ETV Bharat / jagte-raho

ముషీరాబాద్​లో క్రికెట్​ బెట్టింగ్... రెండు ముఠాలు అరెస్ట్

author img

By

Published : Oct 21, 2020, 7:40 PM IST

ముషీరాబాద్​లో ఆన్​లైన్​ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోన్న రెండు ముఠాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, సెల్​ఫోన్లు, ప్రొజెక్టర్, ఎల్​ఈడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు.

task force police arrest cricket betting gang in hyderabad
ముషీరాబాద్​లో క్రికెట్​ బెట్టింగ్... రెండు ముఠాలు అరెస్ట్

ఆన్​లైన్​లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్​లోని ముషీరాబాద్ గాంధీ నగర్​లో ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని గాంధీ నగర్ పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి ఒక ప్రొజెక్టర్, ఒక సెటప్ బాక్స్, 5 సెల్ ఫోన్లు, రూ.25వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరోచోట ముషీరాబాద్​లోని పార్శీగుట్టలో ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. వారి నుంచి ఒక ఎల్ఈడీ టీవీ, సెటప్ బాక్స్, 6 సెల్ ఫోన్లు, రూ.39,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఆన్​లైన్​లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్​లోని ముషీరాబాద్ గాంధీ నగర్​లో ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని గాంధీ నగర్ పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి ఒక ప్రొజెక్టర్, ఒక సెటప్ బాక్స్, 5 సెల్ ఫోన్లు, రూ.25వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరోచోట ముషీరాబాద్​లోని పార్శీగుట్టలో ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. వారి నుంచి ఒక ఎల్ఈడీ టీవీ, సెటప్ బాక్స్, 6 సెల్ ఫోన్లు, రూ.39,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: రూ. 11.5 లక్షల విలువైన గుట్కా పట్టివేత.. వ్యక్తి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.