ETV Bharat / jagte-raho

సారీ ఐ మిస్​ యూ అంటూ.. ఓ యువకుడు ఆత్మహత్య - వరపర్తి జిల్లా తాజా వార్తలు

మరో పదిహేను రోజుల్లో పెళ్లి. ఇంతలో ఏమైందో తెలియదు సారీ ఐ మిస్ యూ.. అంటూ కాబోయే భార్యకు మెస్సెజ్ పంపి మరీ ఓ యువకుడు ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా గోపన్​పేటలో చోటుచేసుకుంది.

one-person-suicide-at-gopanpeta-in-wanaparthy-district
సారీ ఐ మిస్​ యూ అంటూ.. ఓ యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Nov 10, 2020, 8:59 AM IST

వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోపన్​పేట గ్రామానికి చెందిన వెంకటేష్ (26) తెల్లవారుజామున కాబోయే భార్యకు సారీ ఐ మిస్​ యూ అని మెస్సెజ్​ చేశాడు. అనంతరం ఇంటి ముందు వేపచెట్టుకున్న ఊయాల తాడుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో వాళ్లు బయటకు రాకుండా తలుపు బయట గడియపెట్టి మరీ బలవన్మరణం చెందాడు. ఉదయం అతని కుటుంబసభ్యులు లేచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తలుపులు తెరుచుకోకపోవడం వల్ల కిటికీలో నుంచి వాకిట్లోకి చూశారు. అంతే తాడుకు వేలాడుతూ కనిపించిన వెంకటేష్​ను చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. దానిని గమనించిన చుట్టుపక్కల వారు తలపుగడియ తీశారు. కాగా అప్పటికే వెంకటేష్ మృతి చెందాడు.

వెంకటేష్​కు సర్వ మండలానికి చెందిన ఓ అమ్మాయితో ఈనెల 25 పెళ్లి నిర్ణయించారు. ఆ పెళ్లి తనకు ఇష్టం లేకపోవటం వల్లే ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు మదనాపురం పోలీసులకు మృతుని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపాజీ తెలిపారు.

వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోపన్​పేట గ్రామానికి చెందిన వెంకటేష్ (26) తెల్లవారుజామున కాబోయే భార్యకు సారీ ఐ మిస్​ యూ అని మెస్సెజ్​ చేశాడు. అనంతరం ఇంటి ముందు వేపచెట్టుకున్న ఊయాల తాడుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో వాళ్లు బయటకు రాకుండా తలుపు బయట గడియపెట్టి మరీ బలవన్మరణం చెందాడు. ఉదయం అతని కుటుంబసభ్యులు లేచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తలుపులు తెరుచుకోకపోవడం వల్ల కిటికీలో నుంచి వాకిట్లోకి చూశారు. అంతే తాడుకు వేలాడుతూ కనిపించిన వెంకటేష్​ను చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. దానిని గమనించిన చుట్టుపక్కల వారు తలపుగడియ తీశారు. కాగా అప్పటికే వెంకటేష్ మృతి చెందాడు.

వెంకటేష్​కు సర్వ మండలానికి చెందిన ఓ అమ్మాయితో ఈనెల 25 పెళ్లి నిర్ణయించారు. ఆ పెళ్లి తనకు ఇష్టం లేకపోవటం వల్లే ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు మదనాపురం పోలీసులకు మృతుని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపాజీ తెలిపారు.

ఇదీ చూడండి: ఓఆర్​ఆర్​పై రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.