ETV Bharat / jagte-raho

చెట్టుని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్రగాయాలు

నిర్మల్‌ జిల్లా కడెం మండలం ఉడుంపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం చెట్టుని ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్రగాయలయ్యాయి. చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

author img

By

Published : Jul 29, 2020, 11:02 PM IST

accident
accident

నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ వద్ద ద్విచక్రవాహనం చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ముగ్గురు కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మృతులు ఆదిల్ అహ్మద్, మహమ్మద్ అన్వర్‌గా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన మహేష్‌ను ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.

ఘటనా స్థలాన్ని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐ జైరామ్ పరిశీలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఖానాపూర్ ఆసుపత్రికి తరలించి... కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

చదవండి: ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక

నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ వద్ద ద్విచక్రవాహనం చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ముగ్గురు కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మృతులు ఆదిల్ అహ్మద్, మహమ్మద్ అన్వర్‌గా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన మహేష్‌ను ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.

ఘటనా స్థలాన్ని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐ జైరామ్ పరిశీలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఖానాపూర్ ఆసుపత్రికి తరలించి... కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

చదవండి: ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.