ETV Bharat / jagte-raho

ఎంజీఎంలో కొవిడ్​తో వ్యక్తి మృతి.. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం

author img

By

Published : Jul 28, 2020, 6:27 PM IST

Updated : Jul 28, 2020, 7:11 PM IST

Man dies with corona at warangal MGM hospital
ఎంజీఎంలో కొవిడ్​తో వ్యక్తి మృతి.. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం

18:26 July 28

ఎంజీఎంలో కొవిడ్​తో వ్యక్తి మృతి.. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం

వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలోని కొవిడ్​ వార్డులో రోగి బంధువులు అద్దాలను ధ్వంసం చేశారు. జిల్లాలోని ఐనవోలుకు చెందిన ఉప్పలయ్య శ్వాస సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరాడు. కరోనా సోకిందనే అనుమానంతో వైద్యులు... కొవిడ్​ వార్డులో చేర్చి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఉప్పలయ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డారు. 

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఉప్పలయ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డారని బంధువులు ఆరోపించారు. కొవిడ్​ వార్డులోని అద్దాలను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు... ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

18:26 July 28

ఎంజీఎంలో కొవిడ్​తో వ్యక్తి మృతి.. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం

వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలోని కొవిడ్​ వార్డులో రోగి బంధువులు అద్దాలను ధ్వంసం చేశారు. జిల్లాలోని ఐనవోలుకు చెందిన ఉప్పలయ్య శ్వాస సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరాడు. కరోనా సోకిందనే అనుమానంతో వైద్యులు... కొవిడ్​ వార్డులో చేర్చి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఉప్పలయ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డారు. 

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఉప్పలయ్య పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డారని బంధువులు ఆరోపించారు. కొవిడ్​ వార్డులోని అద్దాలను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు... ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 28, 2020, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.