ETV Bharat / lifestyle

BEAUTY TIPS: చిటపట చినుకుల మధ్య మెరిసే చర్మం..

author img

By

Published : Jul 6, 2021, 1:34 PM IST

గాలిలోని దుమ్మూ ధూళితో చర్మం మీద మలినాలు పేరుకుంటాయి. ఎప్పటికప్పుడు ముఖాన్ని శుభ్ర పరచుకోకపోతే మొటిమలు, టాన్‌ సమస్యలు మొదలవుతాయి. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే కేవలం నీటితోనే కడగడం కాకుండా ఫేస్‌ వాష్‌ కూడా ఉపయోగించాలి అంటున్నారు నిపుణులు.

skin brightening
చర్మం మెరవాలంటే

కాలానికి తగ్గట్లుగా చర్మాన్ని పరిరక్షించుకుంటే చాలు. కొన్ని చిట్కాలతో వర్షాల్లోనూ మీ చర్మం మెరుపులీనుతుందంటున్నారు నిపుణులు.

శుభ్రంగా... రోజులో కనీసం మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత రోజ్‌వాటర్‌, కలబంద లేదా యాపిల్‌ సైడార్‌ వెనిగర్‌ను మృదువుగా అప్లై చేయాలి. అరకప్పు గులాబీరేకల ముద్దకు, చెంచా చొప్పున నారింజ తొక్కల పొడి, చెంచా పెరుగు, తేనె చేర్చి బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో మృదువుగా మర్దనా చేసుకుంటూ కడిగేస్తే సరి. చక్కటి నిగారింపు వస్తుంది. గులాబీల్లో సహజంగానే నూనెలుంటాయి. ఇవి తేమను అందించి మెరిపిస్తాయి. నారింజ తొక్కల పొడిలోని విటమిన్‌సి, ఏ లు మేనిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పూతలను రాత్రి నిద్రపోయే ముందు ప్రయత్నిస్తే... మరుసటి రోజు ఉదయం మీ మోము మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

టోనింగ్‌... దీని కోసం పాలు, నిమ్మరసం, కీరదోస రసం లేదా గ్రీన్‌టీ... ఏదో ఒకటి రాస్తే, మృత కణాల బెడద ఉండదు. చెంచా చొప్పున యాపిల్‌ తురుము, గులాబీనీళ్లూ, అరటి పండు గుజ్జు తీసుకోవాలి. దీనికి అరచెంచా ఓట్స్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే సరి. ఇది చర్మంపై టాన్‌ని తొలగిస్తుంది. యాపిల్‌, గులాబీ నీటిలోని విటమిన్‌-సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. నిగారింపునీ ఇస్తుంది. అరటిపండులోని పోషకాలు తేమని అందించి కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి.

టాక్సిన్లను... టాక్సిన్లను బయటికి పంపడానికి ఎక్కువ మంచినీటిని తాగాలి. దీనివల్ల మొటిమలు, మచ్చలకు అవకాశం ఉండదు. బయటి నుంచి వచ్చిన వెంటనే మేకప్‌ను తొలగించి, శుభ్రం చేసుకోవాలి.

నలుగుతో... వారానికొకసారైనా ఒంటికి కొబ్బరి నూనె రాసి పెసర లేదా సెనగ పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. రోజూ అరచెక్క నిమ్మరసాన్ని పిండిన గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

ముఖంపై పేరుకున్న నలుపుదనం పోవాలంటే మూడు చెంచాల పెసరపిండి తీసుకోవాలి. దీనిలో అరకప్పు గులాబీనీరు, మూడు చెంచాల రోజ్​ ఆయిల్​, చెంచా పంచదార కలిపి పేస్టులా చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కాస్త పాలు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్​లా వేసుకోవాలి. పావుగంటయ్యాక నీళ్లతో చేతులు తడుపుకుంటూ మృదువుగా రుద్దాలి. ఇలా కనీసం వారంలో ఒకటి రెండు సార్లు చేస్తే మీ సమస్య దూరమవుతుంది.

కొందరి ముఖం ఇట్టే జిడ్డు కారుతుంది. ఇలాంటి వారు పెసరపిండి, తేనె, పెరుగు కలపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తుంటే సమస్య అదుపులోకి వస్తుంది. చర్మంపై నలుపుదనం క్రమంగా తగ్గుతుంది.

నాలుగు చెంచాల పెసరపిండిలో గుప్పెడు గులాబీరేకలు, కొద్దిగా పాలు వేసి పేస్టులా చేసుకోవాలి. దీనికి కాస్త బాత్​ సాల్ట్​ చేర్చుకుని ఒంటికి రుద్దుకోవడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి, దుమ్ము, ధూళి మృతకణాలు తొలగిపోతాయి. చర్మం నునుపుగా మారుతుంది.

ఇదీ చూడండి: ముఖం, మెడ భాగంలో నల్లగా, జిడ్డుగా ఉంది.. ఏం చేయాలి?

కాలానికి తగ్గట్లుగా చర్మాన్ని పరిరక్షించుకుంటే చాలు. కొన్ని చిట్కాలతో వర్షాల్లోనూ మీ చర్మం మెరుపులీనుతుందంటున్నారు నిపుణులు.

శుభ్రంగా... రోజులో కనీసం మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత రోజ్‌వాటర్‌, కలబంద లేదా యాపిల్‌ సైడార్‌ వెనిగర్‌ను మృదువుగా అప్లై చేయాలి. అరకప్పు గులాబీరేకల ముద్దకు, చెంచా చొప్పున నారింజ తొక్కల పొడి, చెంచా పెరుగు, తేనె చేర్చి బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో మృదువుగా మర్దనా చేసుకుంటూ కడిగేస్తే సరి. చక్కటి నిగారింపు వస్తుంది. గులాబీల్లో సహజంగానే నూనెలుంటాయి. ఇవి తేమను అందించి మెరిపిస్తాయి. నారింజ తొక్కల పొడిలోని విటమిన్‌సి, ఏ లు మేనిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పూతలను రాత్రి నిద్రపోయే ముందు ప్రయత్నిస్తే... మరుసటి రోజు ఉదయం మీ మోము మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

టోనింగ్‌... దీని కోసం పాలు, నిమ్మరసం, కీరదోస రసం లేదా గ్రీన్‌టీ... ఏదో ఒకటి రాస్తే, మృత కణాల బెడద ఉండదు. చెంచా చొప్పున యాపిల్‌ తురుము, గులాబీనీళ్లూ, అరటి పండు గుజ్జు తీసుకోవాలి. దీనికి అరచెంచా ఓట్స్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే సరి. ఇది చర్మంపై టాన్‌ని తొలగిస్తుంది. యాపిల్‌, గులాబీ నీటిలోని విటమిన్‌-సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. నిగారింపునీ ఇస్తుంది. అరటిపండులోని పోషకాలు తేమని అందించి కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి.

టాక్సిన్లను... టాక్సిన్లను బయటికి పంపడానికి ఎక్కువ మంచినీటిని తాగాలి. దీనివల్ల మొటిమలు, మచ్చలకు అవకాశం ఉండదు. బయటి నుంచి వచ్చిన వెంటనే మేకప్‌ను తొలగించి, శుభ్రం చేసుకోవాలి.

నలుగుతో... వారానికొకసారైనా ఒంటికి కొబ్బరి నూనె రాసి పెసర లేదా సెనగ పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. రోజూ అరచెక్క నిమ్మరసాన్ని పిండిన గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

ముఖంపై పేరుకున్న నలుపుదనం పోవాలంటే మూడు చెంచాల పెసరపిండి తీసుకోవాలి. దీనిలో అరకప్పు గులాబీనీరు, మూడు చెంచాల రోజ్​ ఆయిల్​, చెంచా పంచదార కలిపి పేస్టులా చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కాస్త పాలు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్​లా వేసుకోవాలి. పావుగంటయ్యాక నీళ్లతో చేతులు తడుపుకుంటూ మృదువుగా రుద్దాలి. ఇలా కనీసం వారంలో ఒకటి రెండు సార్లు చేస్తే మీ సమస్య దూరమవుతుంది.

కొందరి ముఖం ఇట్టే జిడ్డు కారుతుంది. ఇలాంటి వారు పెసరపిండి, తేనె, పెరుగు కలపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తుంటే సమస్య అదుపులోకి వస్తుంది. చర్మంపై నలుపుదనం క్రమంగా తగ్గుతుంది.

నాలుగు చెంచాల పెసరపిండిలో గుప్పెడు గులాబీరేకలు, కొద్దిగా పాలు వేసి పేస్టులా చేసుకోవాలి. దీనికి కాస్త బాత్​ సాల్ట్​ చేర్చుకుని ఒంటికి రుద్దుకోవడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి, దుమ్ము, ధూళి మృతకణాలు తొలగిపోతాయి. చర్మం నునుపుగా మారుతుంది.

ఇదీ చూడండి: ముఖం, మెడ భాగంలో నల్లగా, జిడ్డుగా ఉంది.. ఏం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.