ETV Bharat / jagte-raho

వైద్యానికి డబ్బులు లేక.. చేనేత కార్మికుడు బలవన్మరణం

అనారోగ్యానికి గురైన చేనేత కార్మికుడు వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక.. ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది.

author img

By

Published : Dec 3, 2020, 12:38 PM IST

suicide
వైద్యానికి డబ్బులు లేక... చేనేత కార్మికుడు బలవన్మరణం

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ధర్మవరంలో వైద్యానికి డబ్బులు లేక ఉరివేసుకొని చేనేత కార్మికుడు చిట్టా రామకృష్ణ మృతి చెందాడు. పట్టణంలోని శాంతినగర్​కు చెందిన రామకృష్ణ.. మగ్గం కార్మికుడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడ్తున్నాడు. పని చేయలేక ఇంట్లోనే ఉన్నాడు. ఆర్థిక సమస్యలతో వైద్యం చేయించుకోలేకపోయాడు.

ఇంటి నుంచి బయటకు వెళ్లి రైల్వే గేట్​ వద్ద షెడ్డులో ఉన్న దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ధర్మవరంలో వైద్యానికి డబ్బులు లేక ఉరివేసుకొని చేనేత కార్మికుడు చిట్టా రామకృష్ణ మృతి చెందాడు. పట్టణంలోని శాంతినగర్​కు చెందిన రామకృష్ణ.. మగ్గం కార్మికుడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడ్తున్నాడు. పని చేయలేక ఇంట్లోనే ఉన్నాడు. ఆర్థిక సమస్యలతో వైద్యం చేయించుకోలేకపోయాడు.

ఇంటి నుంచి బయటకు వెళ్లి రైల్వే గేట్​ వద్ద షెడ్డులో ఉన్న దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.