నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హన్మకొండ- హైదరాబాద్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారు ఓ స్కూటీని ఢీ కొట్టి పక్కనే ఉన్న గోతిలో పడింది. వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదంలో మాధవ రెడ్డి, ఆయనతో ప్రయాణిస్తోన్న మరో వ్యక్తి, కారు డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడడంతో అతన్ని హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయన మరో వాహనంలో బయలుదేరి వెళ్లారు.
ఇదీ చదవండి: యూపీలో కంటైనర్ బోల్తా- ఆరుగురు మృతి