కరోనా వ్యాప్తి నివారణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులపై గతంలో విమర్శలు చేసిన వారు ఇప్పుడు అభినందిస్తున్నారు. కానీ కొందరు అధికారులు మాత్రం ఆ శాఖకు అప్రతిష్ఠ తీసుకొస్తున్నారు.
కామారెడ్డి జిల్లా మద్నూర్ ఠాణాలో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ అక్రమంగా ఇసుక రవాణా చేసే వ్యక్తితో తనకు ఇవ్వాల్సిన డబ్బులు కూరగాయలు దుకాణంలో ఇవ్వాలని సాగిస్తున్న సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ సంఘటనపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. పూర్తి విచారణ చేసి సదరు కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్పై సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా ఎస్పీ శ్వేత తెలిపారు.