ETV Bharat / jagte-raho

గోలివాడ క్యాంపులో చోరీ.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు - గోలివాడ క్యాంపులో దొంగతనం కేసును పోలీసులు చేధించారు

పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్​స్టేషన్ పరిధిలోని మెగా క్యాంపు కార్యాలయంలో దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రవీందర్ యాదవ్ తెలిపారు.

peddapalli district ramagundam police chase the goliwala theft case
గోలివాడ క్యాంపులో చోరీ.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు
author img

By

Published : Oct 29, 2020, 9:25 AM IST

పెద్దపల్లి అంతర్గాం మండలం గోలివాడ మెగా క్యాంప్ కార్యాలయంలో చోరీకి పాల్పడిన రాజు వీరేందర్ కుమార్, ధర్మేందర్ కుమార్ అనే నిందితులని పోలీసులు పట్టుకున్నారు. వారిరువురు మరో స్నేహితురాలితో కలిసి పథకం ప్రకారం క్యాంపు కార్యాలయంలోని బీరువా నుంచి రూ. 20 లక్షలు చోరీచేసి ఉత్తరప్రదేశ్​కు పారిపోయారని డీసీపీ రవీందర్​ యాదవ్​ తెలిపారు.

దీనిపై కంపెనీలో ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అంతర్గాం పోలీసులు తెలిపారు. రామగుండం సీఐ కరుణాకర్​ రావు ఆధ్వర్యంలో క్రైం ​పార్టీలు ఏర్పాటు చేసి రెండు బృందాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగిందన్నారు. ఆఖరికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్​ చెందిన వారని తెలిసిందన్నారు. అక్కడికి వెళ్లి విచారణ జరపగా వారు చోరీచేసినట్టు ఒప్పుకున్నారన్నారు.

ముగ్గురిలో ఇద్దరిని పట్టుకున్నామని ఒకరు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రామగుండం సీఐ కరుణాకర్ రావుతో పాటు అంతర్గాం ఎస్సై శ్రీధర్, సాంకేతిక సిబ్బందిని సీపీ ఆదేశాల మేరకు నగదు బహుమతిని అందించి డీసీపీ అభినందించారు.

peddapalli district ramagundam police chase the goliwala theft case
గోలివాడ క్యాంపులో చోరీ.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు

ఇదీ చూడండి: సురేందర్​ బ్యాంకు లాకర్​లో భారీగా నగదు, బంగారం


పెద్దపల్లి అంతర్గాం మండలం గోలివాడ మెగా క్యాంప్ కార్యాలయంలో చోరీకి పాల్పడిన రాజు వీరేందర్ కుమార్, ధర్మేందర్ కుమార్ అనే నిందితులని పోలీసులు పట్టుకున్నారు. వారిరువురు మరో స్నేహితురాలితో కలిసి పథకం ప్రకారం క్యాంపు కార్యాలయంలోని బీరువా నుంచి రూ. 20 లక్షలు చోరీచేసి ఉత్తరప్రదేశ్​కు పారిపోయారని డీసీపీ రవీందర్​ యాదవ్​ తెలిపారు.

దీనిపై కంపెనీలో ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అంతర్గాం పోలీసులు తెలిపారు. రామగుండం సీఐ కరుణాకర్​ రావు ఆధ్వర్యంలో క్రైం ​పార్టీలు ఏర్పాటు చేసి రెండు బృందాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగిందన్నారు. ఆఖరికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్​ చెందిన వారని తెలిసిందన్నారు. అక్కడికి వెళ్లి విచారణ జరపగా వారు చోరీచేసినట్టు ఒప్పుకున్నారన్నారు.

ముగ్గురిలో ఇద్దరిని పట్టుకున్నామని ఒకరు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రామగుండం సీఐ కరుణాకర్ రావుతో పాటు అంతర్గాం ఎస్సై శ్రీధర్, సాంకేతిక సిబ్బందిని సీపీ ఆదేశాల మేరకు నగదు బహుమతిని అందించి డీసీపీ అభినందించారు.

peddapalli district ramagundam police chase the goliwala theft case
గోలివాడ క్యాంపులో చోరీ.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు

ఇదీ చూడండి: సురేందర్​ బ్యాంకు లాకర్​లో భారీగా నగదు, బంగారం


For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.