ETV Bharat / jagte-raho

సొంత తమ్ముడినే కిరాయి హంతకులతో చంపించాడు.. - సంగారెడ్డి జిల్లా వార్తలు

సొంత తమ్ముడినే కర్కశంగా చంపించాడు ఓ అన్న. ఆక్రమించిన 30 గజాల స్థలం గురించి అడిగినందుకు తమ్ముడిని సొంత అన్న కిరాయి హంతకులతో హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారంలో చోటుచేసుకుంది. ఆరుగురు నిందితుల్ని బొల్లారం పోలీసులు అరెస్టు చేశారు.

killed-his-own-younger-brother-with-mercenaries-in-sangareddy-district
సొంత తమ్ముడినే కిరాయి హంతకులతో చంపించాడు..
author img

By

Published : Oct 21, 2020, 4:01 PM IST

Updated : Oct 21, 2020, 8:38 PM IST

సంగారెడ్డి జిల్లా బొల్లారం బీసీ కాలనీకి చెందిన వెంకటేష్, యాదగిరి అనే అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా స్థల వివాదం నడుస్తోంది. తండ్రి పంచి ఇచ్చిన స్థలంలో వెంకటేష్​కి చెందిన 30 గజాల స్థలాన్ని అన్న యాదగిరి ఆక్రమించాడు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అయితే ఎప్పటికైనా తన సోదరుని వల్ల ఇబ్బంది ఉంటుందని ఆలోచించిన యాదగిరి... ఐదుగురు కిరాయి హంతకులతో లక్ష రూపాయలకు మాట్లాడుకుని ఈ నెల 10న రాత్రి హత్య చేయించాడు.

కొంత నగదు ముందుగానే హంతకులకు యాదగిరి ఇవ్వడం వల్ల వారు వెంకటేష్​ను ఆటో కిరాయికి రమ్మని పిలిచి జిన్నారం అటవీ ప్రాంతంలో హత్య చేశారు. నిందితులు కిరాయికి మాట్లాడుకున్న మిగతా నగదు ఇచ్చే సమయంలో యాదగిరితో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు నిందితుల నుంచి 6 చరవాణులు, ఒక కత్తి, 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సొంత తమ్ముడినే కిరాయి హంతకులతో చంపించాడు..

ఇవీ చూడండి: హుస్సేన్​సాగర్​లో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సంగారెడ్డి జిల్లా బొల్లారం బీసీ కాలనీకి చెందిన వెంకటేష్, యాదగిరి అనే అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా స్థల వివాదం నడుస్తోంది. తండ్రి పంచి ఇచ్చిన స్థలంలో వెంకటేష్​కి చెందిన 30 గజాల స్థలాన్ని అన్న యాదగిరి ఆక్రమించాడు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అయితే ఎప్పటికైనా తన సోదరుని వల్ల ఇబ్బంది ఉంటుందని ఆలోచించిన యాదగిరి... ఐదుగురు కిరాయి హంతకులతో లక్ష రూపాయలకు మాట్లాడుకుని ఈ నెల 10న రాత్రి హత్య చేయించాడు.

కొంత నగదు ముందుగానే హంతకులకు యాదగిరి ఇవ్వడం వల్ల వారు వెంకటేష్​ను ఆటో కిరాయికి రమ్మని పిలిచి జిన్నారం అటవీ ప్రాంతంలో హత్య చేశారు. నిందితులు కిరాయికి మాట్లాడుకున్న మిగతా నగదు ఇచ్చే సమయంలో యాదగిరితో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు నిందితుల నుంచి 6 చరవాణులు, ఒక కత్తి, 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సొంత తమ్ముడినే కిరాయి హంతకులతో చంపించాడు..

ఇవీ చూడండి: హుస్సేన్​సాగర్​లో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Last Updated : Oct 21, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.