ETV Bharat / jagte-raho

పోలీసు స్టేషన్​కు పిలిచారని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య - రేవూరులో వ్యక్తి ఆత్మహత్య

పోలీసు స్టేషన్​కు పిలిపించడాన్ని అవమానంగా భావించి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన... సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం రేవూరులో చోటుచేసుకుంది. సూసైడ్ నోట్​లో స్థానిక ఎస్సై, సిమెంట్​ కంపెనీ యాజమాన్యం కారణంటూ పేర్కొన్నాడు.

man suicide in revuru suryapeta district
పోలీసు స్టేషన్​కు పిలిచారని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Sep 24, 2020, 2:15 PM IST

man suicide in revuru suryapeta district
పోలీసు స్టేషన్​కు పిలిచారని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా మేల్లచెర్వు మండలం రేవూరులో... ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ సిమెంట్ కర్మాగార యాజమాన్యంతో... ఆంజనేయులుకు భూమి విషయంలో వివాదం ఏర్పడింది. దీంతో ఆంజనేయులుపై యాజమాన్యం పోలీసు స్టేషన్​లో కేసు పెట్టాడు. ఆంజనేయులును ఎస్సై స్టేషన్​కు పిలిపించాడు.

అవమానంగా భావించి... తన ఆత్మహత్యకు ఎస్సై, సిమెంట్ కంపెనీ యాజమాన్యమే కారణమంటూ సూసైడ్​ నోట్​ రాసి పురుగుల మందు తాగాడు. హుజూర్​నగర్​ ఏరియా ఆసుపత్రికి తరలించగా... అప్పటికే పరిస్థితి విషమించింది. దీంతో ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇదీ చూడండి: కరోనా సోకిందని యువకుడి ఆత్మహత్య

man suicide in revuru suryapeta district
పోలీసు స్టేషన్​కు పిలిచారని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా మేల్లచెర్వు మండలం రేవూరులో... ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ సిమెంట్ కర్మాగార యాజమాన్యంతో... ఆంజనేయులుకు భూమి విషయంలో వివాదం ఏర్పడింది. దీంతో ఆంజనేయులుపై యాజమాన్యం పోలీసు స్టేషన్​లో కేసు పెట్టాడు. ఆంజనేయులును ఎస్సై స్టేషన్​కు పిలిపించాడు.

అవమానంగా భావించి... తన ఆత్మహత్యకు ఎస్సై, సిమెంట్ కంపెనీ యాజమాన్యమే కారణమంటూ సూసైడ్​ నోట్​ రాసి పురుగుల మందు తాగాడు. హుజూర్​నగర్​ ఏరియా ఆసుపత్రికి తరలించగా... అప్పటికే పరిస్థితి విషమించింది. దీంతో ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇదీ చూడండి: కరోనా సోకిందని యువకుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.