ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ రూబియా బేగం.. పట్టణంలోని 20వ వార్డు వాలంటీర్గా విధులు నిర్వహిస్తోంది. డీఈడీ ఆఖరి సంవరత్సరం పరీక్షల నిమిత్తం.. సత్తెనపల్లి నుంచి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలకు తన భర్త ఫణిదరపు అశోక్ కుమార్తో కలసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది.
పరీక్ష రాసి తిరిగి వస్తుండగా.. చిలకలూరిపేట రోడ్డులోని ఓవర్ బ్రిడ్జ్ పైకి రాగానే ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూబియా బేగం తీవ్రంగా గాయపడటంతో.. జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ రూబియా బేగం ఇవాళ మృతి చెందినట్లు.. రెండో పట్టణ ఎస్సై రబ్బానీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి : సహనం కోల్పోయిన అత్త.. కిరాతంగా అల్లుడి హత్య