జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతోన్న మనోహర్ కుమార్, విజయ్ కుమార్ అనే ఇద్దరు దొంగలను మంగళ్హాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షల నగదు, 4.25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏం జరిగిందంటే..
అఘాపురాలో నివాసం ఉంటున్న సురేశ్ భాటి అనే వ్యక్తి ఇంట్లో ఈ నెల 4న చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సురేశ్ ఇంటికి వచ్చే సరికి బీరువా తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
సీసీ పుటేజీల ద్వారా చోరీకి పాల్పడిన మనోహర్ కుమార్ కెమవత్, విజయ్కుమార్ కెమవత్ అనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ నరేందర్రెడ్డి తెలిపారు. వీరిద్దరు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా వివరించారు.
ఇదీ చూడండి: లైంగిక దాడి కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కారాగారం