యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం సోమారంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ. 30,070 నగదు, 20 సెట్ల ఫ్లైయింగ్ కార్డ్స్, 12 మొబైల్స్ స్వాధీనం చేసుకొని రాజపేట పోలీసులకు అప్పగించారు.
