మేడ్చల్ జిల్లా ఉప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆకుతోట బావి తాండకు చెందిన నరేశ్, పోచారం గ్రామానికి చెందిన గణేశ్.. ద్విచక్రవాహనంపై రామంతాపూర్ నుంచి ఉప్పల్కు వెళ్తున్నారు. ఐడీఏ ఉప్పల్కు రాగానే జేసీబీ వాహనాన్ని ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు.