ETV Bharat / jagte-raho

కొరియర్​ బాయ్​ని కాపాడేందుకు... ఓ ఇంట్లో ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో గాలివాన ముగ్గురిని బలికొంది. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

author img

By

Published : Oct 18, 2020, 9:04 PM IST

కొరియర్​ బాయ్​ని కాపాడేందుకు... ఓ ఇంట్లో ముగ్గురు మృతి
కొరియర్​ బాయ్​ని కాపాడేందుకు... ఓ ఇంట్లో ముగ్గురు మృతి

ఏపీలోని నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు... విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. శనివారం రాత్రి నగరంలో భారీ వర్షం కురవగా... హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న వేణుగోపాల్ ఇంటికి శనివారం రాత్రి కొరియర్ సర్వీస్ బాయ్ వచ్చాడు. అతన్ని ఇంట్లోకి రావద్దని... విద్యుత్ తీగలు పడతాయని చెప్పడానికి ప్రయత్నించి బయటకు వచ్చిన వేణుగోపాల్​పై గాలికి విద్యుత్ తీగలు పడ్డాయి.

అతన్ని రక్షించబోయే క్రమంలో అతని తల్లి బుజ్జమ్మ వేణుగోపాల్​ను పట్టుకుంది. అరుపులకు బయటకు వచ్చిన అతని భార్య వారిద్దరినీ పట్టుకోగా ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మరణించారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ట్రాన్స్​కో సిబ్బందికి తెలిపి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. ముగ్గురి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: పెళ్లైన ఆరునెలలకే వివాహిత ఆత్మహత్య

ఏపీలోని నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు... విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. శనివారం రాత్రి నగరంలో భారీ వర్షం కురవగా... హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న వేణుగోపాల్ ఇంటికి శనివారం రాత్రి కొరియర్ సర్వీస్ బాయ్ వచ్చాడు. అతన్ని ఇంట్లోకి రావద్దని... విద్యుత్ తీగలు పడతాయని చెప్పడానికి ప్రయత్నించి బయటకు వచ్చిన వేణుగోపాల్​పై గాలికి విద్యుత్ తీగలు పడ్డాయి.

అతన్ని రక్షించబోయే క్రమంలో అతని తల్లి బుజ్జమ్మ వేణుగోపాల్​ను పట్టుకుంది. అరుపులకు బయటకు వచ్చిన అతని భార్య వారిద్దరినీ పట్టుకోగా ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మరణించారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ట్రాన్స్​కో సిబ్బందికి తెలిపి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. ముగ్గురి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: పెళ్లైన ఆరునెలలకే వివాహిత ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.