ETV Bharat / jagte-raho

కృష్ణా నదిలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి

author img

By

Published : Oct 4, 2020, 12:26 AM IST

కృష్ణా నదిలో ఐదుగురు గల్లంతైన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద జరిగింది. వీరిలో ఒకరు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వీరయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

కృష్ణా నదిలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి
కృష్ణా నదిలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి

ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వైకుంఠపురానికి వైకుంఠపురం లో నివసించే వీరయ్య (45) తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా పనులు లేని కారణంగా... తన ఇద్దరు కుమారులైన సూర్య (19), సాయి కలిసి రొయ్యూరులోని నదికి వెళ్లాడు. చేపలు పట్టడానికి వెళ్లిన విషయం తెలుసుకుని వీరయ్య స్నేహితులు వెంకటేశ్వరరావు(35) రంజిత్(35) సైతం నది వద్దకు వెళ్లారు. చేపలు పట్టడం పూర్తయిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో వీరయ్య, అతని చిన్న కుమారుడు సూర్యతో పాటు స్నేహితులు వెంకటేశ్వరరావు, రంజిత్ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వీరయ్య పెద్ద కుమారుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో వీరయ్య మృతదేహం లభించింది.

ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వైకుంఠపురానికి వైకుంఠపురం లో నివసించే వీరయ్య (45) తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా పనులు లేని కారణంగా... తన ఇద్దరు కుమారులైన సూర్య (19), సాయి కలిసి రొయ్యూరులోని నదికి వెళ్లాడు. చేపలు పట్టడానికి వెళ్లిన విషయం తెలుసుకుని వీరయ్య స్నేహితులు వెంకటేశ్వరరావు(35) రంజిత్(35) సైతం నది వద్దకు వెళ్లారు. చేపలు పట్టడం పూర్తయిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో వీరయ్య, అతని చిన్న కుమారుడు సూర్యతో పాటు స్నేహితులు వెంకటేశ్వరరావు, రంజిత్ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వీరయ్య పెద్ద కుమారుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో వీరయ్య మృతదేహం లభించింది.

ఇదీ చదవండి: జీవనోపాధి కల్పిస్తే.. వలసలు తగ్గుతాయి : గవర్నర్ తమిళిసై

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.