ETV Bharat / jagte-raho

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్‌.. ఒకరు మృతి!

author img

By

Published : Feb 6, 2021, 11:03 AM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

road accident
రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బైక్‌పై ముగ్గురు వ్యక్తులు సంగారెడ్డి పాత బస్టాండు నుంచి పోతిరెడ్డిపల్లి వైపు వెళుతుండగా రహదారి పక్కన ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీ కొట్టారు.

ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బైక్‌పై ముగ్గురు వ్యక్తులు సంగారెడ్డి పాత బస్టాండు నుంచి పోతిరెడ్డిపల్లి వైపు వెళుతుండగా రహదారి పక్కన ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీ కొట్టారు.

ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: టీచర్ మందలించిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.