ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి

author img

By

Published : Nov 8, 2020, 10:31 PM IST

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జవహర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

road accident at javaharnagar in medchal district
ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి

మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాయిపల్లికి చెందిన బాబు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై తిమ్మాయిపల్లి నుంచి జవహర్​నగర్​కు వస్తున్నారు. ఇదే క్రమంలో జవహర్​నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అతనికి ఎదురుగా సురేశ్​ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి బాబు వాహనాన్ని ఢీ కొట్టాడు.

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాబు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. సురేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాయిపల్లికి చెందిన బాబు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై తిమ్మాయిపల్లి నుంచి జవహర్​నగర్​కు వస్తున్నారు. ఇదే క్రమంలో జవహర్​నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అతనికి ఎదురుగా సురేశ్​ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి బాబు వాహనాన్ని ఢీ కొట్టాడు.

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాబు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. సురేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం.. కళ్లముందే దగ్ధమైన వరిగడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.