ETV Bharat / jagte-raho

ట్రాక్టర్​ బోల్తా పడి ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు..

ట్రాక్టర్​ బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మోతె శివారులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

author img

By

Published : Oct 31, 2020, 7:13 PM IST

road accident at mothe in kamareddy district
ట్రాక్టర్​ బోల్తా పడి ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు..

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మోతె గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ముస్తాపూర్ గ్రామానికి చెందిన రాజు ట్రాక్టర్​ డ్రైవర్​గా పని చేస్తున్నాడు.

ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన రాయి తీసుకురావడానికి రాజుతో పాటు ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు మోతె గ్రామానికి వెళ్తున్నారు. మోతె శివారులో వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్​ అదుపుతప్పి బోల్తా పడింది. రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాజుకు భార్య, ఒక కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మోతె గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ముస్తాపూర్ గ్రామానికి చెందిన రాజు ట్రాక్టర్​ డ్రైవర్​గా పని చేస్తున్నాడు.

ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన రాయి తీసుకురావడానికి రాజుతో పాటు ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు మోతె గ్రామానికి వెళ్తున్నారు. మోతె శివారులో వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్​ అదుపుతప్పి బోల్తా పడింది. రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాజుకు భార్య, ఒక కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: 'మేం ఎమ్మెల్యే మనుషులం... మాకు ఎదురులేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.