ETV Bharat / jagte-raho

పెళ్లి వేడుకల్లో ఘర్షణ... యువకుడి హత్య

author img

By

Published : Dec 11, 2020, 10:49 AM IST

పెళ్లి వేడుకల్లో చోటు చేసుకున్న ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలు బలిగింది. ఊరేగింపులో జరిగిన వాగ్వాదం క్రమంగా పెరిగి యువకుడి హత్యకు దారి తీసింది. ఆవేశంతో ముగ్గురు వ్యక్తులు కలిసి పూదరి లక్ష్మణ్​ అనే వ్యక్తిని కత్తితో పొడిచారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

young man murdered by three men in marriage celebrations at bheemaram in jagtial district
పెళ్లి వేడుకల్లో ఘర్షణ... యువకుడి హత్య

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకల్లో కొందరు యువకులు ఘర్షణ పడ్డారు. వాగ్వాదం క్రమంగా పెరిగి ఊరేగింపు అనంతరం పూదరి లక్ష్మణ్ అనే యువకున్ని అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు.

యువకుడి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కోరుట్ల సీఐ రాజశేఖర రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకల్లో కొందరు యువకులు ఘర్షణ పడ్డారు. వాగ్వాదం క్రమంగా పెరిగి ఊరేగింపు అనంతరం పూదరి లక్ష్మణ్ అనే యువకున్ని అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు.

యువకుడి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కోరుట్ల సీఐ రాజశేఖర రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పెద్దలు అంగీకరించలేదని... ప్రేమజంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.