ETV Bharat / jagte-raho

సాయం చేసేందుకు వెళ్లి... ప్రాణాలు పొగొట్టుకున్నాడు!

author img

By

Published : Aug 15, 2020, 5:46 PM IST

సాయం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం వెంకటాపురంలో జరిగింది.

one-person-died-in-srikakulam-dst-due-to-current-shock
ఏపీ: సాయం చేసేందుకు వెళ్లి...ప్రాణాలు పొగొట్టుకున్నాడు!

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం వెంకటాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. గ్రామంలో ఓ వ్యక్తి భవనానికి పైకప్పు రేకులు వేసేందుకు సమీపంలోని పొలంలో వ్యవసాయ పని చేసుకుంటున్న మంచాల గణపతి(55) అనే కూలీని సాయం చేసేందుకు పిలిచాడు.

గణపతి పొలంలోనుంచి వచ్చి పైకప్పు రేకులు అందిస్తుండగా భవనానికి ఆనుకొని ఉన్న విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​కు ఇనుప పైపులు తగిలాయి. గణపతి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. గణపతికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం వెంకటాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. గ్రామంలో ఓ వ్యక్తి భవనానికి పైకప్పు రేకులు వేసేందుకు సమీపంలోని పొలంలో వ్యవసాయ పని చేసుకుంటున్న మంచాల గణపతి(55) అనే కూలీని సాయం చేసేందుకు పిలిచాడు.

గణపతి పొలంలోనుంచి వచ్చి పైకప్పు రేకులు అందిస్తుండగా భవనానికి ఆనుకొని ఉన్న విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​కు ఇనుప పైపులు తగిలాయి. గణపతి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. గణపతికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.