ETV Bharat / jagte-raho

మత్తు పదార్థాల కలకలం... డిగ్రీ విద్యార్థులు అరెస్ట్

author img

By

Published : Dec 29, 2020, 6:00 PM IST

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్​లో పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అమీర్​పేటకు చెందిన డిగ్రీ విద్యార్థుల నుంచి దాదాపు రూ.5లక్షలు విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.

police-seized-drugs-and-three-degree-students-arrested-in-hyderabad
మత్తు పదార్థాల కలకలం... డిగ్రీ విద్యార్థులు అరెస్ట్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మత్తు పదార్ధాల సరఫరాపై రాచకొండ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు డిగ్రీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.8లక్షల విలువ చేసే 1.5లీటర్ల హాషిష్ ద్రావణం, 3 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నిందితులు అమీర్​పేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఉదయ్ అనే వ్యక్తి నుంచి చింతల సందీప్, షిండే సాయి చరణ్, యాప్ర నవీన్​లు మత్తు పదార్థాలను నగరానికి తీసుకొస్తుండగా దిల్​సుఖ్​నగర్​ వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ద్రావణాన్ని రూ.3వేలకు 10మిల్లీలీటర్ల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మల్కాజిగిరి ఎస్వోటీ, సరూర్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్​లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించారు.

ఇదీ చదవండి: కోపంతో రగిలిన కోడలు... అత్త ముక్కు కొరికేసింది..

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మత్తు పదార్ధాల సరఫరాపై రాచకొండ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు డిగ్రీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.8లక్షల విలువ చేసే 1.5లీటర్ల హాషిష్ ద్రావణం, 3 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నిందితులు అమీర్​పేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఉదయ్ అనే వ్యక్తి నుంచి చింతల సందీప్, షిండే సాయి చరణ్, యాప్ర నవీన్​లు మత్తు పదార్థాలను నగరానికి తీసుకొస్తుండగా దిల్​సుఖ్​నగర్​ వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ద్రావణాన్ని రూ.3వేలకు 10మిల్లీలీటర్ల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మల్కాజిగిరి ఎస్వోటీ, సరూర్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్​లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించారు.

ఇదీ చదవండి: కోపంతో రగిలిన కోడలు... అత్త ముక్కు కొరికేసింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.