ETV Bharat / jagte-raho

కిడ్నాపైన యువతిని భర్తకు అప్పగించిన పోలీసులు

author img

By

Published : Sep 29, 2020, 10:37 AM IST

తమకు నచ్చని ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతో కూతురినే తల్లిదండ్రులు కిడ్నాప్ చేసిన కథ ముగిసింది. భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను క్షేమంగా అతనికి అప్పగించారు. ఘటన జరిగిన ఒక్కరోజులోనే కేసును చేధించిన ఎస్సైని అధికారులు అభినందించారు.

Police clear kidnap case in warangal grameen district
కిడ్నాపైన యువతిని భర్తకు అప్పగించిన పోలీసులు

వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్లలో జరిగిన కిడ్నాప్ కథ సుఖాంతం అయింది.అదే గ్రామానికి భాషిపాక శివ(25), కంజర్ల రూపలక్ష్మి(23) గత నెల 29న ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లితండ్రులు భర్త కుటుంబంపై కారం పొడితో దాడి చేసి ఆమెను అపహరించారు.

భర్త శివ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రూపలక్ష్మి కొత్తగూడెంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను క్షేమంగా తీసుకొచ్చి భర్తకు అప్పగించారు. కిడ్నాప్​కు పాల్పడిన 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును ఒక్కరోజులోనే చేధించిన ఎస్సై సురేష్​ను అధికారులు అభినందించారు.

ఇదీ చూడండి:'రైతులకు పారదర్శకంగా సేవలందించడమే మాలక్ష్యం'

వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్లలో జరిగిన కిడ్నాప్ కథ సుఖాంతం అయింది.అదే గ్రామానికి భాషిపాక శివ(25), కంజర్ల రూపలక్ష్మి(23) గత నెల 29న ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లితండ్రులు భర్త కుటుంబంపై కారం పొడితో దాడి చేసి ఆమెను అపహరించారు.

భర్త శివ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రూపలక్ష్మి కొత్తగూడెంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను క్షేమంగా తీసుకొచ్చి భర్తకు అప్పగించారు. కిడ్నాప్​కు పాల్పడిన 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును ఒక్కరోజులోనే చేధించిన ఎస్సై సురేష్​ను అధికారులు అభినందించారు.

ఇదీ చూడండి:'రైతులకు పారదర్శకంగా సేవలందించడమే మాలక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.