ETV Bharat / jagte-raho

విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన టీచర్​ అరెస్ట్​

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే, సభ్యసమాజం సిగ్గుపడేలా వ్యవహరించాడు. పరీక్షల్లో సహాయం చేస్తానంటూ పదో తరగతి విద్యార్థిని పై అత్యాచారాయత్నానికి ఒడిగట్టాడు. ఫలితంగా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని గోప్యంగా దాచిపెట్టిన సూర్యాపేట జిల్లా విద్యాధికారికి కలెక్టర్​ అమోయ్ కుమార్ షోకాజు నోటీసు పంపించారు.

author img

By

Published : Mar 29, 2019, 4:57 PM IST

కీచక టీచర్​ అరెస్ట్​
కీచక టీచర్​ అరెస్ట్​
సూర్యాపేట మండలం పాండు నాయక్ తండా పాఠశాలకు చెందిన కటకం నరసింహ స్వామి ఇటీవల ప్రారంభమైన పదోతరగతి పరీక్షకు ఇన్విజిలేషన్ విధులు నిర్వహిస్తున్నాడు. తాను విధులు నిర్వహిస్తున్న కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఓ బాలికకు సహాయం చేస్తానని నమ్మించి విద్యానగర్​లో ఉండే యూనియన్ కార్యాలయానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరులేకపోవటంతో విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఎలాగో తప్పించుకున్న విద్యార్ధిని తన సంరక్షకురాలైన పెద్దమ్మకు చెప్పి బోరున విలపించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు 100 నెంబర్​కు వచ్చిన బాధితుల ఫిర్యాదు జాబితా ఆధారంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. సదరు ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేశారు. బాలికపై జరిగిన అత్యాచారయత్నం జరిగిన సమాచారాన్ని కలెక్టర్​కు అందించని కారణంగా డీఈవో మదన్ మోహన్​కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ఫిర్యాదు రాలేదని సాకులు చెప్పిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఫిర్యాదుపై క్షణాల్లో వాలిపోయే పోలీసులు ఇంత పెద్ద నేరం జరిగినప్పటికీ కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారన్న ఆరోపణలు వినపడుతున్నాయి.

ఇవీ చూడండి: ఈతకు వెళ్ళిన చిన్నారులు... విగతజీవులైనారు

కీచక టీచర్​ అరెస్ట్​
సూర్యాపేట మండలం పాండు నాయక్ తండా పాఠశాలకు చెందిన కటకం నరసింహ స్వామి ఇటీవల ప్రారంభమైన పదోతరగతి పరీక్షకు ఇన్విజిలేషన్ విధులు నిర్వహిస్తున్నాడు. తాను విధులు నిర్వహిస్తున్న కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఓ బాలికకు సహాయం చేస్తానని నమ్మించి విద్యానగర్​లో ఉండే యూనియన్ కార్యాలయానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరులేకపోవటంతో విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఎలాగో తప్పించుకున్న విద్యార్ధిని తన సంరక్షకురాలైన పెద్దమ్మకు చెప్పి బోరున విలపించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు 100 నెంబర్​కు వచ్చిన బాధితుల ఫిర్యాదు జాబితా ఆధారంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. సదరు ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేశారు. బాలికపై జరిగిన అత్యాచారయత్నం జరిగిన సమాచారాన్ని కలెక్టర్​కు అందించని కారణంగా డీఈవో మదన్ మోహన్​కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ఫిర్యాదు రాలేదని సాకులు చెప్పిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఫిర్యాదుపై క్షణాల్లో వాలిపోయే పోలీసులు ఇంత పెద్ద నేరం జరిగినప్పటికీ కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారన్న ఆరోపణలు వినపడుతున్నాయి.

ఇవీ చూడండి: ఈతకు వెళ్ళిన చిన్నారులు... విగతజీవులైనారు

Intro:Slug : TG_NLG_22_29_KEECHAKA_TEACHER_SUSPEND_AVB_C1

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సూర్యాపేట.

గమనిక : నిందితుడి ఫోటో FTP లో వేస్తాను. DEO విజువల్ ఒంటరిగా మాట్లాడుతున్న వ్యక్తి.

( ) విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు వక్రబుద్దిని చూపాడు. పరీక్షల్లో సహాయం చేస్తానంటూ పదో తరగతి విద్యార్థిని పై అత్యాచారాయత్నానికి ఒడిగట్టాడు. సభ్యసమాజం సిగ్గుపడేలా వ్యవహరించాడు. ఫలితంగా ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై సస్పెన్షన్ అయ్యాడు. ఈ విషయాన్ని గోప్యంగా దాచిపెట్టిన జిల్లా విద్యాధికారి కి జిల్లా పాలనాధికారి ఆమోయ్ కుమార్ షోకాజు నోటీసు పంపించారు. ఓ విద్యార్థినిపై అగాయిత్యానికి పాల్పడి నాలుగు రోజులు గడుస్తున్నా... పోలీసులు ఎట్టకేలకు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. చిన్నపాటి ఫిర్యాదుతోనే భయ బ్రాంతులను చేసే పోలీసులు ఈ కేసును మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరించారు.

వాయిస్ ఓవర్ :

సూర్యాపేట మండలం వస్త్రం తండాలోని పాండు నాయక్ తండా పాఠశాలకు చెందిన కటకం నరసింహ స్వామి అనే ఉపాధ్యాయుడు మరో నాలుగేళ్లలో రిటైర్ కానున్నాడు. ,అయితే ఇటీవల ప్రారంభమైన పదోతరగతి పరీక్షకు ఇన్విజిలేషన్ విధులు నిర్వహిస్తున్నారు. తాను విధులు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఓ బాలికను ఈ పరీక్షల్లో సహాయం చేస్తానని నమ్మించాడు. పరీక్షల విషయం పై సలహాలు చెపుతా అంటూ...ద్విచక్ర వాహనం పై కూర్చోపెట్టుకుని పట్టణంలోని విద్యానగర్ లో ఉండే యూనియన్ కార్యాలయానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరులేకపోవడంతో విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఎలాగో తప్పించుకున్న విద్యార్ధినీ తన సంరక్షకురాలైన తన పెద్దమ్మకు చెప్పి బోరున విలపించింది. విషయం తెలుసుకున్న పెద్దమ్మ 100 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ విషయం పోలీసుల వరకు రావడంతో రంగంలోకి దిగిన పెద్దమనుషులు అందరితో రాజీ ప్రయత్నాలకు కృషి సీజేదారు. దీనిపై పోలీసులు మాత్రం బాధితుల నుంచి ఫిర్యాదు రాలేదని చెపుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు 100 నంబర్ నంబర్ కి వచ్చిన బాధితుల జాబితాలో ఆధారంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు . సదరు ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేశారు. అయితే బాలికపై జరిగిన అత్యాచారయత్నం విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి మదన్ మోహన్ జిల్లా పాలనాధికారి కి చెప్పకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి కి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఫిర్యాదు రాలేదని సాకులు చెప్పిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఫిర్యాదు పై క్షణాల్లో వాలిపోయే పోలీసులు ఇంత పెద్ద నేరం జరిగినప్పటికీ కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారన్న ఆరోపణలు వినపడుతున్నాయి . దీనిపై జిల్లా పాలనాధికారి జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుకు మౌకింగా ఫిర్యాదు చేశారు...byte
1. ఆమోయ్ కుమార్ , కలెక్టర్ - సుర్యాపేట.


Body:....


Conclusion:.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.