ETV Bharat / jagte-raho

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

author img

By

Published : Jan 21, 2021, 7:07 PM IST

Updated : Jan 21, 2021, 11:30 PM IST

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

19:05 January 21

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా..హైదరాబాద్ ఆసుపత్రిలో ఇద్దరు, దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో మరొకరు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ మల్లేశంతో పాటు అతని తల్లి పెద్దమ్మ, భార్య చంద్రకళ, మరో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.  మరో 11 మందికి గాయాలయ్యాయి. మృతులను దేవరకొండ మండలం చింతబావికి చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి, ఇంకొందరిని హైదరాబాద్​కు తరలించారు.

            కూలీలు వరినాట్ల కోసం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

మృతుల వివరాలు

1. మల్లేశం (ఆటోడ్రైవర్‌)

2. పెద్దమ్మ ( ఆటో డ్రైవర్ తల్లి )

3. చంద్రకళ ( ఆటోడ్రైవర్ భార్య )

4. నోముల సైదమ్మ

5. నోముల పెద్దమ్మ

6. నోముల అంజమ్మ

7. దొడుగు ఇద్దమ్మ 

8. లింగమ్మ

9. అలివేలు

ఇదీ చదవండి: అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం

19:05 January 21

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా..హైదరాబాద్ ఆసుపత్రిలో ఇద్దరు, దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో మరొకరు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ మల్లేశంతో పాటు అతని తల్లి పెద్దమ్మ, భార్య చంద్రకళ, మరో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.  మరో 11 మందికి గాయాలయ్యాయి. మృతులను దేవరకొండ మండలం చింతబావికి చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి, ఇంకొందరిని హైదరాబాద్​కు తరలించారు.

            కూలీలు వరినాట్ల కోసం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

మృతుల వివరాలు

1. మల్లేశం (ఆటోడ్రైవర్‌)

2. పెద్దమ్మ ( ఆటో డ్రైవర్ తల్లి )

3. చంద్రకళ ( ఆటోడ్రైవర్ భార్య )

4. నోముల సైదమ్మ

5. నోముల పెద్దమ్మ

6. నోముల అంజమ్మ

7. దొడుగు ఇద్దమ్మ 

8. లింగమ్మ

9. అలివేలు

ఇదీ చదవండి: అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం

Last Updated : Jan 21, 2021, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.