హైదరాబాద్కు చెందిన సిరాజ్ కారుపై అమెరికాలోని చికాగోలో దుండగులు కాల్పులు జరిపారు. దాడిలో సిరాజ్ తృటిలో తప్పించుకున్నాడు. పాతబస్తీ చంచల్గూడ ప్రాంతానికి చెందిన సిరాజ్ సయ్యద్ చికాగోలో మూడేళ్లుగా ఉబర్ క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 4న తెల్లవారుజామున 4:00 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుడగా... నార్త్ డెవాన్ వద్దకు రాగానే రెండు కార్లలో వచ్చిన దుండగలు అతని కారుపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.
దుండగుల దాడిలో సిరాజ్ సురక్షితంగా బయటపడ్డాడు. దాడి నుంచి తేరుకున్న బాధితుడు... చికాగో పోలీసులకు సమాచారం అందించాడు. కేసులో చికాగో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘనటపై స్పందించిన ఎంబీటి నేత అమ్జద్ ఉల్లా ఖాన్... ఈ విషయాన్ని విదేశాంగ మంత్రితో పాటు యుఎస్ఎలోని భారత రాయబారి, కాగోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు.