ETV Bharat / jagte-raho

చెట్టుకింద నిలబడ్డ ఆర్​ఎంపీపై పిడుగు.. అక్కడికక్కడే మృతి

author img

By

Published : Sep 30, 2020, 9:14 AM IST

Updated : Sep 30, 2020, 1:51 PM IST

ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తూ... పిడుగుపాటుకు గురై ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగింది. వైద్యుడు అక్కడిక్కడే మృతి చెందగా మిగతా వారు స్పృహ కోల్పోయారు.

rmp doctor died due to lightning strike in khammam district
మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తూ... పిడుగుపాటుతో వైద్యుడు మృతి

ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రి నుంచి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై శ్రీనివాసరెడ్డి అనే గ్రామీణ వైద్యుడు మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఖమ్మంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

గన్నవరంలో విషాదం

తాటిపుడి వద్ద వర్షం రావడం వల్ల రహదారి పక్కన చెట్టుకింద ద్విచక్రవాహనంతో ఆగి ఉండగా... పిడుగుపడింది. వైద్యుడు శ్రీనివాసరెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. మహిళతో పాటు చెట్టుకింద ఉన్న పలువురు స్పృహ కోల్పోయారు. వారిని అంబులెన్స్‌లో వైరా ఆస్పత్రికి తరలించారు. ఆర్​ఎంపీ మృతితో గన్నవరంలో విషాదం అలుముకుంది.

ఇదీ చదవండి: అమ్మకి గుండెపోటని వెళ్లాడు... కన్పించకుండాపోయాడు

ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రి నుంచి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై శ్రీనివాసరెడ్డి అనే గ్రామీణ వైద్యుడు మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఖమ్మంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

గన్నవరంలో విషాదం

తాటిపుడి వద్ద వర్షం రావడం వల్ల రహదారి పక్కన చెట్టుకింద ద్విచక్రవాహనంతో ఆగి ఉండగా... పిడుగుపడింది. వైద్యుడు శ్రీనివాసరెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. మహిళతో పాటు చెట్టుకింద ఉన్న పలువురు స్పృహ కోల్పోయారు. వారిని అంబులెన్స్‌లో వైరా ఆస్పత్రికి తరలించారు. ఆర్​ఎంపీ మృతితో గన్నవరంలో విషాదం అలుముకుంది.

ఇదీ చదవండి: అమ్మకి గుండెపోటని వెళ్లాడు... కన్పించకుండాపోయాడు

Last Updated : Sep 30, 2020, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.