మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పుతండా, దుబ్బతండా, రేఖ్యాతండా, మేఘ్యాతండాల్లో... అక్రమ గుడుంబా స్థావరాలపై పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 30 లీటర్ల గుడుంబా, 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
ఈ దాడుల్లో 30 కిలోల నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి పాల్పడుతున్న 12 మందిని అరెస్టు చేసినట్టు తొర్రూరు ఎక్సైజ్ సీఐ లావణ్య సంధ్య తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై వెంకన్నతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉంది: హోంమంత్రి