ETV Bharat / jagte-raho

కిర్గిస్థాన్‌ దేశంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు - కిర్గిస్థాన్​లో చిక్కుకున్న విద్యార్థులు తాజా వార్తలు

వైద్య విద్య కోసం కిర్గిస్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వదేశానికి రావడానికి నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి తమను భారత్​కు తీసుకురావాలని కోరుతున్నారు.

Telugu students stranded in Kyrgyzstan
కిర్గిస్థాన్‌ దేశంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు
author img

By

Published : Jul 11, 2020, 10:47 AM IST

తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 235 మంది విద్యార్థులు బిష్కేక్​లోని ఏషియన్ మెడికల్ ఇనిస్టిట్యూట్​లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కిర్గిస్థాన్​లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ దేశ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా 235 మంది విద్యార్థులు స్వదేశం రావడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కొక్కరు రూ.45 వేలు ఏజెంట్​కు చెల్లించారు. వీరిలో తెలంగాణకు చెందిన 170 మంది, ఆంధ్రకు చెందిన 65మంది విద్యార్థులున్నారు.

శుక్రవారం ఉదయం 11 గంటలకు విమానం ఉందని ఏజెంట్​ చెప్పడంతో విద్యార్థులంతా బిష్కేక్​లోని మానస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లాక రాయబార కార్యాలయ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో విమానం రద్దయిందని ఏజెంట్ తెలిపాడు. ఫలితంగా 12 గంటల పాటు విద్యార్థులందరూ అక్కడే ఆందోళన చేశారు. కనీసం మంచినీళ్లు కూడా అందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నారు.

కిర్గిస్థాన్‌ దేశంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు

ఇదీచూడండి: తక్కువ ఖర్చుతో కరోనా పరీక్ష.. 2 నూతన పద్ధతులు అభివృద్ధి

తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 235 మంది విద్యార్థులు బిష్కేక్​లోని ఏషియన్ మెడికల్ ఇనిస్టిట్యూట్​లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కిర్గిస్థాన్​లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ దేశ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా 235 మంది విద్యార్థులు స్వదేశం రావడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కొక్కరు రూ.45 వేలు ఏజెంట్​కు చెల్లించారు. వీరిలో తెలంగాణకు చెందిన 170 మంది, ఆంధ్రకు చెందిన 65మంది విద్యార్థులున్నారు.

శుక్రవారం ఉదయం 11 గంటలకు విమానం ఉందని ఏజెంట్​ చెప్పడంతో విద్యార్థులంతా బిష్కేక్​లోని మానస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లాక రాయబార కార్యాలయ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో విమానం రద్దయిందని ఏజెంట్ తెలిపాడు. ఫలితంగా 12 గంటల పాటు విద్యార్థులందరూ అక్కడే ఆందోళన చేశారు. కనీసం మంచినీళ్లు కూడా అందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నారు.

కిర్గిస్థాన్‌ దేశంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు

ఇదీచూడండి: తక్కువ ఖర్చుతో కరోనా పరీక్ష.. 2 నూతన పద్ధతులు అభివృద్ధి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.