బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. గతంలో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో దేవరాజ్పై శ్రావణి ఫిర్యాదు చేయగా అతనిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత బైయిల్పై విడుదలయ్యాడు.
అనంతరం శ్రావణి దేవరాజ్ను కలిసింది. అతనితో కలిసి సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరు జాగ్రత్తపడ్డారు. మళ్లీ సాన్నిహిత్యంగా మెలిగారు. శ్రావణి ఆత్మహత్య చేసుకునే రెండు రోజుల ముందు శ్రీ కన్యలో ఇద్దరు కలిశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సాయి రెడ్డికి దేవరాజ్కు మాటమాట పెరిగి... ఇద్దరు గొడవపడినట్లు విచారణలో తేలింది.
ఇదీ చూడండి: కుటుంబసభ్యులే వేధిస్తున్నారని చెప్పింది: దేవరాజ్