒప్పందంలో నిర్ణయించారు. పరిస్థితిని మరింత తీవ్రతను నివారించేలా అధికారులు చర్యలు తీసుకునేలా ఒడంబడిక కుదుర్చుకున్నారు.

  • ముఖాముఖిగా ఎదురుపడ్డ సైనికులు ఆ ప్రాంతంలో కార్యకలాపాలు ఆపేసి తమ స్థావరాలకు వెనుదిరగాలి.
  • రెచ్చగొట్టే, కవ్వించే చర్యలకు దూరంగా ఉండి పరస్పరం మర్యాదపూర్వకంగా వ్యవహరించుకోవాలి.

2013 భారత్-చైనా సరిహద్దు ఒప్పందం

  • ఇరుపక్షాలు సైనిక శక్తిని అవతలివారిపై ప్రయోగించకూడదు.
  • దాడి చేయడానికి సైనిక శక్తిని ఉపయోగించకూడదు
  • సాయుధ పోరాటాలను నివారించాలి.

ఇదీ చదవండి: జనాభా కట్టడి పేరిట ముస్లింలపై చైనా క్రూరత్వం

కొంత కాలంగా ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో... ఎల్​ఏసీపై స్పష్టత లేని ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయకూడదని కొత్త నిబంధన జోడించారు.

పెరిగిన డ్రిల్స్

సాధారణంగా ఇరుదేశాల సైనికులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వెనక్కి తిరిగి వెళ్లాలని బ్యానర్లు ప్రదర్శించి డ్రిల్ నిర్వహిస్తారు. అవసరమైతే బోర్డర్ పర్సనెల్ మీటింగ్​(బీపీఎం)లు నిర్వహిస్తారు. 1996, 2005 ఒప్పందాల తర్వాత ఈ బ్యానర్ డ్రిల్స్ పెరిగిపోయాయి.

నిజానికి సైనికులు ఎదురుపడ్డ చాలా వరకు సందర్భాల్లో ఈ విధానాన్ని క్రమం తప్పకుండా అనుసరించారు. ఎన్నోసార్లు బలగాలు తిరిగి స్థావరాలకు వెళ్లిపోయాయి. చిన్నపాటి ఘర్షణలు, ముష్టియుద్ధాలు వంటి చెదురుమదురు ఘటనలు కొంతవరకు జరిగాయి. అయితే.. వీటిపై బీపీఎంలలో చర్చించుకొని అధికారులు సామరస్యంగా పరిష్కరించుకున్నారు.

ఉల్లంఘనల పర్వం

కానీ గత ఎనిమిదేళ్లలో అనేకసార్లు ఈ నిబంధనల ఉల్లంఘన జరిగింది. రాఖీ నల్లా, ఛుమర్, పాంగొంగ్ సో, దెమ్​చొక్, డోక్లామ్ వంటి ప్రాంతాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. నియమాలను అనుసరించి చైనా సైన్యం వెనక్కి వెళ్లేందుకు నిరాకరించడం వల్ల ప్రతిష్టంభన సుదీర్ఘంగా సాగింది. ఆ తర్వాత ఈ నియమాలు క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చాయి.

తూర్పు లద్దాఖ్​లోని పాంగొంగ్ సో, గల్వాన్ లోయ, హాట్​స్ప్రింగ్​ గోగ్రాలో తాజాగా జరిగిన ఘర్షణలు... నియమాలు, సీబీఎంలను వైఫల్యానికి మరింత చేరువ చేస్తున్నాయి.

ముందస్తు ప్రణాళికకు నిదర్శనం!

జూన్ 15/16న గల్వాన్​ లోయలో జరిగిన ఘర్షణలో చైనా సైన్యం అత్యంత పాశవికంగా వ్యవహరించింది. మేకులు అమర్చిన రాడ్లు సహా మరికొన్ని మధ్యయుగకాలపు ఆయుధాలను ఉపయోగించి భారత సైనికులపై కిరాతకంగా దాడి చేసింది. చైనా సైన్యం ఎంత ముందస్తు ప్రణాళికతో ఉందనే విషయం ఈ ఆదిమజాతి ఆయుధాల ప్రయోగం ద్వారా అర్థమవుతోంది.

ఇదీ చదవండి: చైనా సర్కారుపై ఆ దేశ సైనికుల కుటుంబాల ఆగ్రహం

మొత్తంగా సరిహద్దులో శాంతి నెలకొల్పాలనే నిబంధనలు, ఘర్షణ తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే నియమాలను పూర్తిగా తుంగలో తొక్కేసింది. ఫలితంగా 20 మంది వీర పుత్రులను భరతమాత కోల్పోయింది.

సమయమిదే

1988 నుంచి 2005 వరకు ఉమ్మడి కార్యాచరణ బృందం నిర్వహించిన 15 సమావేశాల్లో సరిహద్దు ఘర్షణపై ఎలాంటి ముందడుగు పడలేదు. అదే సమయంలో ప్రత్యేక ప్రతినిధులు పాల్గొన్న 22 భేటీల్లో సరిహద్దు సమస్యలను పరిష్కరించే విధంగా ఎలాంటి పురోగతి లభించలేదు. కాబట్టి వాస్తవాధీన రేఖ స్పష్టమైన పరిధిని పునఃసమీక్షించుకోవాడానికి ఇదే సరైన సమయం.

ఇదీ చదవండి: డిజిటల్ యుద్ధం: 59 చైనా యాప్​లపై నిషేధం

అడ్డుకోవడం సహజమే

భారత భూభాగంపై పట్టుసాధించాలని ఊవిళ్లూరుతున్న చైనా.. ఈ చర్చలను ముందుకుసాగనివ్వకపోవచ్చు. మరోవైపు సరిహద్దులో చైనా సైన్యం విశ్వసనీయత కోల్పోయింది. మరింత ముందుకు చొచ్చుకువచ్చి అదనపు భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి వైదొలిగేందుకు నిరాకరిస్తోంది. ఈ క్రమంలో చైనా తన బలాన్ని ఉపయోగించేందుకు ఏమాత్రం సంకోచించదు.

సైన్యమే సర్వస్వం!

కాబట్టి సరిహద్దులో ఎదురయ్యే తీవ్రమైన సవాళ్ల నుంచి తమను తాము కాపాడుకునే హక్కు సైనికులకు ఉందని గుర్తించాలి. వ్యక్తిగత ఆత్మరక్షణ కోసం సైనిక పరిమితులతో సంబంధం లేకుండా ఇతరుల బలప్రయోగాన్ని ఎదుర్కొవాలని సూచించాలి.

ఇదీ చదవండి: గల్వాన్​ ఘటనపై భారత్​కు మద్దతుగా అమెరికా సెనేటర్లు

భారత సైన్యానికి అనుకూలంగా నిబంధనల్లో మార్పులు చేయాలి. వ్యక్తిగత రక్షణ, సహచరుల భద్రత కోసం అవసరమైతే తుపాకులను ఉపయోగించేలా సవరించాలి. వ్యూహాత్మకంగా అవసరమైన ప్రదేశాల్లో రక్షణాత్మక మోహరింపులు చేపట్టాలి. కానీ చైనా సైన్యం వాడినట్లు మధ్యయుగపు ఆయుధాలను ఆశ్రయించకూడదు. ఎందుకంటే సైనికులు దానికి కోసం శిక్షణ తీసుకోలేదు.

ఇదీ చదవండి: పీవోకేలో చైనా విమానాలు.. భారత్​కు వ్యతిరేకంగా కుట్ర

ప్రతి జవాను ప్రాణం దేశానికి అత్యంత విలువైనది. కాబట్టి దౌత్య నిబంధనల పేరుతో సైనికుల చేతులు కట్టేసి సరిహద్దు రక్షణకు పంపించకూడదు. ముందుగా వారి భద్రతకు పెద్దపీట వేయాలి. ఆ తర్వాత చర్చలు ప్రారంభించవచ్చు. చర్చలకు సంబంధించిన కొత్త నియమ నిబంధనలు త్వరలోనే ప్రకటించాలి.

(రచయిత- లెఫ్టినెంట్ జనరల్ రాకేష్ శర్మ, లద్దాఖ్ 14 కార్ప్స్​ మాజీ కమాండర్)

ఇదీ చదవండి: 'అందుకే భారత్​తో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.