ETV Bharat / jagte-raho

ఎడపల్లి మండల కేంద్రంలో ఏటీఎం చోరీకి విఫలయత్నం

author img

By

Published : Nov 5, 2020, 5:22 PM IST

దొంగలు ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఏటీఎం తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని.. డబ్బులేమీ పోలేదని పోలీసులు తెలిపారు.

thieves attempt to steel atm at edapalli mandal
ఎడపల్లి మండల కేంద్రంలో ఏటీఎం చోరీకి విఫలయత్నం

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో దొంగలు హల్​చల్ సృష్టించారు. మండల కేంద్రంలోని మంగల్ పహడ్ క్రాస్​రోడ్ వద్ద ఉన్న ఇండియా వన్​ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. బోధన్-నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది.

బోధన్ డివిజన్ ఏసీపీ రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏటీఎంలోని డబ్బులు పోలేదని తెలిపారు. బుధవారం రాత్రి సుమారు 2 గంటల ప్రాతంలో చోరీకి పాల్పడ్డారన్నారు. ఏటీఎం తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయుంటారని చెప్పారు. ఏసీపీతో పాటు బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ ఎల్లాగౌడ్ ఉన్నారు.

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో దొంగలు హల్​చల్ సృష్టించారు. మండల కేంద్రంలోని మంగల్ పహడ్ క్రాస్​రోడ్ వద్ద ఉన్న ఇండియా వన్​ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. బోధన్-నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది.

బోధన్ డివిజన్ ఏసీపీ రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏటీఎంలోని డబ్బులు పోలేదని తెలిపారు. బుధవారం రాత్రి సుమారు 2 గంటల ప్రాతంలో చోరీకి పాల్పడ్డారన్నారు. ఏటీఎం తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయుంటారని చెప్పారు. ఏసీపీతో పాటు బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ ఎల్లాగౌడ్ ఉన్నారు.

ఇదీ చూడండి: భార్య గొంతు కోసి కాలువలో పడేసి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.