నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలిక(9)పై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 20న బాలికను ద్విచక్రవాహనంపై గ్రామశివారుకు తీసుకెళ్లిన యువకుడు.. ఎవరూ లేని సమయం చూసి అత్యాచారానికి యత్నించాడు.
బాలిక కేకలు వేస్తూ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు ఆ యువకుడిపై బోధన్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
- ఇవీ చూడండి: 'ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు బయటకు రావాలి'