ETV Bharat / jagte-raho

రూ. 21లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత

author img

By

Published : Jan 9, 2021, 1:13 PM IST

ఏపీలోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల పరిధిలో గంజాయితో వెళ్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ. 21 లక్షల విలువ చేసే గంజాయిని వాహనంలో గుర్తించారు.

marizuana, vizianagaram
గంజాయి, విజయనగరం

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్​పోస్టు వద్ద... గంజాయితో వెళ్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు బొలేరోను తనిఖీ చేయగా.. 30 సంచుల గంజాయి బయటపడింది.

డ్రైవర్​తో పాటు అతని సహయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ బీహార్​కు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 21 లక్షలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు.

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్​పోస్టు వద్ద... గంజాయితో వెళ్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు బొలేరోను తనిఖీ చేయగా.. 30 సంచుల గంజాయి బయటపడింది.

డ్రైవర్​తో పాటు అతని సహయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ బీహార్​కు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 21 లక్షలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు.

ఇదీ చదవండి: 'నాన్న.. నువ్వు నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.