ETV Bharat / jagte-raho

వాగులో ఈతకు వెళ్లి బాలుడు మృతి

వాగులో ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్​ శివారులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

author img

By

Published : Sep 24, 2020, 12:21 PM IST

The boy fell into the river and died in nizamabad district
వాగులో ఈతకు వెళ్లి బాలుడు మృతి

నిజామాబాద్ నగర శివారులోని బోర్గం వాగులో ఈతకు వెళ్లిన ఓ బాలుడు నీటి మునిగి మృతి చెందాడు. శ్రీనగర్​ కాలనీ చెందిన సిద్ధార్థ్​(11) బుధవారం వాగులో ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడం వల్ల నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు.

నీటి ప్రవాహం ఎక్కవగా ఉండటంతో బుధవారం బాలుడి ఆచూకీ లభించలేదు. గురువారం ప్రవాహం తగ్గటంతో మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా ముళ్లపొదల్లో మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నిజామాబాద్ నగర శివారులోని బోర్గం వాగులో ఈతకు వెళ్లిన ఓ బాలుడు నీటి మునిగి మృతి చెందాడు. శ్రీనగర్​ కాలనీ చెందిన సిద్ధార్థ్​(11) బుధవారం వాగులో ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడం వల్ల నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు.

నీటి ప్రవాహం ఎక్కవగా ఉండటంతో బుధవారం బాలుడి ఆచూకీ లభించలేదు. గురువారం ప్రవాహం తగ్గటంతో మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా ముళ్లపొదల్లో మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ధికారులు సహకరించటం లేదని సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.