ETV Bharat / jagte-raho

'కావాలనే తహసీల్దార్ నాపై దాడి చేయించారు'

author img

By

Published : Nov 2, 2020, 8:33 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం తహసీల్దార్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన చేస్తున్న తెలంగాణ సామాజిక న్యాయవేదిక అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్​పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అవినీతిని ప్రశ్నించినందుకు కావాలనే తహసీల్దార్ తనపై దాడి చేయించారని పోలీస్​స్టేషన్​లో ఆయన ఫిర్యాదు చేశారు.

Somebody beat in nagaram surypeta district Annaparti gnanasundaram
'కావాలనే తహాసీల్దార్ నాపై దాడి చేయించారు'

సూర్యాపేట జిల్లా నాగారం తహసీల్దార్ గొబ్బిళ్ల శ్రీకాంత్ అవినీతిని ప్రశ్నించినందుకే తనపై దాడి చేయించారని తెలంగాణ సామాజిక న్యాయవేదిక అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్​ ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు అఖలపక్షం ఆధ్యర్వంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

తనపై దాడిని ముందే ఊహించానని, దీనిపై జిల్లా ఎస్పీ, కలెక్టర్​కు సమాచారం అందించానని ఆయన తెలిపారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తనపై దాడికి పాల్పడటం అప్రజాస్వామికమని ఆరోపించారు. తనపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:పట్టభద్రుల ఓటు నమోదుపై ముస్లిం మైనార్టీలకు అవగాహన సదస్సు

సూర్యాపేట జిల్లా నాగారం తహసీల్దార్ గొబ్బిళ్ల శ్రీకాంత్ అవినీతిని ప్రశ్నించినందుకే తనపై దాడి చేయించారని తెలంగాణ సామాజిక న్యాయవేదిక అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్​ ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు అఖలపక్షం ఆధ్యర్వంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

తనపై దాడిని ముందే ఊహించానని, దీనిపై జిల్లా ఎస్పీ, కలెక్టర్​కు సమాచారం అందించానని ఆయన తెలిపారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తనపై దాడికి పాల్పడటం అప్రజాస్వామికమని ఆరోపించారు. తనపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:పట్టభద్రుల ఓటు నమోదుపై ముస్లిం మైనార్టీలకు అవగాహన సదస్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.