ETV Bharat / jagte-raho

అమ్మ ప్రేమ మరిచి... కన్నబిడ్డను అమ్ముకుంది..!

author img

By

Published : Nov 21, 2020, 11:28 PM IST

నవమాసాలు మోసిన కన్నబిడ్డను పుట్టిన రోజుల వ్యవధిలోనే అమ్ముకుందో తల్లి. ఆ మహిళకు పురుడు పోసిన నర్సులే ఆ బిడ్డను కొనుగోలు చేయటం మరో విస్మయం. ఏపీలోని గుంటూరులో ఈ నెల 11న ఓ ఆడపిల్లకు జన్మనిచ్చిన మహిళ... రూ.75 వేలకు కన్నబిడ్డను హెడ్ నర్స్ కు అమ్మిన ఉదంతం ఇది.

అమ్మ ప్రేమ మరిచి... కన్నబిడ్డను అమ్ముకుంది..!
అమ్మ ప్రేమ మరిచి... కన్నబిడ్డను అమ్ముకుంది..!

ఏపీలోని గుంటూరు చంద్రయ్యనగర్​లో నివాసం ఉంటున్న ఓ మహిళకు వివాహమై ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఆమె భర్త 5 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత ఆమె తన అక్క వద్ద ఉంటూ మిషన్ కుడుతూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఓ దర్జీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. నెలలు నిండిన ఆమె ఈ నెల 11న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది.

ఈనెల 19న సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రిలో ఆమెకు సత్యవతి అనే మధ్యవర్తి పరిచయమైంది. జీజీహెచ్​లో పనిచేస్తున్న హెడ్ నర్స్ నారాయణమ్మకు పిల్లలు లేరు. ఆమెకు పాపను ఇస్తే రూ.75 వేలు ఇప్పిస్తామని మధ్యవర్తి చెప్పింది. హెడ్ నర్స్ నారాయణమ్మ దగ్గర ఆ మధ్యవర్తి లక్ష రూపాయలు తీసుకుంది. బాలింత తల్లికి రూ.75 వేలు ఇచ్చి, తాను రూ.25 వేలు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 19వ తేదీన గుంటూరులోని అమరావతి రోడ్డులో నగదు ఇచ్చి పాపను తీసుకున్నారు. విషయం వార్డు వాలంటీర్ల ద్వారా చైల్డ్ లైన్ అధికారులకు తెలిసింది.

ఈ విషయంపై చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు స్థానిక అరండల్​పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అరండల్​పేట పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న దర్జీ పరారీలో ఉన్నారు. బాధ్యతాయుతమైన నర్స్ ఉద్యోగం చేస్తూ ఆమె పాపను కొనుగోలు చేయటం సరికాదని సీఐ రమణకుమార్ అన్నారు.

అమ్మ ప్రేమ మరిచి... కన్నబిడ్డను అమ్ముకుంది..!

ఇదీ చదవండి : గ్రేటర్​ పోరు... 68 నామినేషన్లు తిరస్కరణ

ఏపీలోని గుంటూరు చంద్రయ్యనగర్​లో నివాసం ఉంటున్న ఓ మహిళకు వివాహమై ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఆమె భర్త 5 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత ఆమె తన అక్క వద్ద ఉంటూ మిషన్ కుడుతూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఓ దర్జీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. నెలలు నిండిన ఆమె ఈ నెల 11న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది.

ఈనెల 19న సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రిలో ఆమెకు సత్యవతి అనే మధ్యవర్తి పరిచయమైంది. జీజీహెచ్​లో పనిచేస్తున్న హెడ్ నర్స్ నారాయణమ్మకు పిల్లలు లేరు. ఆమెకు పాపను ఇస్తే రూ.75 వేలు ఇప్పిస్తామని మధ్యవర్తి చెప్పింది. హెడ్ నర్స్ నారాయణమ్మ దగ్గర ఆ మధ్యవర్తి లక్ష రూపాయలు తీసుకుంది. బాలింత తల్లికి రూ.75 వేలు ఇచ్చి, తాను రూ.25 వేలు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 19వ తేదీన గుంటూరులోని అమరావతి రోడ్డులో నగదు ఇచ్చి పాపను తీసుకున్నారు. విషయం వార్డు వాలంటీర్ల ద్వారా చైల్డ్ లైన్ అధికారులకు తెలిసింది.

ఈ విషయంపై చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు స్థానిక అరండల్​పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అరండల్​పేట పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న దర్జీ పరారీలో ఉన్నారు. బాధ్యతాయుతమైన నర్స్ ఉద్యోగం చేస్తూ ఆమె పాపను కొనుగోలు చేయటం సరికాదని సీఐ రమణకుమార్ అన్నారు.

అమ్మ ప్రేమ మరిచి... కన్నబిడ్డను అమ్ముకుంది..!

ఇదీ చదవండి : గ్రేటర్​ పోరు... 68 నామినేషన్లు తిరస్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.