యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం వద్ద హైడ్రోక్లోరిక్ ఆమ్లం లోడ్తో ఉన్న ట్యాంకర్ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కాళ్లు కోల్పోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఏపీలోని రాజమండ్రి పాగ్గొండ నుంచి హైదరాబాద్ బొల్లారంనకు హెచ్సీఎల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్.. ధర్మోజి గూడెం వద్ద అకస్మాత్తుగా పంక్చర్ అయింది. మరమ్మతుల కోసం డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. ఆ సమయంలో వెనకనుంచి వస్తున్న కారు.. ట్యాంకర్ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ట్యాంకర్లో నుంచి యాసిడ్ బయటకు వచ్చి రోడ్డుపై పొగ కమ్ముకుంది. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వాహనాన్ని ఖాళీ స్థలంలో నిలిపించారు.
ఇదీ చదవండి: ఓఆర్ఆర్పై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి